Hyderabad: ‘మెర్సిడెస్ బెంజ్’పై మహిళల మోజు.. హైదరాబాద్లో 30 శాతం కొనుగోలుదార్లు వాళ్లే
విద్యుత్తు మోడళ్ల అమ్మకాలపై విలాసకార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఆసక్తిగా ఉంది. వచ్చే ఏడాది- ఏడాదిన్నరలో 3- 4 విద్యుత్తు కార్లు (ఈవీ) తీసుకువస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ వెల్లడించారు.
హైదరాబాద్ (ఖైరతాబాద్), న్యూస్టుడే: విద్యుత్తు మోడళ్ల అమ్మకాలపై విలాసకార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఆసక్తిగా ఉంది. వచ్చే ఏడాది- ఏడాదిన్నరలో 3- 4 విద్యుత్తు కార్లు (ఈవీ) తీసుకువస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ వెల్లడించారు. మూడేళ్లలో తాము విక్రయించే కార్లలో నాలుగో వంతు విద్యుత్తు కార్లే ఉంటాయని అన్నారు. అత్యధికంగా అమ్ముడవుతున్న మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ కార్లను గురువారం ఇక్కడ ఆయన ఆవిష్కరించారు. జీఎల్సీ 300 ధర రూ.73.5 లక్షలు కాగా, జీఎల్సీ 220డి ధర రూ.74.5 లక్షలు (ఎక్స్ షోరూం). పెట్రోలు, డీజిల్ ఇంజన్లతో ఈ ఎస్యూవీలో రెండో తరం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్, 48 వోల్ట్ మైల్డ్ హై్రబ్రిడ్ సిస్టమ్తో శక్తిమంత టర్బోఛార్జ్, ఎంబీయూఎక్స్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. దేశవ్యాప్తంగా వీటికి 1500 బుకింగ్లు రాగా, ఇందులో 8% హైదరాబాద్ నుంచి జరిగాయి. హైదరాబాద్ తమకు ముఖ్యమైన మార్కెట్ అని, ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనుగోలు చేసే వారిలో 30% మంది మహిళలు ఉండటం ప్రత్యేకతగా సంతోష్ వివరించారు. 2022 అమ్మకాలతో పోలిస్తే, 2023లో రెండంకెల వృద్ధి సాధించగలమని అంచనా వేశారు. తమ పుణె ప్లాంటులో ప్రస్తుతం ఏటా 20,000 కార్లు ఉత్పత్తి చేస్తుండగా, ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నారు. ఈ ప్లాంటుపై ఇప్పటికి రూ.2700 కోట్ల పెట్టుబడి పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.