India: చైనాకు చెక్పెట్టేందుకు భారత్ ‘పవర్’..!
ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఆక్సిజన్ వంటి విద్యుత్తును సరఫరా చేసి.. అక్కడ చైనా పలుకుబడికి చెక్పెట్టాలని భారత్ భావిస్తోంది.
ఇంటర్నెట్డెస్క్: ఆగ్నేయాసియా దేశాల్లో చైనా పలుకుబడికి చెక్ పెట్టేందుకు భారత్ సరికొత్త ‘పవర్ వ్యూహాన్ని’ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో పారిశ్రామిక రంగానికి ఆయువుపట్టైన విద్యుత్తును ప్రత్యేక గ్రిడ్ అనుసంధానం ద్వారా ఆయా దేశాలకు సరఫరా చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా భారత్ పెంచుకొంటున్న పునరుత్పాదక విద్యుత్ వనరులను ఇందుకోసం వాడుకోవాలని చూస్తోందని ఈ వ్యహారంతో సంబంధం ఉన్న కీలక వ్యక్తులు ఓ ఆంగ్ల వార్తసంస్థకు వెల్లడించారు. ఈ విద్యుత్ను మయన్మార్, థాయ్లాండ్ మీదుగా ఆయా దేశాలకు సరఫరా చేయాలని భావిస్తున్నారు.
జీ20 వేదికగా ప్రయత్నాలు..
ఈ గ్రిడ్ అనుసంధానతను పూర్తి చేసేందుకు ఎంతలేదన్నా కనీసం నాలుగేళ్లు పడుతుందని అంచనా. భారత్ పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను మరింత పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు తాజాగా గోవాలో జరుగుతున్న జీ-20 మంత్రివర్గ స్థాయి సదస్సులను వేదికగా వాడుకొంటోంది. పవర్ గ్రిడ్ అనుసంధానంపై తాజాగా వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా దీనిలో బ్యాంకుల మద్దతు, డెవలపర్ల పెట్టుబడిని సాధించడానికి జీ20 సభ్యుల నిర్ణయాలు కీలమని వారు పేర్కొన్నారు.
ఇప్పటికే భారత్ దీనికి సంబంధించిన ధరల నిర్ణయం వంటి కీలక విషయాలపై నిబంధనలను సిద్ధం చేసేందుకు ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్తో కలిసి పనిచేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈడీఎఫ్ ఓ నివేదికను సిద్ధం చేయవచ్చు. తొలుత భారత్ నుంచి బర్మాలోని గ్రిడ్కు అనుసంధానించగలిగితే.. ఆ తర్వాత అక్కడి నుంచి థాయ్లాండ్, తూర్పు ఆసియా దేశాలకు విద్యుత్తు సరఫరా చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది సాధ్యమేనా..?
సీమాంతర గ్రిడ్ అనుసంధానత అంశానికి భారీ పెట్టుబడులు అవసరం కావడంతోపాటు.. ఐరోపా నుంచి ఆగ్నేయాసియా వరకు దేశ ప్రయోజనాలను కూడా దృష్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. సముద్ర గర్భంలో నిర్మించే కేబుల్స్, నిర్మాణ సామగ్రి, ఆ తర్వాత వాటి అప్గ్రేడ్కు అవసరమైన మెటీరియల్ వ్యయం పెరగడం, భౌగోళిక రాజకీయాల ఒత్తిళ్లు వంటి అంశాలు ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంపై పలు ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు ప్రాంతీయ గ్రిడ్లో విద్యుత్ పంపిణీ ఛార్జీలు కూడా కీలక సవాలుగా మారనున్నాయి.
జియో ఫైనాన్షియల్ @ రూ.1,66,000 కోట్లు
ఆగ్నేయాసియా దేశాల సంఘమైన ఆసియాన్ ప్రాంతీయ గ్రిడ్ ఏర్పాటు చేసి.. బహుళపక్ష విద్యుత్ వ్యాపారం చేయాలని ఎప్పటి నుంచో యత్నిస్తోంది. కానీ, దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల వరకు మాత్రమే ఈ ప్రయత్నం ముందుకు సాగింది.
భారీ లక్ష్యాలు..
భారత్ 2030 నాటికి ప్రస్తుతం ఉన్న పునరుత్పాదక, హైడ్రోపవర్ ఉత్పత్తిని 177 గిగావాట్ల నుంచి 500 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. వీటిల్లో అత్యధిక మొత్తం సోలార్ పార్కుల నుంచే లభించనుందని అంచనా వేస్తోంది. సోలార్ పవర్ అందుబాటులోకి వచ్చే కొద్దీ భారత్ శిలాజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ఇంధనశాఖ చెబుతోంది. భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్కు విద్యుత్ పంపిణీ చేస్తోంది. మయన్మార్కు కూడా స్వల్పంగా సరఫరా చేస్తోంది. కొత్త ప్రణాళిక అమల్లోకి వస్తే భారీగా విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
సైబర్ నేరాలతో ముడిపడి ఉన్న 28 వేల మొబైల్స్ను బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలకు డాట్ ఆదేశాలు జారీ చేసింది. -
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
గూగుల్లో లేఆఫ్లపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు. -
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది. -
పెట్టుబడికి బంగారు బాట...
ధర ఎంతన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో చెప్పాల్సిన పనిలేదు. -
మదుపు చేయాలి.. లక్ష్యం చేరేదాకా
స్టాక్ మార్కెట్లు కొంత అనిశ్చితితో ఉన్నప్పటికీ గరిష్ఠ స్థాయుల వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈక్విటీల్లో ప్రత్యక్షంగా మదుపు చేస్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. -
కష్టకాలంలో కుటుంబానికి ఆర్థిక ధీమా
అనుకోని ప్రమాదం కుటుంబంలో ఆర్జించే పెద్ద దిక్కును కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిపై ఆధారపడిన వారికి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!