రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు నేడు ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్లకు నేడు (గురువారం) ప్రత్యేక ప్రీ- ఓపెన్ సెషన్ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) నిర్వహించనుంది. ఇది ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది.
ఉదయం 9 -10 గంటల మధ్య
ఆర్థిక సేవల విభాగం విభజన నేపథ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) షేర్లకు నేడు (గురువారం) ప్రత్యేక ప్రీ- ఓపెన్ సెషన్ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) నిర్వహించనుంది. ఇది ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుంది. ఆర్ఐఎల్ తన వ్యాపార ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ను (జియో ఫైనాన్షియల్ సర్వీసెస్-జేఎఫ్ఎస్ఎల్గా పేరు మారనుంది) విభజించి, స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తుండటం ఇందుకు నేపథ్యం. విభజన పథకం ప్రకారం..రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదార్లు తమ వద్ద ఉన్న ప్రతి షేరుకు.. ఒక జేఎఫ్ఎస్ఎల్ షేరును పొందుతారు. అంటే 100 ఆర్ఐఎల్ షేర్లకు 100 జేఎఫ్ఎస్ఎల్ షేర్లు లభిస్తాయి. జులై 20న రికార్డు తేదీగా నిర్ణయించినందున, అప్పటికి రిలయన్స్ షేర్లు కలిగి ఉన్నవాళ్లకే ఈ అవకాశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కలిగి ఉన్న వాటాదార్లు సుమారు 36 లక్షల మంది ఉంటారని అంచనా.
ఎందుకు.. ఏం జరుగుతుంది..
* రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విభజించిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరుకు స్థిర విలువను ఈ ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ ద్వారా లెక్కిస్తారు. ఇందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రితం రోజు ముగింపు విలువ.. ప్రత్యేక సెషన్లో వచ్చిన విలువ మధ్య వ్యత్యాసాన్ని ఈ స్థిర విలువగా నిర్థారిస్తారు.
* జియో ఫైనాన్షియల్ షేరు స్థిర విలువ రూ.160-190 మధ్య ఉండేందుకు అవకాశం ఉందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. (నోమురా రూ.168; యాక్సిస్ సెక్యూరిటీస్ రూ.160; జేపీ మోర్గాన్ రూ.189; జెఫ్రీస్ రూ.179గా ఉండొచ్చని పేర్కొన్నాయి.)
* ప్రత్యేక ప్రి- ఓపెన్ సెషన్ కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల సాధారణ ట్రేడింగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.
* అందువల్ల ప్రీ-ఓపెన్ సెషన్లో నిఫ్టీ-50 సూచీ పాయింట్లను లెక్కించేందుకు, ఆర్ఐఎల్ మినహా మిగతా 49 కంపెనీల షేర్ల విలువలనే పరిగణనలోకి తీసుకుంటారు.
నిఫ్టీపై ప్రభావం ఇలా
* సూచీల్లోని షేర్లకు సంబంధించిన కంపెనీల్లో విలీనాలు, వ్యాపార విభజన లాంటివి చోటుచేసుకున్నప్పుడు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఏప్రిల్లో ఎన్ఎస్ఈ సవరించింది. ఈ ప్రకారం.. సూచీలోని కంపెనీ నుంచి విడదీసిన సంస్థ షేరుకు ప్రత్యేక ప్రీ-ఓపెన్ సెషన్ నిర్వహిస్తే, ఆ సూచీకి ఆ సంస్థ షేరును తాత్కాలికంగా చేర్చుతారు. ప్రస్తుత విషయానికొస్తే.. ప్రత్యేక సెషన్లో నిఫ్టీ 50 సూచీ విలువను 49 కంపెనీల షేర్ల విలువలు, ఆర్ఐఎల్ క్రితం రోజు ముగింపు ధర, జియో ఫైనాన్షియల్ షేరు సున్నా విలువ ఆధారంగా లెక్కిస్తారు.
* ప్రత్యేక సెషన్ ముగిశాక.. ఆర్ఐఎల్ షేరుకు వచ్చిన విలువ, జియో ఫైనాన్షియల్ షేరుకు కనుగొన్న స్థిర విలువ ప్రకారం నిఫ్టీ-50 సూచీ స్థాయిలను లెక్కిస్తారు. అంటే.. జియో ఫైనాన్షియల్ (షేరు విలువ స్థిరంగా ఉండటంతో) మినహా మిగతా కంపెనీల షేర్ల వాస్తవ విలువల ఆధారంగానే సూచీ విలువ కదులుతుంది.
* జియో ఫైనాన్షియల్ షేరు ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యే వరకు.. ఈ షేరుకు కనుగొన్న విలువను రోజువారీ నిఫ్టీ సూచీ విలువ మదింపునకు పరిగణనలోకి తీసుకుంటూనే ఉంటారు.
* ఎక్స్ఛేంజీల్లో షేరు నమోదయ్యాక.. మూడు రోజుల పాటు నిఫ్టీ 50 సూచీలో, 51వ కంపెనీ షేరుగా జియో ఫైనాన్షియల్ కొనసాగుతుంది. షేరులో ఒడుదొడుకులు సర్దుమణిగేందుకు ఇది తోడ్పడుతుంది. మూడు రోజులు పూర్తయ్యాక.. అన్ని సూచీల్లో నుంచి జియో ఫైనాన్షియల్ షేరును తొలగిస్తారు. జియో ఫైనాన్షియల్ షేరు వచ్చే 2-3 నెలల్లో నమోదయ్యే అవకాశం ఉంది.
రిలయన్స్ షేరుపై ఎంత ప్రభావం?
2005 జూన్ 19న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి నాలుగు సంస్థలను విభజించినప్పుడు.. 2006 జనవరిలో ఈ సంస్థ షేరు 38% పెరిగింది. ప్రస్తుత విభజన నేపథ్యంలో, ఆర్ఐఎల్ షేరు తాత్కాలికంగా కొంత మేర దిగిరావొచ్చని అంటున్నారు.
మూడో రోజూ దూకుడే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు దూకుడు వరుసగా మూడో రోజైన బుధవారమూ కొనసాగింది. బీఎస్ఈలో షేరు 0.62% పెరిగి రూ.2,840 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ.2,855 వద్ద తాజా 52 వారాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ఎన్ఎస్ఈలో 0.75% లాభంతో రూ.2,841.85 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ 3.69% (రూ.68,269.06 కోట్లు) పెరిగి రూ.19,21,434.54 కోట్లకు చేరింది. దేశంలో మార్కెట్ విలువపరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
Super Rich Club: 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన వ్యక్తులను సూపర్-రిచ్గా వ్యవహరిస్తుంటారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ఈ జాబితాలో ఎప్పుడూ లేనంతగా 15 మంది చేరారు. -
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
India Economic Growth: ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పుంజుకోవడం వల్ల భారత వృద్ధిరేటు 2024లో బలంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. -
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
Stock Market Opening bell: ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 73,487 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 38 పాయింట్లు కుంగి 22,365 దగ్గర కొనసాగుతోంది. -
మళ్లీ 22,400 పైకి నిఫ్టీ
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో మదుపర్ల కొనుగోళ్ల జోరుతో గురువారం సూచీలు లాభాల్లో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల అండతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్లను నడిపించాయి. -
4 లక్షల కోట్ల డాలర్ల భారత్!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ 4 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.332 లక్షల కోట్ల) స్థాయికి చేరుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎమ్) సభ్యుడు సంజీవ్ సన్యాల్ అంచనా వేశారు. -
మహీంద్రా రూ.37,000 కోట్ల పెట్టుబడులు
మహీంద్రా గ్రూప్ తన వాహన విభాగంలో వచ్చే మూడేళ్లలో రూ.37,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. 2030 కల్లా మరో 23 కొత్త వాహనాలను విపణిలోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. -
కిమ్స్ హాస్పిటల్స్కు రూ.71.6 కోట్ల లాభం
కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.637.6 కోట్ల ఆదాయాన్ని, రూ.71.6 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
261% పెరిగిన గెయిల్ లాభం
ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,176.97 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నమోదు చేసింది. -
వస్తువుల ఎగుమతులు రూ.41.5 లక్షల కోట్లకు!
మన దేశ వస్తువుల ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో 60-70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.98-5.81 లక్షల కోట్ల) మేర పెరిగి 500 బి.డాలర్ల (సుమారు రూ.41.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశం ఉందని ఎగుమతిదార్ల సమాఖ్య ఫియో (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్) అంచనా వేసింది. -
రూ.7,675 కోట్లకు పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం
వొడాఫోన్ ఐడియా, మార్చి త్రైమాసికంలో రూ.7,675 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6,419 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
నరేశ్ గోయెల్ భార్య అనిత కన్నుమూత
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయెల్ భార్య అనిత గోయెల్(70) గురువారం దక్షిణ ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మృతి చెందారు. -
వినీత్ నయ్యర్ కన్నుమూత
టెక్ మహీంద్రా మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ నయ్యర్ (85) గురువారం ఉదయం దిల్లీలో మృతి చెందారు. -
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్ మృతి
కేశోరామ్ ఛైర్పర్సన్ మంజుశ్రీ ఖైతాన్(65) కన్నుమూశారని బీకే బిర్లా గ్రూప్ గురువారం ప్రకటించింది. అనారోగ్య కారణంగా కోల్కతాలోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచారని గ్రూప్ అధికారులు తెలిపారు. -
42 కోట్ల మంది గగన విహారం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, దేశంలో విమాన ప్రయాణికుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరి రికార్డులు బద్దలు కొట్టొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. -
రికార్డు గరిష్ఠాలకు వెండి
బంగారం, వెండి ధరలు గత రెండు రోజుల్లో బాగా పెరిగాయి. వెండి అయితే కిలో ధర తొలిసారిగా రూ.88,000ను మించింది. గత రెండు రోజుల్లోనే కిలోకు రూ.1500కు పైగా పెరిగింది. -
62.48% పెరిగిన పిట్టీ ఇంజినీరింగ్ లాభం
ఎలక్ట్రికల్ స్టీల్ ల్యామినేషన్లు, మోటార్లు/ జనరేటర్లకు సబ్-అసెంబ్లీస్, డైకాస్ట్ రోటార్స్ ఉత్పత్తి చేసే సంస్థ పిట్టీ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. -
పోకర్ణ లాభం రూ.15.51 కోట్లు
పోకర్ణ లిమిటెడ్ మార్చి త్రైమాసికానికి రూ.164.38 కోట్ల ఆదాయాన్ని, రూ.15.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
ఎం అండ్ ఎం లాభం రూ.2,754 కోట్లు
మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
సంక్షిప్త వార్తలు(5)
ఐటీ, టెక్నాలజీ సొల్యూషన్లు అందించే ఏసర్ గ్రూప్, గృహోపకరణాల విపణిలోకి ప్రవేశించింది. ఇందుకోసం నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయంగా ఏసర్ప్యూర్ బ్రాండ్ను ఆవిష్కరించిన సంస్థ, తాజాగా వివిధ ఉత్పత్తులను మన దేశంలో ఆవిష్కరించింది. -
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ