చంద్రయాన్-3 నుంచి యాపిల్ ఈవెంట్ దాకా.. యూట్యూబ్లో టాప్-10 లైవ్ స్ట్రీమింగ్లివే
వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Stastics) నివేదిక ప్రకారం ఇప్పటి దాకా యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్లో ఎక్కువ మంది చూసిన టాప్-10 జాబితా వివరాలివే..
ఇంటర్నెట్ డెస్క్: చంద్రయాన్-3 (Chandrayaan 3) అద్భుత విజయం సాధించడమే కాదు.. యూట్యూబ్లోనూ కొత్త రికార్డును సృష్టించింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Stastics) నివేదిక ప్రకారం.. యూట్యూబ్లో చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏ క్రికెట్ మ్యాచూ ఫుట్బాల్ మ్యాచూ అందుకోని అరుదైన ఫీట్ను సొంతం చేసుకుంది. ఆ టాప్-10 జాబితా వివరాలివే..
- చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే క్షణాలను ఆగస్టు 23న ఇస్రో యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేసింది. ఈ స్ట్రీమింగ్ను ఒకేసారి 82 లక్షల మందికిపైగా తిలకించారు. ఇప్పటి దాకా యూట్యూబ్లో ఎక్కువ మంది చూసిన లైవ్ స్ట్రీమ్ ఇదే.
- గతేడాది డిసెంబరులో బ్రెజిల్ (Brazil) - దక్షిణ కొరియా (South Korea) జట్ల మధ్య జరిగిన ఫిఫా ఫుట్బాల్ 2022 (Fifa Football Cup 2022) మ్యాచ్ను కేజ్టీవీ (Caze TV) అనే యూట్యూబ్ ఛానల్లో సుమారు 61 లక్షల మంది వీక్షించారు. చంద్రయాన్-3 తర్వాత ఎక్కువ మంది వీక్షించిన లైవ్ స్ట్రీమ్గా ఇది రికార్డు నెలకొల్పింది.
- దాని తర్వాత కేజ్టీవీలో గతేడాది డిసెంబరులో ప్రసారమైన బ్రెజిల్ - క్రొయేషియా ఫుట్బాల్ మ్యాచ్ను 52 లక్షల మంది చూశారు. ఫిఫా వరల్డ్ కప్ 2022లో భాగంగా ఈ మ్యాచ్ ఖతార్లోని ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో జరిగింది.
- నాలుగో స్థానంలో కూడా ఫుట్బాల్ మ్యాచే ఉంది. ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్ (Brazil)లో జరిగిన కారియోకా (Carioca) ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భాగంగా వాస్కో-ఫ్లెమింగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లైవ్స్ట్రీమ్ను కేజ్టీవీ యూట్యూబ్ ఛానల్లో 48 లక్షల మంది వీక్షించారు.
- ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ( Elon Musk)కు చెందిన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ (SpaceX) సంస్థ వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్కు పంపేందుకు క్రూ డెమో అనే స్పేస్ఫ్లైట్ను తయారు చేసింది. దానికి నాసా (NASA) నుంచి అనుమతి పొందేందుకు 2020 మే నెలలో జరిపిన ప్రయోగ పరీక్షల లైవ్ స్ట్రీమింగ్ను 40 లక్షల మంది చూశారు.
- దక్షిణ కొరియా (Suth Korea)కు చెందిన పాపులర్ మ్యూజిక్ బృందం బీటీఎస్ (BTS) విడుదల చేసిన బట్టర్ (Butter) అనే మ్యూజిక్ వీడియో స్ట్రీమింగ్ను 3,75,000 మంది వీక్షించారు. 2021 మేలో ఇది యూట్యూబ్లో లైవ్ స్ట్రీమింగ్ అయింది.
- ఏడో స్థానంలో యాపిల్ ఈవెంట్ (Apple Event) ఉంది. గతేడాది సెప్టెంబరులో ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్తోపాటు యాపిల్ వాచ్ సిరీస్8, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ అల్ట్రా, ఎయిర్పాడ్స్ ప్రోలను విడుదల చేసింది. ఈ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ను యూట్యూబ్లో 3,69,000 మంది చూశారు.
- హాలీవుడ్ (Hollywood)లో సంచలనం సృష్టించిన జానీ డెప్ (Johnny Depp) - అంబర్ హెర్డ్ (Amber Heard)ల పరువు నష్టం కేసుకు సంబంధించిన న్యాయస్థానం తీర్పును లా అండ్ క్రైమ్ నెట్వర్క్ అనే యూట్యూబ్ ఛానల్లో 3,55,000 మంది వీక్షించారు. గతేడాది జూన్లో ప్రసారమైన ఈ లైవ్ స్ట్రీమింగ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.
- ఫ్లూమినెన్స్ ఫుట్బాల్ క్లబ్ (Fluminense Football Club) ఆధ్వర్యంలో ఈ ఏడాది జులైలో యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ అయిన ఫ్లూమినెన్స్ - ఫ్లెమింగో జట్ల మధ్య మ్యాచ్ను 3,53,000 మంది చూశారు.
- ఇక పదో స్థానంలో ఇదే క్లబ్ ఆధ్వర్యంలో 2020 జులైలో జరిగిన కారికో ఛాంపియన్షిప్ (Carico Champ) మ్యాచ్ను 3,25,000 మంది చూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
Nothing phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ ప్రత్యేక ఎడిషన్ భారత్లో విడుదలైంది. నేవీ బ్లూ రంగులో దీన్ని తీసుకొచ్చారు. -
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
BSNL Cinemaplus: బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ పేరిట ఓటీటీ ప్యాకేజీలను అందిస్తోంది. దీంట్లో మొత్తం మూడు ప్యాక్లు ఉన్నాయి. తాజాగా స్టార్టర్ ప్యాక్ ధరను సంస్థ కుదించింది. -
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
వేసవిలో స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో వేగం మందగిస్తుంది. దీనికి కారణమేంటి? ఎందుకు వేగం తగ్గుతుంది? -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?