రాణించిన డాబర్‌ ఇండియా

డాబర్‌ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది   16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది.

Published : 03 May 2024 03:26 IST

దిల్లీ: డాబర్‌ ఇండియా, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.341.22 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.292.76 కోట్ల కంటే ఇది   16.55% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.2,677.80 కోట్ల నుంచి 5.11% పెరిగి రూ.2,814.6 4 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 3.67% పెరిగి రూ.2,490.43 కోట్లుగా నమోదయ్యాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) డాబర్‌ ఇండియా నికర లాభం రూ.1,811.31 కోట్లకు చేరింది. 2022-23 లాభం రూ.1,701.33 కోట్ల కంటే ఇది 6.46% అధికం. కార్యకలాపాల ఆదాయం రూ.11,529.89 కోట్ల నుంచి 7.58% వృద్ధితో రూ.12,404.01 కోట్లుగా నమోదైంది. రూ.1 ముఖ విలువ గల ప్రతి షేరుకు రూ.2.75 (275%) తుది డివిడెండును డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని