బంగారం ఇప్పుడు కొనొచ్చా?
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదార్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవలి సుంకం పెంపుతో ఒక్కసారిగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,000కు చేరింది. తదుపరి మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడంతో,
దిగుమతి సుంకం పెంపుతో రూ.54000కు బంగారం
ప్రస్తుతం రూ.52,600 వద్దకు
అంతర్జాతీయంగా ధరల తగ్గుదలతో ఉపశమనం
పండగల వరకు ఇలానే ఉండొచ్చు: నిపుణులు
ఈనాడు వాణిజ్య విభాగం
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వినియోగదార్లను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇటీవలి సుంకం పెంపుతో ఒక్కసారిగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,000కు చేరింది. తదుపరి మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తగ్గడంతో, దేశీయంగానూ మేలిమి బంగారం ధర రెండు రోజుల్లోనే 10 గ్రాములకు రూ.2,000 తగ్గినా, మళ్లీ శుక్రవారం కాస్త పెరిగి రూ.52,400కు చేరింది. వెండి ధర అయితే కిలో రూ.58,400గా ఉంది. ఈ ధరల్లో బంగారం కొనుగోలు చేసుకోవచ్చా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పండగల సీజన్ వరకు కూడా పసిడి, వెండి ధరలు ఈ స్థాయుల్లోనే ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ విపణిలో పసిడి ధర తక్కువగానే ఉన్నా, దిగుమతి సుంకాలకు తోడు డాలర్ మారకపు విలువ భారం వల్ల దేశీయంగా పసిడి ధర అంతగా దిగి రాలేదు.
అంతర్జాతీయంగానూ పెరిగి.. తగ్గి..
అదే అంతర్జాతీయ విపణులను తీసుకుంటే, అనిశ్చితి పరిస్థితుల్లో ఆదుకునే పెట్టుబడి సాధనంగానే పసిడిని పరిగణిస్తారు. ఈ ఏడాది ఆరంభంలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర అంతర్జాతీయ విపణుల్లో 1790 డాలర్ల వరకు ఉంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించినప్పటి నుంచి ధర పెరగడం ప్రారంభించి, యుద్ధం తీవ్రస్థాయిలో ఉన్న మార్చిలో గరిష్ఠంగా 2052.60 డాలర్లకు చేరింది. తదుపరి అమెరికా ఫెడ్ సహా కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం, వ్యవస్థల్లో నగదు లభ్యత తగ్గడం, అమెరికా బాండ్ రాబడుల ప్రతిఫలాలకు అనుగుణంగా డాలర్కు గిరాకీ పెరగడంతో బంగారం వైపునకు పెట్టుబడులు తరలిరావడం తగ్గింది. ఫలితంగా మళ్లీ ధర తగ్గుతూ వస్తోంది. ఇక మాంద్యం భయాలు చుట్టుముడుతున్నందున, ఇతర కమొడిటీలతో పాటు బంగారానికి గిరాకీ మరింత క్షీణించడంతో, ఈనెల 6న 9 నెలల కనిష్ఠమైన 1723 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. శనివారం రాత్రి 1740 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
దేశీయంగా చూస్తే 2021-21లో 34.62 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.73 లక్షల కోట్ల), 2021-22లో 46.14 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.64 లక్షల కోట్ల) విలువైన బంగారం అధికారికంగా దేశంలోకి దిగుమతి అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, వచ్చే పండగల సీజన్ విక్రయాల కోసం బంగారాన్ని ఏప్రిల్-జూన్లో మన వ్యాపారులు అధికంగా దిగుమతి చేసుకున్నారు.
విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు
బంగారం కోసం విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. ముఖ్యంగా డాలర్లు తరిగిపోతున్నందున, వాటికి గిరాకీ పెరిగి, రూపాయి విలువ పతనమవుతోంది. దేశ కరెంటు ఖాతా లోటూ అధికమవుతోంది. ఇది మరింత పెరగకుండా చూసేందుకే పసిడి దిగుమతులను నిరుత్సాహ పరిచేందుకు పసిడిపై దిగుమతి సుంకాలను 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ, జూన్ 30న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో డాలర్ విలువ కూడా రూ.79కి చేరడంతో, ఈ రెండూ కలిసి బంగారం ధరను పెంచేశాయి. ఫలితంగా 10 గ్రాముల మేలిమి బంగారం (999 స్వచ్ఛత) ధర రూ.54,000కు చేరింది. తదుపరి అంతర్జాతీయంగా ఔన్సు ధర 1815 డాలర్ల నుంచి 1740 డాలర్లకు తగ్గడంతో, దేశీయంగా కూడా 10 గ్రాములకు రూ.2000 మేర తగ్గి, రూ.52,000కు దిగి వచ్చింది.. శనివారం రాత్రి రూ.52,400 వద్ద ట్రేడవుతోంది. వెండిపై దిగుమతి సుంకాన్ని ఏమీ మార్చలేదు. అయితే వెండికి గిరాకీ తగ్గడంతో, ప్రస్తుతం కిలో రూ.58,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
బులియన్ ట్రేడర్లు ఏమంటున్నారంటే..
ప్రస్తుతం దేశీయంగా ఆషాఢమాసం రావడానికి తోడు ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్ల పండగల సీజన్ వరకు గిరాకీ లభించద’నే అంచనా వేస్తున్నట్లు ముంబయి బులియన్ ట్రేడర్లు తెలిపారు. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.51,000-54,000 శ్రేణిలో; కిలో వెండి రూ.57,000-65,000 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటే మినహా, దేశీయంగా ధరలు ఇలానే ఉండొచ్చని వివరించారు. బంగారం ధర పెరిగినా, తాకట్టుపై అధికమొత్తం అప్పు తీసుకునేందుకు వీలవుతుందే కానీ, విక్రయించి సొమ్ము చేసుకుందామంటే బాగా తక్కువకు అడుగుతున్నారని వినియోగదార్లూ చెబుతున్నారు. అందువల్ల అవసరం మేరకు మాత్రమే బంగారంపై పెట్టుబడులు మేలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
Steve Jobs: ఐఫోన్ల తయారు చేయాలన్న ఆలోచనను మొదట్లో స్టీవ్ జాబ్స్ ఒక వృధా పనిగా భావించారట. ఈ విషయాన్ని బ్రియాన్ మర్చంట్ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. -
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
Tata Motors Q4 results: టాటా మోటార్స్ నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మూడింతల లాభాన్ని నమోదుచేసింది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి. -
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
సైబర్ నేరాలతో ముడిపడి ఉన్న 28 వేల మొబైల్స్ను బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలకు డాట్ ఆదేశాలు జారీ చేసింది. -
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
గూగుల్లో లేఆఫ్లపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్నే ప్రశ్నించారు. -
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
Microsoft app store: గూగుల్, యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సిద్ధమవుతోంది. త్వరలో గేమ్స్ స్టోర్ను తీసుకురానుంది. -
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 97 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
Go Digit: ఆన్లైన్ వేదికగా ఇన్సూరెన్స్ సేవలందించే స్టార్టప్ సంస్థ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీఓ ఈనెల 15న ప్రారంభమై 17న ముగియనుంది. -
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
Train Ticket: రైల్వే టికెట్లకు సంబంధించిన రిఫండ్ల సొమ్ము ఇప్పుడ వేగంగా జమ అవుతోంది.ఒక రోజులోనే ఆయా ఖాతాల్లో పడుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. -
పసిడి.. ప్రతిఫలానికి ఎదురేదీ?
ఇటీవల ధరలు ఒక్కసారిగా పెరిగినా, బంగారం కొనుగోళ్లకు మంచి ముహూర్తంగా భావించే అక్షయ తృతీయ (ఈనెల 10) సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఆభరణాల విక్రేతలు ఆశిస్తున్నారు. -
ఎస్బీఐ రికార్డు లాభాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో, నాలుగో త్రైమాసికంలోనూ రికార్డు లాభాలు నమోదు చేసింది. వడ్డీయేతర ఆదాయం కలిసిరావడంతో జనవరి-మార్చిలో ఏకీకృత ప్రాతిపదిన నికర లాభం 18% వృద్ధితో రూ.21,384.15 కోట్లుగా నమోదైంది. -
సరికొత్త మారుతీ సుజుకీ స్విఫ్ట్
దేశీయంగా అధిక ఆదరణ పొందిన హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతీ స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వెర్షన్ గురువారం విడుదలైంది. -
ఈక్విటీ ఫండ్ల్లోకి పెట్టుబడులు 16% తగ్గాయ్
ఈ ఏడాది ఏప్రిల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లోకి రూ.18,917 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో నమోదైన రూ.22,633 కోట్లతో పోలిస్తే ఇవి 16% తక్కువ. -
రూ.7.34 లక్షల కోట్ల సంపద పోయె
సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గురువారం దేశీయ సూచీలు కుప్పకూలాయి. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించాలని నిర్ణయించారు. వారు లేవనెత్తిన అన్ని సమస్యలనూ పరిశీలిస్తామని కంపెనీ హామీ ఇవ్వడంతో తిరిగి విధుల్లో చేరుతున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
హెచ్పీసీఎల్ 2 షేర్లకు 1 షేరు బోనస్
హెచ్పీసీఎల్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,709.31 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,608.32 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. -
బీపీసీఎల్ బోనస్ షేరు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) బోనస్ షేర్లను ప్రకటించింది. ఒక్కో షేరుకు అదనంగా మరొక షేరు (1:1 నిష్పత్తిలో) ఇవ్వడానికి కంపెనీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. -
ఏషియన్ పెయింట్స్ తుది డివిడెండ్ 2815%
ఏషియన్ పెయింట్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,275.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
పీఎన్బీ లాభం మూడింతలు
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), మార్చి త్రైమాసికంలో రూ.3,010 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,159 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడింతలు ఎక్కువ. -
కోర్సు ఫీజులు 30-40% తగ్గించిన బైజూస్
బైజూస్ బ్రాండ్ పేరుతో విద్యా సేవలందిస్తున్న ఎడ్టెక్ సంస్థ థింక్ అండ్ లెర్న్ తన కోర్సు సబ్స్క్రిప్షన్ ఫీజులను 30-40% తగ్గించడంతో పాటు.. విక్రయ ప్రోత్సాహకాలను 50-100% పెంచినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్