ఆన్లైన్లో.. అప్రమత్తంగా..
ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంటి నుంచే కావాల్సిన వస్తువులు తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో ఎంతోమంది ఆన్లైన్లో కొనేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని, మోసగాళ్లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి భయపడి డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లు మానేయలేం. అందుకే, అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, సురక్షితంగా లావాదేవీలను పూర్తి చేసుకోవాలి.
వినియోగదారులు తమ చెల్లింపులను సురక్షితంగా నిర్వహించేందుకు బ్యాంకులు అన్ని చర్యలూ తీసుకుంటాయి. అయినప్పటికీ కొన్నిసార్లు మనం చేసే చిన్న పొరపాటు ఖరీదుగా మారుతుంది. అనుకోకుండా ఓటీపీ చెప్పేయడం, మోసపూరిత వెబ్సైట్లలో మన బ్యాంకింగ్ రహస్య సమాచారాన్ని నమోదు చేయడంలాంటివి ఇందులో కొన్ని. వీటివల్ల మన ఖాతా ఒక్కసారిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఎదురవ్వకుండా చూసుకోవాలంటే..
వేలిముద్రతో..
అన్ని పాస్వర్డ్లనూ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. మోసగాళ్లు వీటిని సులభంగా పసిగట్టగలరు. ఎప్పటికప్పుడు పాస్వర్డ్లను మార్చడం మంచి అలవాటు. దీనికి బదులుగా బయోమెట్రిక్ (వేలిముద్ర), ఇ-సిగ్నేచర్లాంటివి ఉపయోగించుకోవచ్చు. బ్యాంకులు తమ ఖాతాదారుల రక్షణ కోసం యాప్లకు పాస్వర్డ్తోపాటు, వేలిముద్ర ద్వారా లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల లావాదేవీలకు భద్రత పెరుగుతంది. మోసం జరిగే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయి.
ఒకటికి మించి..
వినియోగదారులను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త విధానాలు, సాంకేతికతను వాడుతున్నారు. కాబట్టి, ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు వారి వలలో పడే ప్రమాదం లేకపోలేదు. దీన్ని ఎదుర్కొనేందుకు బ్యాంకులు ఒకేసారి ఆథరైజ్ చేయడంతోనే సరిపెట్టకుండా.. రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఆ లావాదేవీని ఆథరైజ్ చేయాల్సిందిగా కోరుతున్నాయి. ఒకే పాస్వర్డ్ను సులభంగా కనిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, రెండుమూడు దశల్లో ఉన్నప్పుడు కష్టం. మనకూ అలోచించుకునేందుకు కొంత వ్యవధి దొరుకుతుంది. పాస్వర్డ్, వేలిముద్ర,ఓటీపీలాంటివి ఇందులో ఉంటాయి. మీకు అనుమానం ఉంటే బ్యాంకు సేవా కేంద్రాన్ని సంప్రదించి, వివరాలు తెలుసుకోండి.
ఇతరులను వాడనీయొద్దు..
మీరు వ్యక్తిగతంగా వినియోగించే ఫోన్లు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్ కంప్యూటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులు వినియోగించుకోకుండా చూసుకోవాలి. బ్యాంకింగ్ సంబంధించిన సమాచారం ఉంటే సులభంగా వారు తస్కరించే అవకాశం ఉంటుంది. మీ కంప్యూటర్లను ఎవరికీ రిమోట్ యాక్సెస్కు ఇవ్వకూడదు. మీ వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని అడిగినప్పుడు, ఎంత నమ్మకమైన వారికైనా ఇవ్వకూడదు. ఒకవేళ సందర్భాన్ని బట్టి, ఇచ్చినా వెంటనే పాస్వర్డ్లు మార్చుకోవాలి. నమ్మకమైన వెబ్సైట్ల నుంచే మీకు అవసరమైన అంశాలను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఆ అంకెలు చెప్పొద్దు..
ఆన్లైన్లో నగదు బదిలీ, కొనుగోళ్లు పూర్తి చేయాలంటే.. ఓటీపీ (వన్ టైం పాస్వర్డ్) ఎంతో కీలకం. మోసగాళ్లు మీ వివరాలను తెలుసుకొని, ఆన్లైన్ కొనుగోళ్లు పూర్తి చేసే క్రమంలో ఓటీపీ వచ్చేలా చూస్తారు. దాన్ని మనతో తెలివిగా చెప్పించుకుంటారు. లేదా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లు ప్రారంభించి, వారికి కావాల్సిన సమాచారాన్ని రాబడతారు. మీరు ఏమరుపాటుగా ఉండి, వారు అడిగిన వివరాలు చెప్పారా? ఖాతా ఖాళీ అయినట్లే. గుర్తుంచుకోండి.. బ్యాంకు నుంచి మీకు ఎప్పుడూ ఫోన్ రాదు. వచ్చినా మీ వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారం గురించి అడగదు. కేవైసీ అప్డేట్ చేయాలని కోరినా బ్యాంకు శాఖను సంప్రదించి, ఆ పత్రాలు ఇస్తామని ఇస్తామని చెప్పాలి.
* ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఉచిత వై-ఫై అందుబాటులో ఉంటోంది. బ్యాంకింగ్, ఆన్లైన్ కొనుగోలు లావాదేవీలకు ఈ వై-ఫైని ఉపయోగించకపోవడమే మంచిది. ఈ ఓపెన్ నెట్వర్క్లు సైబర్ దాడులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* మీకు సంబంధం లేకుండా పాస్వర్డ్లు మార్చినట్లు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ వచ్చినప్పుడు వెంటనే స్పందించండి. బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. బ్యాంకు ఖాతాలోకి లాగిన్ అయి, మరో పటిష్ఠమైన పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోండి. ఆన్లైన్ లావాదేవీలు మన నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే, జరుగుతున్న మోసాల గురించి అవగాహన పెంచుకోవడం, అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుంటూ సైబర్ మోసాల నుంచి మనల్ని కాపాడుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్