stock market : నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

ఈ వారాన్ని దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభించాయి. 

Updated : 14 Aug 2023 09:43 IST

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ(stock market)లు ఈ వారాన్ని నష్టాల్లో ప్రారంభించాయి. ఆరంభంలో నిఫ్టీ 19,350 దిగువన కదలాడగా.. సెన్సెక్స్‌ 300 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్‌(Sensex) 465 పాయింట్లు నష్టపోయి 64,856 వద్ద.. నిఫ్టీ(Nifty) 154 పాయింట్లు క్షీణించి 19,274 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.98 వద్ద ఉంది. ఆసియా-పసిఫిక్‌ సూచీలు మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. 

నిఫ్టీలో అదానీ పోర్ట్స్‌, టాటా మోటర్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఐషర్‌ మోటర్స్‌ షేర్లు నష్టపోతుండగా.. ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్‌ ఇండియా, కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని