Whatsapp: ‘వాట్సాప్ వాడకపోయినా మైక్ ఆన్’.. ఆరోపణలపై స్పందించిన కేంద్రం!
WhatsApp: ట్విటర్లో పనిచేసే ఓ ఉద్యోగి వాట్సాప్పై చేసిన ట్వీట్ సోషల్మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ విషయంపై స్పందించారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్పై (Whatsapp) తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. యాప్ను వాడని సమయంలోనూ బ్యాక్గ్రౌండ్లో మైక్రోఫోన్ పనిచేస్తుందంటూ ట్విటర్లో పనిచేసే ఓ ఉద్యోగి చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో ఈ యాప్ నమ్మదగినది కాదంటూ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్మస్క్ ట్వీట్ చేయగా.. వాట్సాప్పై ఆరోపణలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ భారత ప్రభుత్వం తరఫున స్పందించారు.
ట్విటర్ (Twitter)లో పనిచేస్తున్న ఫోడ్ డబిరి అనే ఓ ఇంజనీర్ ఉద్యోగి ట్వీట్తో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ‘నేను నిద్రపోతున్న సమయంలో వాట్సాప్ బ్యాగ్రౌండ్లో మైక్రోఫోన్ను ఉపయోగిస్తోంది. ఉదయం లేవగానే నా ఫోన్ను చూసి ఆశ్చర్యపోయా’ అంటూ తన ఆండ్రాయిడ్ డ్యాష్బోర్డ్ స్క్రీన్ షాట్ను ట్విటర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ‘అసలు ఏం జరుగుతోంది’ అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దీనిపై ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందించారు. వాట్సాప్ నమ్మదగిన అప్లికేషన్ కాదని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం మరింత వైరల్గా మారింది.
స్పందించిన భారత్
వాట్సాప్పై వచ్చిన ఆరోపణలపై రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. యూజర్లకు గోప్యతకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని పేర్కొన్నారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు సిద్ధమవుతోందని ఈ సందర్భంగా తెలిపారు. గతేడాది అక్టోబర్లో వాట్సాప్ సేవలు రెండు గంటల పాటు నిలిచిపోయిన సందర్భంలోనూ స్పందించిన భారత్.. ఆగిపోవడానికి గల కారణాలను తెలియజేయాలంటూ వాట్సాప్ నుంచి వివరణ కోరింది. భారత యూజర్లను అంతర్జాతీయ కాల్స్ వేధిస్తున్న వేళ ఈ వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.
అదో బగ్..: వాట్సాప్
సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో వాట్సాప్ స్పందించింది. మైక్రోఫోన్ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆండ్రాయిడ్లో ఉన్న బగ్ కారణంగానే డ్యాష్బోర్డులో తప్పుడు సమాచారం చూపిస్తోందని పేర్కొంది. సదరు యూజర్ గూగుల్ పిక్సల్ ఫోన్ వాడుతున్నారని, దీనిపై విచారణ జరపాలని గూగుల్ను కోరామని పేర్కొంది. మైక్రోఫోన్ సెట్టింగ్స్పై పూర్తి నియంత్రణ యూజర్ల చేతిలోనే ఉంటుందని స్పష్టంచేసింది. యూజర్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, వాయిస్, వీడియో రికార్డింగ్ చేసినప్పుడు మాత్రమే మైక్రోఫోన్ పనిచేస్తుందని తెలిపింది. ఈ సంభాషణలు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ రక్షణ ఉంటుందని, వేటినీ వాట్సాప్ వినదంటూ సుదీర్ఘ ట్వీట్ను రాసుకొచ్చింది.
ట్విటర్లో వాట్సాప్ తరహా ఫీచర్స్
వాట్సాప్పై ఈ ఆరోపణల వేళ మస్క్ మరో కీలక ప్రకటన చేశారు. ట్విటర్లో వాట్సాప్ తరహా సేవలను పరిచయం చేయనున్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. దీంతో వాట్సాప్ తరహాలో డైరెక్ట్ మెసేజులకు రిప్లయ్లు ఇవ్వొచ్చని, ఎమోజీలు పంపొచ్చని, వీడియో/ఆడియో కాల్స్ కూడా చేసుకోవచ్చని తెలిపారు. ‘‘కొత్త వెర్షన్ యాప్లో యూజర్లు డైరెక్ట్ మెసేజ్ ద్వారా ట్విటర్ థ్రెడ్లో దేనికైనా మెసేజులు పంపొచ్చు. ఎమోజీతో రిప్లయ్ ఇవ్వొచ్చు. త్వరలో ఎన్క్రిప్షన్ భద్రతతో డైరెక్ట్ మెసేజ్ వెర్షన్ 1.0ను తీసుకొస్తాం. దీంతో ట్విటర్ మెసేజ్లను చూడలేరు. అలానే ఇతరులకు మీ ఫోన్ నంబర్ ఇవ్వకుండా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్విటర్ ద్వారా వీడియో/ఆడియో కాల్స్ చేసుకోవచ్చు’’ అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం! -
మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రియల్మీ P సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు ఇవే!
రియల్మీ సంస్థ పి సిరీస్లో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్లో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్