రైతులకు, రక్షణకు.. డ్రోన్లు
ఒక డ్రోన్ తయారవ్వాలంటే బ్యాటరీ మోటారుతో పాటు 75 రకాల వస్తువులు అవసరమవుతాయి. వీటిలో చాలా వరకు చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నారు.
దేశ చరిత్రలో గతేడాది ఒక ముందడుగు పడింది. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు ‘కిసాన్ డ్రోన్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 మంది రైతులకు ప్రయోగాత్మకంగా డ్రోన్లను అందించారు. ఆ అధునాతన డ్రోన్లను తయారుచేసింది.. చెన్నైకి చెందిన అంకురం ‘గరుడ ఏరోస్పేస్’. ఇప్పుడా సంస్థ ఒక్క వ్యవసాయంలోనే కాదు, రక్షణ రంగంలోనూ డ్రోన్ తయారీలో రికార్డు సాధించే దిశగా అడుగులు వేసింది.
ఈనాడు-చెన్నై: ఒక డ్రోన్ తయారవ్వాలంటే బ్యాటరీ మోటారుతో పాటు 75 రకాల వస్తువులు అవసరమవుతాయి. వీటిలో చాలా వరకు చైనా, ఇతర దేశాలనుంచే దిగుమతి చేసుకుంటున్నారు. దీన్నే ఓ సవాల్గా తీసుకుందీ స్టార్టప్. తొలిగా 75 శాతం స్వదేశీ పరికరాలు, వస్తువులతో ఉత్పత్తి చేపట్టనుంది. ఆ తర్వాత 100 శాతం ఈ దిశగా సాగేలా ప్రణాళికను ప్రకటించింది. పెట్టుబడులూ వరుసకట్టాయి. ఇప్పటివరకు 250 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.2050 కోట్లు) నిధులు సమకూరాయి. ఈ ఉత్సాహంతో డ్రోన్ల తయారీని మొదలుపెట్టింది. స్వదేశీ వస్తువులనే వాడేందుకు దేశవ్యాప్తంగా 120 ప్రముఖ సంస్థలతో చేతులు కలిపింది.
25,000 డ్రోన్లు..
రానున్న ఏడాది కాలంలోనే 25,000 స్వదేశీ డ్రోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాతి రెండేళ్లలో ఈ సంఖ్య లక్షకు చేరనుంది. ప్రధానంగా వ్యవసాయం, ఆ తర్వాత ఇతరత్రా రంగాల్లోనూ మరింతగా విస్తరించడానికి ఈ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. పంట దిగుబడులు పెరిగేలా, నష్టాల్ని నివారించేలా, అత్యాధునిక పద్ధతుల్ని వ్యవసాయంలో ప్రవేశపెట్టడమే లక్ష్యంగా వీటిని తయారుచేస్తోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సైతం ఆసక్తి చూపడంతో.. వారికి కూడా ‘కిసాన్ డ్రోన్’ పథకంలో భాగంగానే అందిస్తున్నారు. వీరు వ్యవసాయ వృద్ధికి చేస్తున్న కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్ల తయారీపై తొలిసారిగా ప్రత్యేక రాయితీ ప్రకటించింది.
రక్షణ.. రవాణా..
* డ్రోన్ల వినియోగాన్ని ‘గరుడ’ సంస్థ వినూత్నంగా ముందుకు తీసుకెళ్తోంది. దేశ రక్షణరంగానికి పనికొచ్చేలా తయారుచేస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఎయిర్షోలో ‘సూరజ్’ పేరుతో భారీ డ్రోన్ను ఆవిష్కరించారు. అత్యాధునిక లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సెన్సార్లు, కెమేరాలతో ఉన్న ఈ డ్రోన్ 3,000 అడుగుల ఎత్తుకు వెళ్లి ఏకంగా 12 గంటలపాటు పర్యవేక్షించగలదని అంటున్నారు. ఈ క్రమంలో మరో ప్రయోగానికీ ఈ సంస్థ సాహసం చేసింది. తుర్కియేలో భారీ భూకంపం సంభవించినప్పుడు అక్కడికెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బలగాల సూచన మేరకు రెండు డ్రోన్లను అక్కడికి పంపింది. రక్షణ చర్యలు వేగంగా జరగడానికి ఇవెంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.
* బయో మెడికల్ ఉత్పత్తుల్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అత్యవసరంగా తరలించేందుకు ఈ స్టార్టప్ ‘సంజీవిని డ్రోన్’ పేరుతో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న నారాయణ హెల్త్సిటీ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో వీటిని ఏర్పాటు చేశారు. ఏడాదిలో 21 ఆసుపత్రుల్లో ఈ సేవల్ని విస్తృతం చేయాలని అనుకుంటున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లోనూ మందులు సరఫరా చేసేందుకూ 26 నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా వాడారు. తుపాను సమయాల్లోనూ రక్షణ చర్యల్లో వీరికి చెందిన పలు డ్రోన్లు పాల్గొన్నాయి.
ఈత నుంచి మొదలుపెట్టి...
గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ అంతర్జాతీయ స్విమ్మర్గా సుపరిచితుడు. పలు రికార్డులు సృష్టించిన ఈయన.. చెన్నైలోని అగ్ని కాలేజీ ఆఫ్ టెక్నాలజీ సంస్థను నిర్వహించేవారు. దీన్నుంచి ఆయన హయాంలో 300 మహిళా స్టార్టప్లు వెలుగులోకి వచ్చాయి. అగ్ని ఫౌండేషన్ ద్వారా తమిళనాడులో బలహీనవర్గాలకు సాయం చేయడం, ప్రాజెక్ట్ ఫ్రీడం పేరుతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య చేరువయ్యేలా చేస్తున్నారు. సాంకేతికత వైపు దృష్టి మళ్లి 2016లో గరుడ ఏరోస్పేస్ స్టార్టప్ తెచ్చారు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ప్రచారకర్తగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434