iQOO Z9: 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో ఐకూ జెడ్‌9

iQOO Z9: యల్‌ స్టెరో స్పీకర్స్‌తో ఐకూ కొత్త ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానున్న ఈ ఫోన్‌ ధర, ఫీచర్లను చూసేయండి.

Updated : 12 Mar 2024 16:37 IST

iQOO Z9 | ఇంటర్నెట్‌డెస్క్‌:  చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన జెడ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఐకూ జెడ్‌ 9 (iQOO Z9) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌-14 ఓఎస్‌తో వస్తున్న ఈ ఫోన్‌కు.. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ కూడా ఇస్తామని కంపెనీ  తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. ఐకూ కొత్తగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

ఐకూ కొత్త ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999గా ఐకూ పేర్కొంది. బ్రష్డ్‌ గ్రీన్‌, గ్రాఫెన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. మార్చి 14 మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది. లాంచ్‌ ఆఫర్‌ కింద ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌/ డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.2 వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందించనుంది.

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరోసారి గడువు పొడిగింపు

ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఆండ్రాయిడ్‌ 14తో ఈ ఫోన్‌ వస్తోంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌ రేటు కలిగిఉంటుంది. 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను కలిగిఉంటుంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఐకూ జెడ్‌9 5జీలో వెనకవైపు 50ఎంపీ సోనీ IMX355 ప్రధాన కెమెరా, 2 ఎంపీ రియర్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీ కోసం ముందువైపు 16ఎంపీ కెమెరా అమర్చారు. 5000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్‌ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. డ్యూయల్‌ స్టెరో స్పీకర్స్‌, 5జీ, వైఫై 6.5, IP54 రేటింగ్‌, బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని