శామ్‌సంగ్‌ నుంచి ఓఎల్‌ఈడీ టీవీలు

దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌, మన విపణిలో ఓఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది. 

Updated : 02 Jun 2023 11:50 IST

ప్రారంభ ధర రూ.1.69 లక్షలు

దిల్లీ: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శామ్‌సంగ్‌, మన విపణిలో ఓఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది.  గురువారం విపణిలోకి విడుదల చేసిన ఎస్‌95సీ, ఎస్‌90సీ ఓఎల్‌ఈడీ టీవీల ధరలు రూ.1.69 లక్షల నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఏఐ-అనుసంధానిత న్యూరల్‌ క్వాంటమ్‌ 4కే ప్రాసెసర్‌, ఇంటెలిజెంట్‌ ఐకంఫర్ట్‌ మోడ్‌, వైర్‌లెస్‌ డాల్బీ అట్‌మోస్‌, ఓటీఎస్‌+ కలిగిన సౌండ్‌, ఐఓటీ హబ్‌, ఐఓటీ అనుసంధానిత సెన్సర్ల వంటి ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని