Stock Market: ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening Bell: ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.

Published : 08 Aug 2023 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 21 పాయింట్ల లాభంతో 65,957 వద్ద, నిఫ్టీ (Nifty) 3 పాయింట్ల లాభంతో 19,600 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు క్షీణించి 82.81 వద్ద ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది.

నిఫ్టీలో హీరో మోటార్స్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఎన్టీపీసీ, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ షేర్లు రాణిస్తుండగా.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇక ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 0.87శాతం పడిపోగా.. జపాన్‌ నిక్కీ 0.31శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.19శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. గురువారం వెలువడనున్న యూఎస్‌ ద్రవ్యోల్బణ గణాంకాలపై మదుపర్లు సానుకూలంగా ఉన్నారు. దీనికి తోడు, గతవారం నష్టాలతో సూచీలు కనిష్ఠాల వద్ద ఉండటంతో కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో ఎస్‌ అండ్‌ పీ సూచీ 0.90, నాస్‌డాక్‌ 0.61, డోజోన్స్‌ 1.16శాతం మేర లాభపడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని