స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో గుజరాత్ను దాటేసిన యూపీ.. అగ్రస్థానం ఈ రాష్ట్రానిదే!
stock market investors: దేశీయ స్టాక్ మార్కెట్లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఎక్కువ మంది మదుపర్లతో గుజరాత్ స్థానాన్ని ఉత్తర్ప్రదేశ్ అధిగమించింది.
stock market investors | ఇంటర్నెట్డెస్క్: దేశీయ స్టాక్మార్కెట్లో నమోదిత పెట్టుబడిదారుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో తొలిసారి 8 కోట్ల మైలురాయిని అందుకుంది. గతేడాది డిసెంబరు 31తో పోలిస్తే ఇన్వెస్టర్ల సంఖ్య 22.4 శాతం పెరిగింది. అత్యధిక స్టాక్ మార్కెట్ మదుపరులు కలిగిన రాష్ట్రంగా మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, గుజరాత్ను ఉత్తర్ప్రదేశ్ అధిగమించింది. 89.47 లక్షల మదుపర్లతో రెండో స్థానంలో నిలిచింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2022 డిసెంబరు 31 నాటికి దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే సంఖ్య 6.94 కోట్లుగా ఉండేది. ఈ ఏడాది డిసెంబరు 25 నాటికి ఆ సంఖ్య 8.49 కోట్లకు చేరింది. కేవలం ఎనిమిది నెలల్లోనే దాదాపు కోటిమందికి పైగా పెరిగారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. 1.48 కోట్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది. 89.47 లక్షలతో యూపీ రెండో స్థానంలో నిలవగా.. 76.68 లక్షల మదుపరులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.
2023లో పోస్టాఫీసు పథకాల్లో వచ్చిన మార్పులివే..
పెట్టుబడిదారుల విషయంలో యూపీ 33.8 శాతం వృద్ధి నమోదు చేయగా.. గుజరాత్ 17.2శాతం వృద్ధిని కనబరిచింది. 47 లక్షల కంటే ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్తుండటంతో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ ఏడాదిలో మన స్టాక్ మార్కెట్ సూచీలు కనబరిచిన వృద్ధే అందుకు ఉదాహరణ. నిఫ్టీ దాదాపు 20శాతం పెరగ్గా.. బీఎస్ఈ సెన్సెక్స్ 18శాతానికి పైగా లాభపడింది. తాజాగా దేశీయ స్టాక్ మార్కెట్ విలువ తొలిసారి నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ను అందుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
GST Collections: ఏప్రిల్లో వసూలైన రూ.2.10 లక్షల కోట్లలో సీజీఎస్టీ రూ.43,846 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.53,538 కోట్లు, ఐజీఎస్టీ రూ.99,623 కోట్లుగా నమోదైంది. -
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
Credit cards: సులభంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండటంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డుల్ని ఉపయోగిస్తున్నారు. వాటిని ఎలా సమర్థంగా వినియోగించాలో తెలుసుకోండిలా.. -
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
BSNL: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు తమ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకునేవారి నుంచి ఎలాంటి ఇన్స్టలేషన్ ఛార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. -
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
LPG Price: 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి. -
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్