5G roll out: 5జీ దేశవ్యాప్తంగా ఎప్పుడు..?రేట్లు ఎంత ఉండబోతున్నాయ్?
5G roll out in India: 5జీ.. ఈ పదం వినగానే వచ్చే ప్రశ్న.. ‘వస్తున్నాయ్ సరే.. మాకెప్పుడు?’
5G roll out in India: 5జీ.. ఈ పదం వినగానే వచ్చే ప్రశ్న.. ‘వస్తున్నాయ్ సరే.. మాకెప్పుడు?’ అని. పెద్ద పెద్ద నగరాల్లో ఉండే వారి సంగతి పక్కన పెడితే.. పల్లెలు, పట్టణాల్లో ఉన్న వారు మాత్రం దీని గురించి ఆశగా ఎదురుచూస్తుంటారు. కారణం.. గతంలో 3జీ, 4జీ వచ్చినప్పుడు కూడా తొలుత నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడానికి చాలా కాలమే పట్టింది. ఇప్పటికీ 4జీ సేవలు పూర్తిగా అందుబాటులోకి రాని గ్రామాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ (జులై 26) జరగబోతోంది. ఏడాది చివరికల్లా కొన్ని నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. మరి దేశవ్యాప్తంగా సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? ఏయే దేశాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి? వస్తే రేట్లు ఎంతుండొచ్చు? 5జీ ఫోన్లు కొనుగోలు చేయాలా? వద్దా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం పదండి..
ఆ దేశాల్లో 6జీకి సన్నాహాలు
మనం ఇప్పుడింకా 5జీ గురించి చర్చించుకుంటుండగా.. కొన్ని దేశాలు మాత్రం ఇప్పటికే 6జీకి సంబంధించిన ప్రయోగాల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ విషయంలో మన పొరుగుదేశం చైనా ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ దేశంలో 6జీకి సంబంధించిన ప్రయోగాలు ప్రారంభించింది. జపాన్ సైతం 6జీకి సన్నద్ధమవుతోంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులో ఉన్నాయి. 5జీ నగరాల పరంగా చూసినప్పుడు చైనా తొలి స్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు రోజులకు ఓ నగరంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. అర్జెంటీనా, భూటాన్, కెన్యా, కజకిస్థాన్, మలేసియాలో 5జీ సేవలు ఈ ఏడాదే ప్రారంభమయ్యాయి. ఈ జాబితాలో భారత్ సైతం త్వరలో చేరబోతోంది.
Also Read: EXPLAINED: 2G, 3G, 4G, 5G.. ఏమిటివి? స్పెక్ట్రమ్కి వేలం ఎందుకు?
తొలుత ఎక్కడ..?
జులై నెలాఖరు కల్లా 5జీ వేలం ప్రక్రియ పూర్తయ్యాక.. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని టెలికాం మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. వేలం పూర్తయిన 6 నెలల్లోగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని గతంలో టెలికాం కంపెనీలు సైతం తెలిపాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఏడాది చివరి కల్లా 20-25 నగరాల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత మాత్రం 13 నగరాల ప్రజలు ఈ సేవలను ఆనందించనున్నారు. ఈ జాబితాలో హైదరాబాద్ సహా అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్నగర్, కోల్కతా, లఖ్నవూ, ముంబయి, పుణె నగరాలు ఉన్నాయి. ఇప్పటికే 5జీ సేవలకు సంబంధించి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఆయా నగరాల్లో ట్రయల్స్ పూర్తి చేశాయి. నోకియా, ఎరిక్సన్, శాంసంగ్తో కలిసి 6 నెలల పాటు పరీక్షలు నిర్వహించాయి.
Also Read: 2G Spectrum Case: అసలు 2G స్పెక్ట్రమ్ రగడ ఏంటి? ఆరోజు కాగ్ ఏం చెప్పింది?
దేశవ్యాప్తంగా ఎప్పుడు..?
దేశంలో టెలికాం రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ.. అది దేశవ్యాప్తం కావడానికి కొన్నేళ్లు పడుతుంది. గతంలో 2జీ, 3జీ, 4జీ అనుభవాలు ఇవే చెబుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ఇంత వరకు 4జీ సేవలనే పూర్తి స్థాయిలో ప్రారంభించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన 5జీ రావడానికి సైతం కొన్నేళ్లు పడుతుంది. అయితే, 5జీ విషయంలో మునుపటిలా జాప్యం జరగకపోవచ్చన్నది నిపుణుల మాట. ఇప్పటికే ఉన్న సరిపడా టవర్లు, మానవ వనరులు అందుబాటులో ఉండడం వల్ల తీవ్ర జాప్యం జరగబోదని టెలికాం గేర్లు విక్రయించే సంస్థకు చెందిన ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తొలి దశలో నగరాల్లో ఈ సేవలు తేవాలంటేనే ఒక్కో నగరంలో సగటున వెయ్యి టవర్లకు 5జీ గేర్లు అమర్చాల్సి ఉంటుంది. ఈ లెక్కన దేశవ్యాప్తంగా 5జీ సేవలు రావాలంటే 2 నుంచి 2.5 లక్షల టవర్లకు 5జీ పరికరాలను అమర్చాలి. మారుమూల గ్రామాలకు సైతం ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే ఐదేళ్లు పట్టొచ్చని చెబుతున్నారు. 2027 నాటికి 39 శాతం మంది 5జీ వినియోగదారులు ఉంటారని ఎరిక్సన్ అంచనా వేసింది. దేశవ్యాప్త సేవల కోసం టెలికాం కంపెనీలు కనీసం లక్షన్నర నుంచి 2 లక్షల కోట్లపైనే వెచ్చించాల్సి ఉంటుందని ప్రముఖ సంస్థ ‘మోతీలాల్ ఓస్వాల్’ అంచనా వేసింది.
Also Read: 6G Network: 6జీ సాంకేతికతతో మొబైల్ఫోన్లు ఉనికిని కోల్పోతాయా?
రేట్లు ఎలా ఉండబోతున్నాయి?
5జీ సేవలు అందుబాటులోకి వస్తే డేటా ప్లాన్లు ఎలా ఉండబోతున్నాయనేది చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే చౌకగానే ఉంటాయని సమాధానం ఇచ్చారు. అయితే, టెలికాం కంపెనీల నుంచి దీనిపై ఎలాంటి స్పష్టతా లేదు. 4జీతో సమానంగానే ఉండొచ్చని ఓ టెలికాం కంపెనీ ప్రతినిధి మాత్రం తెలిపారు. అయితే, దేశంలో 4జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలి నాళ్లలో 3జీ ప్లాన్లతో పోలిస్తే 4జీ ప్లాన్లు కాస్త అధికంగా ఉండేవి. తర్వాత 3జీ, 4జీ అన్న తేడా లేకుండా టెలికాం కంపెనీలు ప్లాన్లు సవరించాయి. 5జీ వచ్చాక సైతం ఈ ధరల్లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 10-20 శాతం అధిక ధరతో ప్లాన్లు లభించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
5జీ ఫోన్ కొనాలా వద్దా..?
మార్కెట్లో ఇప్పటికే 5జీ ఫోన్ల సందడి మొదలైంది. మొబైల్ తయారీ కంపెనీలు ఇటీవల కాలంలో 5జీ ఫోన్లను లాంచ్ చేయడంపై దృష్టి పెట్టాయి. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోకి షిప్ అయ్యే స్మార్ట్ఫోన్లలో 40 శాతం 5జీ ఫోన్లే ఉంటాయన్నది ఒక అంచనా. ఈ క్రమంలో కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారిని 5జీ ఫోన్ కొనాలా? వద్దా? అనే ప్రశ్న వేధిస్తుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 4జీ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే 5జీ స్మార్ట్ఫోన్ల ధర కాస్త ఎక్కువగా ఉందనే చెప్పాలి. 5జీ ఫోన్ కొనాలంటే కనీసం ₹15వేలు వెచ్చించాల్సిందే. పైగా కొన్ని కంపెనీలు పరిమిత బ్యాండ్లు సపోర్ట్ చేసే 5జీ ఫోన్లనే తీసుకొస్తున్నాయి. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు అయితే 5జీ ఫోన్లు కొనుగోలును వాయిదా వేసుకోవడం మంచిది. అదే నగరాల్లో నివసించే వారైతే 5జీ ఫోన్లపై ఓ లుక్కేయొచ్చు. అయితే, ఎక్కువ బ్యాండ్లు సపోర్ట్చేసే ఫోన్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొద్ది రోజులు కొనుగోలును వాయిదా వేసుకోగలిగితే తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
Also Read: SmartPhone: కొత్త ఫోన్ కొంటున్నారా..? అయితే ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం