విపణిలోకి సరికొత్త జావా 350 మోటర్‌సైకిల్‌

జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్‌ దేశీయ విపణిలోకి సరికొత్త జావా 230 మోటర్‌సైకిల్‌ను విడుదల చేసింది.

Updated : 19 Jan 2024 10:31 IST

దిల్లీ: జావా యెజ్డీ మోటర్‌సైకిల్స్‌ దేశీయ విపణిలోకి సరికొత్త జావా 230 మోటర్‌సైకిల్‌ను విడుదల చేసింది. ధర రూ.2,14,950 (ఎక్స్‌షోరూం, దిల్లీ). చిన్న నగరాలు సహా దేశవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి పెట్టినట్లు కంపెనీ సీఈఓ ఆశిష్‌ సింగ్‌ జోషి తెలిపారు. ప్రస్తుతం దేశంలో 423 విక్రయ కేంద్రాలుండగా.. వచ్చే 24 నుంచి 30 నెలల్లో ఈ సంఖ్యను 750కు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న తొమ్మిది మోడళ్లకు తోడుగా మరిన్ని మోడళ్లను తీసుకొని రానున్నట్లు జోషి తెలిపారు. ఆగ్నేయాసియా దేశాలకు జావా బ్రాండు బైక్‌ల ఎగుమతులను వచ్చే 3-4 నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని