IMF: భారత వృద్ధిరేటును 6.3 శాతానికి పెంచిన ఐఎంఎఫ్
IMF: అధిక వడ్డీరేట్లు, ఉక్రెయిన్లో యుద్ధం సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గమనం నెమ్మదిస్తోందని ఐఎంఎఫ్ తెలిపింది.
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు (India Growth Rate) అంచనాలను ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ పెంచింది. జులైలో 6.1 శాతంగా అంచనా వేసిన ఐఎంఎఫ్ ఈసారి దాన్ని 6.3 శాతానికి మెరుగుపర్చింది. ఏప్రిల్- జూన్ మధ్య అంచనాల కంటే బలమైన వినిమయం నమోదైన నేపథ్యంలోనే వృద్ధిరేటు (India Growth Rate) అంచనాలను పెంచినట్లు ఐఎంఎఫ్ (IMF) పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్లో మన దేశ వృద్ధిరేటును ఐఎంఎఫ్ (IMF) 5.9 శాతంగా అంచనా వేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్- జూన్లో 7.8 శాతం వద్ద బలమైన వృద్ధిరేటు (India Growth Rate) నమోదైంది. దీంతో జులై సమీక్షలో అంచనాలను 6.1కి పెంచింది. తాజాగా దాన్ని మరింత పెంచి 6.3కి చేర్చింది. గతవారం ప్రపంచబ్యాంక్ సైతం భారత వృద్ధిరేటు (India Growth Rate) అంచనాలను 6.3 శాతంగా పేర్కొంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో దేశ వృద్ధిరేటును 6.5 శాతానికి చేర్చిన విషయం తెలిసిందే. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ అంచనాలు ఇప్పటికీ.. ఆర్బీఐ అంచనాల కంటే తక్కువగానే ఉండడం గమనార్హం.
ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును ఐఎంఎఫ్ (IMF) కుదించింది. గతంలో 3 శాతంగా పేర్కొన్న అంచనాలను ఈసారి 2.9 శాతానికి తగ్గించింది. అధిక వడ్డీరేట్లు, ఉక్రెయిన్లో యుద్ధం సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి గమనం నెమ్మదిస్తోందని తెలిపింది. కొవిడ్-19 సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే వృద్ధిరేటు వేగం కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్, ఉక్రెయిన్పై రష్యా దాడి వంటి వరుస పరిణామాల వల్ల గత మూడేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిపింది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం (Inflation) 2023లో 6.9 శాతానికి దిగొస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2024లో అది మరింత తగ్గి 5.8 శాతానికి చేరుతుందని తెలిపింది. అయితే, గత అంచనాలతో పోలిస్తే వీటిని వరుసగా 0.1 శాతం, 0.6 శాతం పెంచడం గమనార్హం. అయితే, 2025 వరకు ద్రవ్యోల్బణం (Inflation) లక్ష్యిత పరిధిలోకి రాకపోవచ్చునని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర