బ్రేకింగ్

breaking
04 Nov 2023 | 11:14 IST

సీజేఐకి ఏపీ భాజపా చీఫ్‌ పురందేశ్వరి లేఖ

దిల్లీ: వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేఖ రాశారు. ‘‘పదేళ్లుగా బెయిల్‌పై కొనసాగుతూ సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి షరతులు ఉల్లంఘిస్తున్నారు. ఆయనపై 11 అభియోగాలు, పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో పాటు ఐదు దస్త్రాలను పురందేశ్వరి జతచేశారు.

మరిన్ని

తాజా వార్తలు