India Debt: ‘చైనా తరహాలో ఇండియా అప్పులూ ఎక్కువే.. కానీ..’
India Debt: భారత్కూ అప్పులు భారీ ఎత్తున ఉన్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. అయితే, వాటి వల్ల అంత ముప్పేమీ లేదని పేర్కొంది. చైనాతో పోలిస్తే భారత్కు అప్పుల వల్ల ఉన్న రిస్క్ తక్కువని అభిప్రాపడింది.
వాషింగ్టన్: చైనా తరహాలోనే భారత్కు కూడా పెద్ద మొత్తంలో రుణం (India Debt) ఉందని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ సంస్థ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, దాని వల్ల రిస్క్ మాత్రం చైనాతో పోలిస్తే తక్కువని అభిప్రాయపడ్డారు. వివిధ రకాల లోటులను తగ్గించేందుకు భారత్కు మధ్యకాలంలో పటిష్ఠ ఆర్థిక ప్రణాళికలు అవసరమని ఐఎంఎఫ్ (IMF) ఆర్థిక వ్యవహారాల విభాగం డిప్యూటీ డైరెక్టర్ రూడ్ డీ మోయిజ్ సూచించారు.
భారత జీడీపీలో అప్పులు (debt to GDP ratio) 81.9 శాతమని మోయిజ్ వెల్లడించారు. చైనా అప్పులు ఆ దేశ జీడీపీలో 83 శాతంగా ఉన్నట్లు తెలిపారు. ఇరు దేశాల్లోనూ అప్పులు పెద్ద మొత్తంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనాకు ముందు భారత అప్పులు జీడీపీలో 75 శాతంగా ఉండేవని గుర్తుచేశారు. రుణాలపై వడ్డీల కోసం భారత్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందన్నారు. జీడీపీలో 5.4 శాతం దానికోసమే కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రానున్న రోజుల్లో భారత అప్పులు.. చైనా అప్పుల తరహాలో భారీ ఎత్తున పెరిగే అవకాశం లేదన్నారు. పైగా 2028 నాటికి ఇండియా అప్పులు జీడీపీలో 80.4 శాతానికి తగ్గుతాయని అంచనా వేశారు. అత్యంత వేగవంతమైన వృద్ధే అందుకు దోహదం చేస్తుందన్నారు.
భారత్కు పెద్ద ఎత్తున అప్పులు ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అవి పెద్ద ముప్పుగా పరిణమించబోవని మోయిజ్ తెలిపారు. రుణాలను తిరిగి చెల్లించేందుకు ఇంకా సుదీర్ఘ గడువు ఉండడం ఓ కారణమన్నారు. దీని వల్ల తరచూ రుణాలను పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉండదన్నారు. పైగా భారత అప్పుల్లో చాలా వరకు దేశీయంగా సమకూర్చుకున్నవేనని తెలిపారు. వీటి చెల్లింపులు స్థానిక కరెన్సీలోనే ఉంటాయని పేర్కొన్నారు. భారత్లో కొన్ని రాష్ట్రాల అప్పులు భారీ మొత్తానికి చేరాయని తెలిపారు. దీనివల్ల వడ్డీభారం కూడా అధికంగానే ఉందన్నారు. అప్పుల పరంగా చూస్తే భారత్కు ఇదొక్కటే రిస్క్గా కనపడుతోందని తెలిపారు.
భారత్ కొన్ని ఆర్థిక స్థిరీకరణ విధానాలను అమలు చేయాల్సిన అసవరం ఉందని మోయిజ్ సూచించారు. సాధారణ విక్రయ పన్నుల నిర్మాణాన్ని మెరుగపర్చాలని హితవు పలికారు. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వ్యవస్థల్లో చాలా లోపాలున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కొన్ని రాయితీలను కూడా విస్తరించాలని సూచించారు. తద్వారా అట్టడుగు వర్గాలకు ఆర్థిక సాయం అందుతుందని వివరించారు.
మన దేశ వృద్ధి రేటు అంచనాను 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్వల్పంగా పెంచి 6.3 శాతంగా ఐఎంఎఫ్ తాజాగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల అంచనా వేసిన వృద్ధి రేటు 6.5 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండోదైన చైనా కంటే భారత వృద్ధి అధికంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ తెలిపింది. గత జులైలో మనదేశ వృద్ధి రేటు అంచనాను 6.1 శాతంగా ఐఎంఎఫ్ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర