Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,085

Stock Market Opening bell: ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 72,512 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకొని 22,085 దగ్గర కొనసాగుతోంది.

Published : 19 Feb 2024 09:31 IST

Stock Market Opening bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ.. మన సూచీలు పాజిటివ్‌గా మొదలవడం విశేషం. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 72,512 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకొని 22,085 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.99 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఐటీసీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్ ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు (Stock Market) శుక్రవారం నష్టాలతో ముగిశాయి. నేడు ఆసియా పసిఫిక్‌ ప్రధాన సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర గత 24 గంటల్లో 0.69 శాతం తగ్గి 82.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs)’ శుక్రవారం నికరంగా రూ.253.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs)’ సైతం రూ.1,571 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమావేశ మినిట్స్‌, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌ ఈ వారమే వెలువడనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని