5G Auction: 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం.. ఆ బ్యాండ్లపైనే కంపెనీల దృష్టి!
5G Auction: 4జీ తో పోలిస్తే 10 రెట్లు వేగవంతంగా డేటా సేవలు అందించే వీలున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం నేడు (ఈనెల 26) ప్రారంభం కానుంది. టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పాల్గోనుండటంతో ఈ వేలంపై ఆసక్తి నెలకొంది. తమ సొంత
5G Auction: 4జీ తో పోలిస్తే 10 రెట్లు వేగవంతంగా డేటా సేవలు అందించే వీలున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం (5G Auction) నేడు (ఈనెల 26) ప్రారంభమైంది. టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా పాల్గొంటుండడంతో ఈ వేలంపై ఆసక్తి నెలకొంది. తమ సొంత అవసరాల (క్యాప్టివ్) నెట్వర్క్ కోసం స్పెక్ట్రమ్ను వినియోగించుకునేందుకు టెక్ సంస్థలకు అనుమతినివ్వడం ఈ సారి వేలంలో ప్రత్యేకతగా చెప్పొచ్చు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు సంస్థలు బిడ్లు దాఖలు చేయొచ్చు. టెలికాం సంస్థల వ్యూహాలకనుగుణంగా స్పెక్ట్రమ్ కోసం వేసే బిడ్లను అనుసరించి, వేలం కొనసాగుతుంది. దాదాపు రెండురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. స్పెక్ట్రమ్ కోసం నిర్ణయించిన కనీస ధర సమీపంలోనే, బిడ్లు ఖరారయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: 5జీ వేలంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయమెంత?
వేలం ముఖ్యాంశాలివే..:
* 9 బ్యాండ్లలో మొత్తంగా 72 గిగాహెర్ట్జ్ల స్పెక్ట్రమ్ను విక్రయించనున్నారు. కనీస విలువ దాదాపు రూ.4.3 లక్షల కోట్లు.
* వేలంలో దక్కించుకున్న స్పెక్ట్రమ్ను 20 ఏళ్ల పాటు ఆయా సంస్థలు వినియోగించుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాతే స్పెక్ట్రమ్ను సరెండర్ చేసుకునే వీలుంటుంది.
* స్పెక్ట్రమ్ కోసం తప్పనిసరిగా ముందస్తు చెల్లింపులు చేయనవసరం లేదు. 20 వార్షిక సమ వాయిదాల్లో కట్టుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. ఏటా ప్రారంభంలో చెల్లించాల్సి ఉంటుంది.
* స్పెక్ట్రమ్ వినియోగం రుసుంను (ఎస్యూఎస్) రద్దు చేశారు.
ఏయే బ్యాండ్లలో
తక్కువ శ్రేణి బ్యాండ్లు- 600, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెర్ట్జ్
మధ్యశ్రేణి ఫ్రీక్వెన్సీ బ్యాండ్- 3.3 మెగాహెర్ట్జ్
అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్- 26 గిగాహెర్ట్జ్
వీటిల్లో 600, 700 మెగాహెర్ట్జ్, 3.3 గిగాహెర్ట్జ్, 26 గిగాహెర్ట్జ్ బాండ్లను వేలం వేయనుండటం ఇదే మొదటిసారి.
ఏయే సంస్థ.. ఎటు వైపు
* రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్పై ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బ్యాండ్లో అత్యధిక స్పెక్ట్రమ్ను కలిగి ఉండటమే ఇందుకు కారణం. టెలికాం విపణిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, మార్కెట్ వాటా పెంచుకునేందుకు జియోకు ఇది ముఖ్యమే.
* భారత్ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు 900 మెగాహెర్ట్జ్ బ్యాండ్లో అధిక స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
* 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం 3 సంస్థలూ బిడ్లు దాఖలు వేయొచ్చు.
* తక్కువ ఫ్రీక్వెన్సీతో, అధిక ప్రాంతం-భవనాల్లోపల కవరేజీకి అనువైన 600 - 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్కు టెలికాం సంస్థలు బిడ్లు అంతగా దాఖలు చేయకపోవచ్చు. వీటి ధరలు ఎక్కువగా ఉండటమే కారణం.
* 5జీ సేవలకు ప్రధానమైన 3.3 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను సి-బ్యాండ్గాను, 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను ఎంఎం-వేవ్గా వ్యవహరిస్తారు. చౌకగా లభించే ఎంఎం వేవ్ను టెల్కోలు సాధ్యమైనంత మేర ఎక్కువగా కొనుగోలు చేయొచ్చు. అధిక ధర కారణంగా సి- బ్యాండ్ విషయంలో కంపెనీలు ఎలాంటి వ్యూహం అనుసరిస్తాయో వేచిచూడాల్సి ఉంది. ఈ స్పెక్ట్రమ్ను ప్రైవేట్ నెట్వర్క్ల కోసం టెక్నాలజీ కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడమూ మరో కారణం.
Also Read:5Gపై అపోహలు.. అనుమానాలు.. వీటిలో వాస్తవమెంత?
స్పెక్ట్రమ్ అంటే..
టెలికమ్యూనికేషన్స్ సహా పలు రకాల సేవలకు అవసరమైన సమాచారాన్ని వైరు లేకుండా తీసుకువెళ్లే విద్యుదయస్కాంత రేడియో తరంగాలను స్పెక్ట్రమ్గా వ్యవహరిస్తారు. ఈ తరంగాలను ప్రభుత్వం ఆయా రంగాలు లేదా కంపెనీలకు వినియోగం ఆధారంగా కేటాయిస్తుంది. వినియోగాన్ని బట్టి తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి అధిక ఫ్రీక్వెన్సీ వరకు బ్యాండ్లలో స్పెక్ట్రమ్ను విభజించారు. అధిక ఫ్రీక్వెన్సీ తరంగాలు అధిక డేటాను సరఫరా చేయడమే కాకుండా అధిక వేగాన్ని కలిగి ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీ తరంగాల కవరేజీ విస్తృతి ఎక్కువగా ఉంటుంది కానీ, తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి.
Also Read: 5G roll out: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్?
* భారత్లో 2 జీ సేవలు- 900, 1800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లను ఉపయోగించుకుంటున్నాయి.
* 3జీ- 900, 2100 మెగాహెర్ట్జ్
* 4జీ- 850, 1800, 2300, 2500 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను వినియోగించుకుంటున్నారు.
తాజా వేలంలో రూ.1- 1.1 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను టెలికాం సంస్థలు కొనుగోలు చేసే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. స్పెక్ట్రమ్ విక్రయానంతరం ఆగస్టులో 5జీ సేవలకు దేశంలో శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. -
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..