కొత్త ఈవీ పాలసీ వైపు భారత్ అడుగులు?.. అలా చేస్తే విదేశీ కార్లకు ఈజీ ఎంట్రీ!
EV Policy: కొత్త విద్యుత్ వాహన పాలసీని తీసుకొచ్చేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏదైనా విదేశీ కంపెనీ దేశీయంగా తయారీ చేపడితే సుంకం తగ్గించాలని ఇందులోని ముఖ్య ప్రతిపాదన.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లా (Telsa) భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో చూస్తోంది. దిగుమతి సుంకం తగ్గించాలని ఆ కంపెనీ కోరుతుండగా.. దేశీయంగా తయారీ చేపట్టాక ఆలోచన చేస్తామంటూ భారత్ షరతులు విధించింది. దీంతో టెస్లా ఇప్పటి వరకు భారత్లో అడుగుపెట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఇరుపక్షాలకు మేలుచేకూరేలా భారత ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీకి (EV Policy) రూపకల్పన చేయనున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా తయారీ చేపడితే దిగుమతి సుంకాన్ని గణనీయంగా తగ్గించాలన్నది ఇందులోని కీలక ప్రతిపాదన అని సంబంధిత వర్గాలు తెలిపినట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.
ఇతర దేశాల్లో పూర్తిగా తయారై భారత్కు దిగుమతి చేసుకుంటున్న కార్లపై ప్రస్తుతం 70-100 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ కారణంతోనే టెస్లా సుంకం తగ్గించాలని కోరుతోంది. దేశీయంగా సదరు కంపెనీ కొంతమేర తయారీ చేపడితే దిగుమతి చేసుకునే వాహనాలపై సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని భారత ప్రభుత్వం ఆలోచనగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లా చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తమ ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని బి20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Hero Karizma XMR: హీరో కరిజ్మా మళ్లీ వస్తోంది.. ఆసక్తిరేపుతున్న టీజర్లు
ప్రస్తుతం దేశీయంగా అమ్ముడవుతున్న మొత్తం కార్లలో 2 శాతం మాత్రమే ఈవీలు ఉంటున్నప్పటికీ.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకవేళ ఈ పాలసీని కనుక తీసుకొస్తే.. దిగుమతి చేసుకునే కార్ల ధరలు అమాంతం తగ్గనున్నాయి. టెస్లాతో పాటు మరిన్ని కార్ల కంపెనీలకు ద్వారాలు తెరిచినట్లు అవుతుంది. అప్పుడు టెస్లా దేశీయంగా తయారు చేయబోయే కార్లతో పాటు ఇతర మోడళ్లూ దేశీయంగా విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే దేశీయ విద్యుత్ కార్లు తయారు చేస్తున్న టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? దేశీయ మార్కెట్పై ఏ మేరకు ప్రభావం ఉంటుంది? అనే అశాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐవీఎంఏ అధ్యక్షుడిగా డాక్టర్ కృష్ణ ఎల్ల
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల, ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. -
యూపీఐ వినియోగిస్తున్నా.. నగదు ఉపసంహరణలూ పెరిగాయ్
దేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు ఏటీఎం నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయి. -
వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. -
కనీసం 10,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటాం
జనరేటివ్ ఏఐ(కృత్రిమ మేధ)లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి తమ కంపెనీ సిద్ధమైందని హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈఓ విజయ్ కుమార్ తెలిపారు. -
మదుపర్ల సంపద రూ.406.52 లక్షల కోట్లు
బ్యాంకింగ్ షేర్ల జోరుతో సోమవారం దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అమెరికాలో బాండ్ రాబడులు తగ్గడం, అక్కడి టెక్ కంపెనీలు త్రైమాసిక ఫలితాల్లో రాణిస్తాయన్న అంచనాలు అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. -
మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే
18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ) సురేశ్ నారాయణ్ పేర్కొన్నారు. -
రుసుముల రూపేణా బీఎస్ఈపై రూ.165 కోట్ల భారం
ఆప్షన్ల కాంట్రాక్టులపై, ప్రీమియం విలువ మీద కాకుండా.. నోషనల్ వ్యాల్యూ మీద రుసుము చెల్లించాల్సిందిగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీని (బీఎస్ఈ) సెబీ ఆదేశించింది. -
అల్ట్రాటెక్ సిమెంట్ డివిడెండ్ 700%
ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం ఏకీకృత పద్ధతిలో 35.24% పెరిగి రూ.2,258.58 కోట్లకు చేరింది. -
హైసియా నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల
హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్ నందెళ్ల ఎన్నియ్యారు. -
ఓలా మొబిలిటీ సీఈఓ రాజీనామా
ఓలా మొబిలిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) హేమంత్ బక్షి రాజీనామా చేశారని తెలుస్తోంది. -
ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు అనుమతి
పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్జీ) రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థ ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్కు (పీడీసీఎస్ఎల్) సెబీ అనుమతి ఇచ్చింది. -
విపణిలోకి మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ
కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త ఎక్స్యూవీ 3ఎక్స్ఓను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. -
అంకురాల కోసం రూ.50 కోట్లు
అంకురాలకు పెట్టుబడులను అందించేందుకు ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (వైఈఏ) రూ.50 కోట్ల నిధులను అందుబాటులోకి తెచ్చింది. -
సంక్షిప్త వార్తలు
అగ్రశ్రేణి ఎరువుల కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడలో ఫాస్పారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్లు నిర్మించనుంది. ఈ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.