9AM నుంచి 9PM.. వారానికి 100 గంటలు.. పని గంటలపై బాస్ల మాట!
CEOs on Working hours: వారానికి 70 గంటల చొప్పున యువత పనిచేయాలంటూ నారాయణమూర్తి వ్యక్తంచేసిన అభిప్రాయంపై చర్చ ప్రారంభమైంది. దీంతో గతంలో పని గంటల గురించి పలువురు బాస్లు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ దేశాలతో మనం పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటల చొప్పున పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Infosys Narayana murthy) కొత్త చర్చకు తెరలేపారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ప్రాక్టికల్గా అది సాధ్యం కాదని కొట్టిపారేశారు. భారత్ సూపర్ పవర్గా ఎదగాలంటే తప్పదని మరికొందరు అభిప్రాయపడ్డారు. నారాయణమూర్తి ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. కొవిడ్ అనంతరం రెండు మూడేళ్ల పాటు వారానికి 60 గంటలు చొప్పున పనిచేయాల్సిన అవసరం ఉందని, లేదంటే కోలుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు. అయితే, ఒక్క నారాయణమూర్తే కాదు.. పని గంటల గురించి పలువురు బాస్లు ఇదే తరహా ప్రతిపాదనలు చేశారు. కొందరి అభిప్రాయాలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది కూడా.
చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా (Jackma) 996 అనే రూల్ను ప్రతిపాదించారు. దాని ప్రకారం.. ఉద్యోగులు వారంలో ఆరు రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లోనూ, స్టార్టప్ల్లోనూ ఇదే విధానం అమలవుతోందని పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో చైనా సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనివల్ల అసలు కుటుంబ జీవితమనేదే ఉండదంటూ ఆయన ప్రతిపాదనను తప్పుబట్టారు.
వర్క్కల్చర్పై నారాయణమూర్తి కామెంట్స్.. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
ట్విటర్ను కొనుగోలు చేసిన సమయంలో వేలాది ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్ (Elon musk).. నవంబర్లో ఉద్యోగులకు ఓ మెయిల్ చేశారు. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కష్టపడి పనిచేస్తేనే కంపెనీ మనుగడ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అందుకే వారానికి 100 గంటలు చొప్పున పనిచేయాలని అందులో పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పని కోసం తాను కార్యాలయంలోనే పడుకొంటానని, ఉద్యోగులూ అదే పనిచేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
‘బాగా తినండి. దృఢంగా ఉండి. అలాగే, రోజుకు 18 గంటలు పనిచేయండి’ అంటూ బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ శంతను దేశ్ పాండే లింక్డిన్లో గతేడాది పోస్ట్ పెట్టారు. ఫ్రెషర్లు కనీసం నాలుగైదేళ్ల పాటైనా రోజుకు 18 గంటలు చొప్పున పనిచేయాలని అప్పట్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉద్యోగ జీవితం కోసం వ్యక్తిగత జీవితాన్ని పోగొట్టుకోవాలా? అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. ఆ ఆరు గంటలు మాత్రం కూడా ఎందుకు అంటూ మరికొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు.
ఇన్ని గంటల పాటు ఉద్యోగుల్ని పనిచేయమని చెప్పే బాస్లు ఇంతకీ ఎన్నెన్ని గంటలు పనిచేస్తున్నారన్న దానిపై రెండు వేర్వేరు సర్వేలు ఆసక్తికర గణాంకాలను బయటపెట్టాయి. అమెరికాలో సగటున ఓ సీఈఓ సాధారణ రోజుల్లో 9.7 గంటలు, వారాంతాల్లో 3.9 గంటలు చొప్పున పనిచేస్తున్నారని తేలింది. మరో సర్వే ప్రకారం.. భారత్లో ఓ సీఈఓ సగటున వారానికి 39 గంటలు అంటే రోజుకు 8-9 గంటలు పనిచేస్తున్నారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి