విద్యుత్ వాహనాల పరుగు
ఇంజిన్ మోతే లేకుండా విద్యుత్ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం
మూడు నెలల్లో 21,000 విక్రయాలు
జీవితకాల పన్ను రూపేణా రూ.120 కోట్ల మాఫీ
ఈనాడు - హైదరాబాద్
ఇంజిన్ మోతే లేకుండా విద్యుత్ వాహనాలు(ఈవీ) రహదారులపై దూసుకెళ్తున్నాయి. ఈ విభాగంలో ద్విచక్ర వాహనాలు, కార్లే కాదు.. ఆటోలు, బస్సులు కూడా ఉన్నాయి. పెట్రోలు, డీజిల్తో నడిచే వాహనాలతో పోలిస్తే బ్యాటరీ కలిగి ఉండే విద్యుత్ వాహనాలు కొంచెం ఖరీదైనా, నగరాల్లోని వాహనదారులు వీటికి మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యుత్ వాహనాలకు జీవితకాల పన్ను మినహాయిస్తుండడం కలిసొస్తోంది. కేవలం ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ వ్యయం మాత్రమే ఉంటోంది. హైదరాబాద్లో చూస్తే గత మూడు నెలల్లోనే 21,000 విద్యుత్తు వాహనాలు రహదారులపైకి అదనంగా వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు నాలుగో వారం వరకు మొత్తం 38,600 విద్యుత్ వాహనాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యాయని, ఇందులో 33,000 ద్విచక్ర వాహనాలేనని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు 25వరకు విద్యుత్ వాహన యజమానులకు మాఫీ చేసిన జీవితకాల పన్ను మొత్తం రూ.120 కోట్లుగా ఉంది.
చలో ఈవీ...
హీరో, హోండా, బజాజ్లతో పాటు మరో పది కంపెనీలు విద్యుత్తు ద్విచక్ర వాహనాలను విక్రయిస్తున్నాయి. వీటికి ప్రచారం చేసేందుకు సెలబ్రిటీలను వినియోగిస్తున్నాయి. విద్యుత్ బైక్లు తయారుచేస్తున్న ఓ కంపెనీ సినీ కథానాయకుడు వెంకటేష్ను ప్రచారకర్తగా నియమించుకుంది. పర్యావరణ హితంగా ఉన్నందునే విద్యుత్తు కార్లు కొంటున్నట్లు ప్రైవేటు సంస్థల అధిపతులు, బ్యాంకర్లు, వ్యాపారులు, సంపన్న యువత చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట తెలంగాణ రాష్ట్రమంత్రి ఒకరు తన వ్యక్తిగత సిబ్బందికి విద్యుత్ బైకులు ఇప్పించారు. ఈ కార్లలో చూస్తే టాటా వాహనాలు ముందుండగా, తర్వాతి స్థానాల్లో కియా, మారుతీ సుజుకీ ఉన్నాయి. మారుతీ సుజుకీ కొద్దినెలల కిందట గ్రాండ్ విటారా పేరుతో విద్యుత్/పెట్రోలుతో నడిచే హైబ్రిడ్ కారును విడుదల చేసింది. ఈ కారు బ్యాటరీతో నడుస్తుంది. ఒకవేళ అవసరమైతే పెట్రోలుతో కూడా ప్రయాణించే వీలుంది. ద్విచక్ర వాహనదారులు బ్యాటరీలను ఇళ్ల ఆవరణల్లోనే ఛార్జింగ్ చేసుకుంటుండగా.. కార్ల యజమానులు మాత్రం ఛార్జింగ్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
విద్యుత్ వాహనాలు నడిపే వారికీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. గరిష్ఠంగా 25 కిలోమీటర్ల లోపు వేగంతో ప్రయాణించే విద్యుత్తు వాహనాలకే లైసెన్స్ అవసరం ఉండదు. అంతకుమించిన వేగంతో వెళ్లే సామర్థ్యం కలిగిన విద్యుత్ ద్విచక్ర వాహనాలు నడిపేవారికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కొన్ని కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు ‘మా విద్యుత్ బైక్/స్కూటర్ కొంటే.. బండి నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.. నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేద’ని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇది సరికాదని.. వాహన సామర్థ్యాన్ని అనుసరించే డ్రైవింగ్ లైసెన్స్ అవసరమని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
అల్ట్రావయోలెట్ సంస్థ కొత్త స్పోర్ట్స్ బైక్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.2.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. -
325 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే.. ఆస్టన్ మార్టిన్ రూ.3.99 కోట్ల కారు
బ్రిటన్ విలాస కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ సరికొత్త ‘వాంటేజ్’ కారును దేశీయ విపణిలోకి విడుదల చేసింది. కొత్త తరం స్పోర్ట్కార్లలో ఇది రెండో మోడల్ అని కంపెనీ తెలిపింది. -
ధరలు తగ్గించిన ఓలా.. ఎస్1X ఇక రూ.69,999 నుంచే!
ఓలా తన ఎస్1 ఎక్స్ స్కూటర్ల ధరలను తగ్గించింది. ఇకపై వీటి ధరలు రూ.69వేల నుంచే ప్రారంభం కానున్నాయి. -
2023-24లో 5.5% తగ్గిన వాహన ఎగుమతులు
Automobile exports: 2024 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతులు 5.5శాతం తగ్గాయని తయారీదార్ల సమాఖ్య వెల్లడించింది. -
ఓలా నుంచి త్వరలో మరో స్కూటర్.. ఎస్1 ఎక్స్ సిరీస్లో ఈ ఫీచర్లతో!
Ola Electric: ఓలా మరో స్కూటర్ తీసుకురాబోతోంది. ఎస్1 ఎక్స్ సిరీస్లో అప్డేట్ చేసిన వెర్షన్ వస్తోంది. -
విపణిలోకి ఎంజీ హెక్టార్ బ్లాక్స్టార్మ్
ఎంజీ (మోరిస్ గ్యారేజెస్) మోటార్ సంస్థ, తమ హెక్టార్ మోడల్లో సరికొత్త బ్లాక్స్టార్మ్ ఎడిషన్ను తీసుకొచ్చింది. -
స్విఫ్ట్, విటారా ధరల్ని పెంచిన మారుతీ సుజుకీ
Maruti Suzuki: మారుతీ సుజుకీ ఇండియా తన విపణిలోని కొన్ని మోడల్ వాహనాల ధరల్ని పెంచినట్లు బుధవారం ప్రకటించింది. -
బజాజ్ నుంచి కొత్త పల్సర్ N250
Bajaj Pulsar N250: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో కొత్త N250ని లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల వివరాలపై ఓ లుక్కేయండి. -
జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ @ రూ.20.5 లక్షలు
Jeep Compass: జీప్ కంపాస్లో నైట్ ఈగిల్ లిమిటెడ్ ఎడిషన్ విడుదలైంది. దీన్ని పూర్తిగా బ్లాక్-గ్లాస్ ఫినిష్తో తీర్చిదిద్దింది. -
2023-24 వాహన విక్రయాల్లో రెండంకెల వృద్ధి.. కార్లు, ట్రాక్టర్లలో రికార్డు!
Automobile retail sales: వాహనాల లభ్యత మెరుగవ్వడం, కొత్త మోడళ్ల విడుదల వంటి అంశాలు దోహదం చేయటంతో విక్రయాలు పుంజుకున్నట్లు ఫాడా అధ్యక్షుడు మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. -
ఏథర్ నుంచి ఫ్యామిలీ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 160 km
ఏథర్ సంస్థ రిజ్తా పేరుతో ఫ్యామిలీ స్కూటర్ను లాంచ్ చేసింది. దీని ధర రూ.1.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. -
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మరిన్ని ప్రీమియం మోడళ్లను తీసుకురావాలని భావిస్తోందని కంపెనీ డిప్యూటీ ఎండీ తడషి అసజుమా పేర్కొన్నారు. -
బీఎండబ్ల్యూ.. టాటా టెక్ జాయింట్ వెంచర్
BMW-Tata Tech: జాయింట్ వెంచర్ నుంచి బీఎండబ్ల్యూ (BMW) గ్రూప్నకు చెందిన ప్రీమియం వాహనాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వెహికల్ (SDV) సొల్యూషన్స్తో పాటు ఇతర ఐటీ సేవలను అందించనున్నారు. -
వాహన బీమా సంస్థల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో సాధారణ బీమా సంస్థలకు సంబంధించి.. వాహన బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
ట్రాక్టర్ల వ్యాపారానికి ఫోర్స్ మోటార్స్ గుడ్బై
Force Motors: ఆటో మొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ వ్యవసాయ ట్రాక్టర్ల వ్యాపారం నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. -
ఏప్రిల్ 1 నుంచి టయోటా కార్ల ధరల పెంపు
టయోటా సంస్థ కార్ల ధరలను పెంచనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు చేపట్టనుంది. ఒక శాతం మేర ఈ పెంపు ఉంటుందని ఆ కంపెనీ ప్రకటించింది. -
Xiaomi Car: షావోమి కారు ధర ఎంత ఉండొచ్చంటే.. సీఈఓ మాటల్లో!
Xiaomi Car: షావోమి కార్ల ఆర్డర్లు చైనాలో గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ కారు ధరపై సోమవారం ఆసక్తిక విషయం వెల్లడించారు. -
Kia India: ఏప్రిల్ నుంచి కియా వాహనాల ధరల పెంపు
Kia India: కియా ఇండియా వాహన ధరల్ని పెంచనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. -
Summer: కార్లలో వీటిని ఉంచొద్దు.. ప్రమాదకరం..!
వేసవిలో కార్లకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వాటిని ఎండలో ఉంచేటప్పుడు అందులో కొన్ని రకాల వస్తువులు ఉంటే ప్రమాదకరం. -
Xiaomi: షావోమీ విద్యుత్తు కార్ల విక్రయాలు మొదలు..!
చైనాలో మరో టెక్ దిగ్గజం విద్యుత్తు కార్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ నెలలోనే డెలివరీలను ప్రారంభిస్తామని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్