బ్రేకింగ్

breaking
24 Apr 2024 | 12:36 IST

కేసీఆర్‌ను నమ్మితే పద్మారావు మునిగినట్టే: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవబోతోందని, కేంద్రంలో కాంగ్రెస్‌ రాబోతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి ఈ ప్రాంతానికి ఏం చేశారు? దానం నాగేందర్‌ ఎంపీగా గెలిస్తే మా ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవి వస్తుంది. పద్మారావు మంచోడే.. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టే. ఆయన పరువు తీయడానికే సికింద్రాబాద్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. పద్మారావు నామినేషన్‌కు కేటీఆర్‌, కేసీఆర్‌ ఎందుకు రాలేదు?సికింద్రాబాద్‌ టికెట్‌ను భాజపాకు.. భారాస తాకట్టు పెట్టింది’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

మరిన్ని

తాజా వార్తలు