Vaibhav Taneja: టెస్లా సీఎఫ్వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా
టెస్లా (Tesla) నూతన సీఎఫ్వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా (Vaibhav Taneja) నియమితులయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సీఎఫ్వోగా భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా (Vaibhav Taneja) నియమితులయ్యారు. ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్గా నాలుగేళ్ల పాటు కొనసాగిన జాచరీ కిర్కోర్న్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అకౌంటింగ్ హెడ్గా ఉన్న భారత సంతతి వ్యక్తి వైభవ్ తనేజా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మార్పు నిర్ణయం వెలువడటంతో టెస్లా షేర్లు 3 శాతం పతనమయ్యాయి. కంపెనీలో ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’గా వ్యవహరించిన జాచరీ ఉన్నఫళంగా నిష్క్రమించడానికి గల కారణాలను టెస్లా వెల్లడించలేదు. ఈ కంపెనీతో ఆయనకు 13 ఏళ్ల అనుబంధం ఉంది. అయితే కార్యకలాపాలు సజావుగా సాగడంలో సహాయపడటానికి జాచరీ ఈ ఏడాది చివరి వరకు కంపెనీలో కొనసాగనున్నారు. కాగా.. ‘ఈ కంపెనీలో భాగం కావడం ఒక ప్రత్యేక అనుభవం. నేను 13 ఏళ్ల క్రితం చేరినప్పటి నుంచి ఇప్పటి దాకా అందరితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వపడుతున్నానని’ జాచరీ తన లింక్డ్ ఇన్ పోస్టులో వెల్లడించారు.
మణిపుర్ విద్యార్థులారా ఉన్నత విద్య పూర్తి చేయాలనుకుంటే కేరళ వచ్చేయండి!
వైభవ్ తనేజా దిల్లీ యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో పట్టభద్రుడయ్యారు. వైభవ్కు అకౌంటింగ్లో 20 ఏళ్ల అనుభవం ఉంది. టెక్నాలజీ, ఫైనాన్స్, రిటైల్, టెలీ కమ్యూనికేషన్స్ ఎమ్ఎన్సీ కంపెనీల్లో ఆయన పనిచేశారు. 2016లో సోలార్ సిటీని టెస్లా కొనుగోలు చేసిన తరువాత అందులో ఆయన భాగమయ్యారు. ప్రధాన అకౌంటింగ్ అధికారిగా తన ప్రాథమిక బాధ్యతతో పాటు, ‘మాస్టర్ ఆఫ్ కాయిన్’ పాత్రను పోషించనున్నట్లు టెస్లా కంపెనీ తెలిపింది. 2021లో తనేజా టెస్లా భారతీయ విభాగానికి డైరెక్టర్గానూ నియమితులయ్యారు.
జాచరీ పదవీ కాలంలో టెస్లా మాస్ మార్కెట్ మోడల్ 3 కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలను ప్రారంభించింది. దాంతో మొదటి త్రైమాసికంలో గణనీయమైన లాభాలు వచ్చాయి. మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.82,78,000 కోట్లు) దాటేసింది. 2019లో జాచరీ సీఎఫ్వోగా నియామకం జరిగింది. కాన్ఫరెన్సులో త్రైమాసిక ఫలితాల గురించి మస్క్ మాట్లాడుతూ జాచరీ నియామకాన్ని, దీపక్ ఆహుజా నిష్క్రమణ గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
-
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
-
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
-
మార్కుల విషయమై తల్లీ కుమార్తెల ఘర్షణ.. పరస్పరం కత్తిపోట్లు
-
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
-
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం