stock market : లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

శుక్రవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

Updated : 04 Aug 2023 09:43 IST

ముంబయి : మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ సంస్థ భారత్‌ స్థాయిని పెంచడం  దేశీయ స్టాక్‌ మార్కెట్‌(stock market) సూచీల్లో ఉత్సాహం నింపింది. దీంతో శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌(Sensex) 250 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ(Nifty) 19,450పైన కదలాడింది. ఉదయం 9.24 నిమిషాలకు సెన్సెక్స్‌ 303 పాయింట్ల లాభంతో 65,543 వద్ద.. నిఫ్టీ 101 పాయింట్ల లాభంతో 19,483 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.74 వద్ద ఉంది.

నిఫ్టీలో సిప్లా, హిందాల్కో, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ లాభాలను నమోదు చేస్తుండగా.. పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, సన్‌ ఫార్మా, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని