Adani-LIC: అదానీ కంపెనీలకు ఎల్ఐసీ రుణాలు రూ.6,183 కోట్లు
అదానీ గ్రూప్ కంపెనీలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇచ్చిన రుణాలు మార్చి 5 నాటికి రూ.6,183 కోట్ల మేర ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభకు రాతపూర్వకంగా తెలిపారు.
దిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీలకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఇచ్చిన రుణాలు మార్చి 5 నాటికి రూ.6,183 కోట్ల మేర ఉన్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభకు రాతపూర్వకంగా తెలిపారు. ఈ రుణాలు 2022 డిసెంబరు 31న రూ.6,347 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్లో ఏఏ సంస్థ ఎల్ఐసీ నుంచి ఎంత మేర రుణాలు తీసుకుందంటే..
* అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ - రూ.5,388.60 కోట్లు
* అదానీ పవర్ (ముంద్రా) - రూ.266.00 కోట్లు
* అదానీ పవర్ (మహారాష్ట్ర-ఫేజ్1)- రూ.81.60 కోట్లు
* అదానీ పవర్ (మహారాష్ట్ర-ఫేజ్3)- రూ.254.87 కోట్లు
* రాయ్గఢ్ ఎనర్జీ జనరేషన్ - రూ.45.00 కోట్లు
* రాయ్పుర్ ఎనర్జెన్ - రూ.145.67 కోట్లు
* ప్రభుత్వ రంగంలోని మిగతా 5 సాధారణ బీమా కంపెనీలు అదానీ గ్రూప్ కంపెనీలకు ఎలాంటి రుణాలు అందించలేదని తెలిపాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
ప్రభుత్వం కమిటీని నియమించలేదు.. సెబీ విచారిస్తోంది!
అదానీ గ్రూప్లో ఆర్థిక అవకతవకలు జరిగాయని, అకౌంటింగ్ మోసాలకు ఆ సంస్థ పాల్పడినట్లు యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏ కమిటీని నియమించలేదని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి లోక్సభకు వెల్లడించారు. అదానీ గ్రూప్నకు చెందిన 9 నమోదిత కంపెనీలు (ఎన్డీటీవీ మినహా) జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య సుమారు 60 శాతం మేర మార్కెట్ విలువ కోల్పోయాయని, ఈ నేపథ్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ జరుపుతోందని మంత్రి వివరించారు. ఈ కంపెనీల షేర్ల ధరల్లో ఒడుదొడుకులు నిఫ్టీ 50పై పెద్దగా ప్రభావం చూపలేదని, నిఫ్టీ ఈ సమయంలో 4.5 శాతమే కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు.
* అదానీ కంపెనీ దిగుమతి చేసుకుంటున్న విద్యుదుత్పత్తి, సరఫరా పరికరాల వ్యవహారంపై డీఆర్ఐ జరిపిన విచారణ ముగిసిందని మంత్రి తెలిపారు. నివేదికను సంబంధిత న్యాయ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
Adani group: అదానీ గ్రూప్ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దానిపై అమెరికా సంస్థలు దర్యాప్తు చేపట్టాయని వస్తున్న వార్తలే ఇందుకు కారణం. -
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
Jio - IPL: ఐపీఎల్ వీక్షించాలనుకునేవారికి జియోలో రెండు అనువైన డేటా ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలేంటో చూద్దాం..! -
Bill Gates: ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను: బిల్ గేట్స్
స్టీవ్ జాబ్స్లా బహిరంగ సమావేశాల్లో సహజంగా వ్యవహరించలేనని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. -
Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం
Uber: ఉబర్ వల్ల ఉపాధి కోల్పోయామంటూ కోర్టును ఆశ్రయించిన ట్యాక్సీ డ్రైవర్లకు రూ.1,475 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. -
Stock Market: ఫ్లాట్గా స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,000
Stock Market Opening bell: ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 4 పాయింట్ల స్వల్ప లాభంతో 72,647 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కుంగి 22,007 దగ్గర కొనసాగుతోంది. -
స్మాల్క్యాప్ ప్రకంపనలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు స్మాల్క్యాప్ షేర్లు దూసుకెళ్లాయి. గత నెలరోజుల వ్యవధిలో మాత్రం ఇవి మదుపర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 19 వరకు బీఎస్ఈ సెన్సెక్స్ 24% లాభపడితే, స్మాల్క్యాప్ సూచీ 71% దూసుకెళ్లడం గమనార్హం. -
అదానీ గ్రూప్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో రూ.1.2 లక్షల కోట్లు (దాదాపు 14 బి.డాలర్లు) పెట్టుబడులు పెట్టేందుకు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. ఇంధన, విమానాశ్రయాలు, కమొడిటీస్, సిమెంట్, మీడియా సహా పలు గ్రూప్ కంపెనీల్లో ఈ పెట్టుబడులు పెట్టనుంది. -
ఫెడ్ వ్యాఖ్యలు కీలకం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఊగిసలాటకు గురికావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తం మీద మార్కెట్లు సానుకూలంగానే ఉండొచ్చని అంటున్నారు. జపాన్, అమెరికా, బ్రిటన్ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుండటమే ఇందుకు కారణం. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఏప్రిల్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.66,022 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.66,502; రూ.66,822 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. -
72000- 72590 పాయింట్ల శ్రేణి కీలకం!
జీవనకాల తాజా గరిష్ఠాల నుంచి సూచీలు గతవారంలో వెనక్కి వచ్చాయి. చిన్న, మధ్య స్థాయి కంపెనీల షేర్ల విలువలు బుడగల్లా ఉన్నాయని, మదుపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెబీ పేర్కొనడం ప్రతికూల ప్రభావం చూపింది. -
ఈ వారంలో 3 కొత్త ఐపీఓలు
ఈ వారం మూడు కంపెనీల ఐపీఓలు మదుపర్ల ముందుకు రానున్నాయి. ఇవి ప్రధాన విభాగంలోనివి కావు. చిన్న, మధ్య స్థాయి (ఎస్ఎంఈ) విభాగానికి చెందిన 3 కంపెనీలు మొత్తం రూ.86.8 కోట్లు సమీకరించనున్నాయి. -
సంక్షిప్త వార్తలు
ఇ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ విలువ రెండేళ్లలో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.41,000 కోట్లు) తగ్గింది. 2022 జనవరి 31కి సంస్థ విలువ 40 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది జనవరి చివరకు సంస్థ విలువ 35 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. -
Flipkart: ఐఫోన్ ఆర్డర్ క్యాన్సిల్.. ఫ్లిప్కార్ట్కు రూ.10,000 జరిమానా!
Flipkart: ఐఫోన్ ఆర్డర్ను ఏకపక్షంగా క్యాన్సిల్ చేయడం వల్ల కస్టమర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని.. అందుకు ఫ్లిప్కార్ట్ రూ.10,000 జరిమానా చెల్లించాలని సెంట్రల్ ముంబయికి చెందిన ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
Satyendar Jain: ఆప్నేత సత్యేందర్ జైన్కు సుప్రీంలో చుక్కెదురు
-
PM Modi: ఆ సవాల్ను స్వీకరిస్తున్నా.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలకు మోదీ జవాబు
-
Adani group: నష్టాల్లో అదానీ గ్రూప్ స్టాక్స్.. అమెరికా దర్యాప్తు ఎఫెక్ట్
-
Jio - IPL: ఐపీఎల్ సందడి.. జియో యూజర్లకు డేటా ప్యాక్లు
-
Nadendla Manohar: బొప్పూడి సభలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది: నాదెండ్ల మనోహర్
-
Maldives Parliament Elections: మాల్దీవుల్లో ఎన్నికలు.. భారత్కు బ్యాలెట్ బాక్సులు..!