Stock Market : నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ సూచీలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Published : 28 Jul 2023 09:35 IST

ముంబయి : అంతర్జాతీయ సూచీల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు(Stock Market) శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.21 నిమిషాలకు సెన్సెక్స్‌(Sensex) 213 పాయింట్లు నష్టపోయి 66,053 వద్ద.. నిఫ్టీ(Nifty) 55 పాయింట్లు కోల్పోయి 19,603 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.20 వద్ద ఉంది. అమెరికా మార్కెట్లలోని ప్రధాన సూచీలైన డోజోన్స్‌, నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 సూచీలు గురువారం ట్రేడింగ్‌ను నష్టాల్లో ముగించడం దేశీయ సూచీలపై పడింది. దీనికి తోడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 

నిఫ్టీలో డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎం, అపోలో హాస్పిటల్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని