Stock Market: ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening Bell: దేశీయ మార్కెట్లు నేడు మందకొడిగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్‌ సూచీలు మిశ్రమంగా ఉన్నాయి.

Published : 19 Dec 2023 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో సూచీలు మందకొడిగా సాగుతున్నాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 51పాయింట్ల లాభంతో 71,366 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 21,436 వద్ద ఉన్నాయి. 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 3 పైసలు క్షీణించి రూ. 83.13గా కొనసాగుతోంది. నిఫ్టీలో ఓఎన్జీసీ, నెస్లే, అపోలో హాస్పిటల్స్‌, బ్రిటానియా, కోల్‌ ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టైటన్‌ కంపెనీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి.

అమెరికా మార్కెట్‌ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 0.86శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.45శాతం, నాస్‌డాక్‌ సూచీ 0.61శాతం మేర లాభపడ్డాయి. అటు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.59శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా.. జపాన్‌ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పి, హాంగాంక్‌ హాంగ్‌సెంగ్‌ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని