Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
Hyundai, Kia Recall: హ్యుందాయ్, కియాకు చెందిన కొన్ని మోడల్ కార్లలో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీలు తెలిపాయి. దీని వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.
డెట్రాయిట్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్ (Hyundai), కియా (Kia) అమెరికాలో భారీ సంఖ్యలో కార్లను రీకాల్ (Recall) చేస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని మోడళ్లలో అగ్నిప్రమాదాలకు అవకాశం ఉండడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. లోపాన్ని సవరించే వరకు కార్లను బయటే పార్క్ చేసి ఉంచాలని వినియోగదారులను కోరాయి.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ ఎస్యూవీ, కియా సొరెంటో ఎస్యూవీ సహా 2010 నుంచి 2019 మధ్య తయారైన వివిధ మోడల్ కార్లలో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. దాదాపు 34 లక్షల కార్లను రీకాల్ (Recall) చేస్తున్నట్లు వెల్లడించాయి. కార్లలోని యాంటీ-లాక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్లో ఫ్లుయిడ్ లీకవుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ షాక్ సంభవించే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల వాహన నడుస్తున్న సమయంలో లేదా పార్క్ చేసి ఉంచిన సమయంలో మంటలంటుకునే ప్రమాదం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ఆయా వాహనాలను బయటే పార్క్ చేసి ఉంచాలని సూచించింది.
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్..
ఎలాంటి ఖర్చులు లేకుండానే డీలర్లు ఆయా కార్లలో యాంటీ-లాక్ బ్రేక్ ఫ్యూజ్ను రీప్లేస్ చేస్తారని కంపెనీలు వెల్లడించాయి. నవంబర్ 14 నుంచి వాహన యజమానులకు దీనిపై నోటిఫికేషన్ పంపుతామని కియా తెలిపింది. అలాగే నవంబర్ 21 నుంచి హ్యుందాయ్ ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ లోపం వల్ల హ్యుందాయ్లో ఇప్పటి వరకు 21 అగ్నిప్రమాద ఘటనలను గుర్తించినట్లు తెలిపింది. మరో 22 ఘటనల్లో పొగలు, భాగాలు కాలిపోవడం వంటివి నమోదైనట్లు పేర్కొంది. కియాలో 10 ఘటనల్లో మంటలంటుకున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అయితే, ఈ ప్రమాదాల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు
-
అమెరికాలో గాజా అలజడి.. కస్టడీలోకి కొలంబియా వర్సిటీ నిరసనకారులు
-
పలు స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!