Reliance Campa: సాఫ్ట్ డ్రింక్స్ విషయంలోనూ ‘జియో’ వ్యూహం..!
Campa Drinks: కాంపాతో సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లోకి అడుగుపెట్టిన రిలయన్స్.. తనదైన మార్కెటింగ్ వ్యూహంతో ముందుకెళుతోంది. ధరలు తగ్గించడంతో పాటు తన రిటైల్ నెట్వర్క్ను వాడుకోనుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ఏళ్లుగా విదేశీ కంపెనీలైన కోకాకోలా, పెప్సీదే హవా. సరళీకరణ విధానాలతో దేశంలోకి ప్రవేశించిన ఆ రెండు కంపెనీలు.. తమదైన వ్యూహాలతో మార్కెట్పై పట్టు సాధించాయి. మధ్యలో చాలా దేశీయ కంపెనీలు వాటికి గట్టి పోటీనివ్వాలని భావించినా అవేవీ సఫలం కాలేదు. చాలా ఏళ్లు తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ ఒకప్పటి ఫేమస్ డ్రింక్ ‘కాంపా’ను (Campa drinks) తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇటీవలే కోలాతో పాటు లెమన్, ఆరెంజ్ రుచుల్లో తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు విదేశీ కంపెనీలకు గట్టి పోటీనివ్వలేకపోయినా.. క్రమంగా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒకప్పుడు టెలికాం మార్కెట్లో ‘జియో’ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తోందని ఆంగ్లవార్తా సంస్థ ‘రాయిటర్స్’ పేర్కొంది.
సరిగ్గా ఏడేళ్ల క్రితం టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో సంచలనం సృష్టించింది. చౌక ధరకే డేటా, అపరిమిత కాల్స్తో భారీ సంఖ్యలో వినియోగదారులును ఆకట్టుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు అతిపెద్ద టెలికాం నెట్వర్క్గా అవతరించింది. ఇదే వ్యూహాన్ని సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లోనూ అనుసరించాలని రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ భావిస్తోంది. ఇందుకోసం ధరలు తక్కువ ధరలకే విక్రయించడంతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్ నెట్వర్క్ను వాడుకోబోతోందని తెలిపింది. స్వదేశీ సెంటిమెంట్ సైతం ఆ సంస్థకు అక్కరకు రాబోతోందని రాయిటర్స్ తన కథనంలో తెలిపింది.
గతేడాది కాంపా బ్రాండ్ను కొనుగోలు చేసిన రిలయన్స్ ప్రస్తుతం ఔట్సోర్సింగ్ ద్వారా ఉత్పత్తి చేపట్టింది. త్వరలో సొంతంగా ఫ్యాక్టరీలు లేదా జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసి తయారీని విస్తృతం చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. అలాగే హోటళ్లకు, రెస్టారెంట్లకు, విమానాల్లో విక్రయానికి ఉంచాలని కంపెనీ చూస్తోంది. ప్రస్తుతం కాంపా కోలా రెండు లీటర్ల బాటిల్ను స్టోర్లలో రూ.49లకే విక్రయిస్తున్నారు. లేబుల్ ధరతో పోలిస్తే ఇది సగం మాత్రమే. కోక్, పెప్సీతో పోలిస్తే మూడో వంతు తక్కువ ధరకే రిలయన్స్ ఈ పానీయాన్ని విక్రయిస్తోంది. తక్కువ ధరకే విక్రయించడం మార్కెట్ను పెంచుకోవడంలో భాగమని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో కాంపా గురించి భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చేందుకు రిలయన్స్ సిద్ధమవుతోందని, రీఫ్రెష్మెంట్ పార్టనర్గా నియమించుకునేందుకు మూడు జట్లతో చర్చలు జరుపుతోందని తెలిపారు. రిలయన్స్కు దేశవ్యాప్తంగా రిటైల్ నెట్వర్క్ ఉంది. దాదాపు 2,500 స్టోర్లు ఉన్నాయి. ఈ నెట్వర్క్ ద్వారా కాంపా సేల్స్ను పెంచాలని ఇప్పటికే కంపెనీ అంతర్గతంగా లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిసింది. మరోవైపు జియో మార్ట్ పేరుతో నిర్వహిస్తున్న షాపింగ్ యాప్ ద్వారా విక్రయాలు పెంచుకోవడానికి వాడుకోనే యత్నాలు చేపట్టింది.
స్వదేశీ మంత్రం..
కాంపాను గ్రేట్ ఇండియన్ టేస్ట్, రిచ్ హెరిటేజ్ పేరుతో రిలయన్స్ ప్రమోట్ చేస్తోంది. ఇండియా ఫస్ట్ నినాదంతో వచ్చే కంపెనీల పట్ల సాధారణంగా అమెరికా కంపెనీలు ఆందోళన చెందుతుంటాయని పెప్సీలో గతంలో ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సర్కారు సైతం ఆత్మనిర్భరతకు పెద్దపీట వేస్తుండడం ఆయా కంపెనీల్లో గుబులు పెంచుతోందని తెలిపారు. అందుకే ఆ రెండు కంపెనీలు రిలయన్స్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రిలయన్స్ ఔట్లెట్స్లో కాంపా సాఫ్ట్ డ్రింక్స్ను ముఖ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారని రాయిటర్స్ పేర్కొంది. అయితే, ఏళ్లుగా విదేశీ కంపెనీల సాఫ్ట్ డ్రింక్స్కు అలవాటు పడిన జనం ఎంత మేర కాంపాను ఆదరిస్తారో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందేనని కన్జూమర్ అనలిస్ట్ ఒకరు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు