61,900 వద్ద తక్షణ మద్దతు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్ఐఐ కొనుగోళ్లకు తోడు రూపాయి బలపడటంతో మదుపర్ల సెంటిమెంట్ మెరుగైంది.
సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు లాభపడ్డాయి. ముడిచమురు ధరలు తగ్గడం, ఎఫ్ఐఐ కొనుగోళ్లకు తోడు రూపాయి బలపడటంతో మదుపర్ల సెంటిమెంట్ మెరుగైంది. దేశీయంగా చూస్తే.. నవంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతానికి నెమ్మదించింది. నవంబరులో తయారీ పీఎంఐ 55.7కు చేరింది. అక్టోబరులో మౌలిక రంగ వృద్ధి 0.1 శాతానికి పరిమితమైంది. ఏప్రిల్-అక్టోబరులో ద్రవ్యలోటు రూ.7.58 లక్షల కోట్లకు పెరిగింది. 2022-23లో భారత వృద్ధి అంచనాలను ఎస్ అండ్ పీ గ్లోబల్ 7 శాతానికి తగ్గించింది. బ్యారెల్ ముడిచమురు 3.7 శాతం లాభపడి 86.8 డాలర్లకు చేరింది. రష్యా చమురుపై ధరల ఆంక్షలు అమల్లోకి రానుండటం ప్రభావం చూపింది. డాలర్తో పోలిస్తే రూపాయి 81.68 నుంచి 81.31కు బలపడింది. అంతర్జాతీయంగా చూస్తే.. చైనా లాక్డౌన్ల నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన గణాంకాలు నమోదుచేసింది. వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తామనేలా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 0.9 శాతం లాభంతో 62,869 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1 శాతం పెరిగి 18,696 పాయింట్ల దగ్గర స్థిరపడింది. స్థిరాస్తి, లోహ, ఎఫ్ఎమ్సీజీ షేర్లు లాభపడగా.. విద్యుత్, బ్యాంకింగ్, వాహన స్క్రిప్లు డీలాపడ్డాయి.. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.9,837 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు రూ.1,336 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. నవంబరులో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐలు) మొత్తంగా రూ.36,329 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 5:4గా నమోదు కావడం..
ఎంపిక చేసిన పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.
ఈ వారంపై అంచనా: జీవనకాల గరిష్టానికి చేరిన సెన్సెక్స్కు, గరిష్ఠ స్థాయుల్లో లాభాల స్వీకరణ ఎదురైంది. స్వల్పకాలంలో మార్కెట్ స్థిరీకరణకు అవకాశం ఉంది. 61,900 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, 60,800 పాయింట్ల వద్ద మరో కీలక మద్దతు లభించొచ్చు. ఈ కీలక మద్దతు స్థాయుల ఎగువన కొనసాగినంత వరకు సానుకూలంగానే కదలాడొచ్చు.
ప్రభావిత అంశాలు: డిసెంబరు 7న వెలువడనున్న ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షపై మదుపర్లు దృష్టి పెట్టొచ్చు. ఈసారి రేట్ల పెంపు 25-35 బేసిస్ పాయింట్ల మేర ఉండొచ్చని అంచనా. అయితే జీడీపీ వృద్ధి అంచనాలు కీలకం కానున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుంచి మార్కెట్లు సంకేతాలు తీసుకోవచ్చు. 5వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్, 8న తుది ఫలితాలు వెలువడనున్నాయి. అధికార భాజపాకు వ్యతిరేక ఫలితం వస్తే మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నుంచీ సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. షేరు/రంగం ఆధారిత కదలికలూ ప్రభావం చూపుతాయి. ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఓ కన్నేయొచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. ఆస్ట్రేలియా, కెనడా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకోనున్నాయి. తయారీ పీఎంఐలు, యూరో ఏరియా రిటైల్ విక్రయాలు, అమెరికా ఫ్యాక్టరీ ఆర్డర్లు, వినియోగదారు సెంటిమెంట్, నిరుద్యోగ క్లెయిమ్లు, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి పెట్టొచ్చు. ఎఫ్ఐఐ, డీఐఐ పెట్టుబడులు నుంచి కూడా సంకేతాలు తీసుకోవచ్చు. విదేశీ పెట్టుబడులు కొనసాగితే మార్కెట్లకు సానుకూలం కానుంది.
తక్షణ మద్దతు స్థాయులు: 62,447, 61,959, 61,442
తక్షణ నిరోధ స్థాయులు: 63,149, 63,584, 64,000
సెన్సెక్స్కు 60,800- 61,900 శ్రేణిలో మద్దతు లభించొచ్చు.
- సతీశ్ కంతేటి, జెన్ మనీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. లాభాల్లో 47 శాతం వృద్ధి నమోదు చేసింది. -
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
US-India: భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈవో కాలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని అగ్రరాజ్య రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 609 పాయింట్లు, నిఫ్టీ 150 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
Flight ticket prices: టికెట్ ధరలో మిగిలిన సేవలను కూడా కలిపేస్తున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో టికెట్ ధరలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సిద్ధమైంది. ఇందుకోసం సెబీకి తాజాగా ముసాయిదా పత్రాలను సమర్పించింది. -
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
Raymond group: రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, ఆయన భార్య నవాజ్ మోదీ విడాకుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. తాజాగా ఆమెను గ్రూప్నకు చెందిన పలు కంపెనీల నుంచి డైరెక్టర్గా తొలగించారు. -
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
ICICI Credit Cards: కొత్తగా జారీ చేసిన దాదాపు 17 వేల క్రెడిట్ కార్డుల వివరాలు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 94 పాయింట్ల లాభంతో 74,434 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 22,599 దగ్గర కొనసాగుతోంది. -
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు