Debt ceiling Crisis: అమెరికాను భయపెడుతున్న ‘సీలింగ్’!
Debt ceiling Crisis: అమెరికా ఖజానా మరికొన్ని రోజుల్లో నిండుకోనుంది. అప్పటి వరకు డెట్ సీలింగ్ పరిమితిని పెంచాల్సి ఉంటుంది. లేదంటే అమెరికా దివాలా తీయాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Debt ceiling Crisis | ఇంటర్నెట్ డెస్క్: ‘‘రుణ గరిష్ఠపరిమితి (Debt ceiling)ని పెంచడానికి చట్టసభ ఆమోదం లభించకపోతే అమెరికా ఆర్థిక విపత్తును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇది అగ్రరాజ్యం దివాలా తీయడానికి దారితీయొచ్చు. దీని ప్రభావం కేవలం అమెరికాపైనే కాకుండా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగా ఉంటుంది. ఫలితంగా అమెరికా నాయకత్వ హోదా ప్రమాదంలో పడుతుంది. దేశంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయి’’ అని ఆ దేశ ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ ఇటీవల హెచ్చరించారు.
యెల్లెన్ హెచ్చరించినట్లుగా అమెరికా ఖజానా కొన్ని వారాల్లో ఖాళీ కానుంది. దీన్ని తప్పించుకోవాలంటే మరిన్ని అప్పులు చేయడానికి వీలుగా రుణ గరిష్ఠ పరిమితి (Debt ceiling)ని పెంచేందుకు చట్టసభ అనుమతించాల్సి ఉంటుంది. లేదంటే అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిపై రాజకీయంగా వీలైనంత త్వరగా ఓ సయోధ్య కుదరాలి. లేదంటే సకాలంలో చెల్లింపులు చేయడం సాధ్యంకాదు. ఫలితంగా అమెరికా దివాలా తీయక తప్పదని నిపుణులు అంటున్నారు. అమెరికాతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పెనవేసుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ప్రపంచమంతా ఉంటుంది.
ఏంటీ డెట్ సీలింగ్..
దీన్నే డెట్ లిమిట్ అని కూడా వ్యవహరిస్తారు. చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం తీసుకునే రుణాలపై విధించిన గరిష్ఠ పరిమితినే డెట్ సీలింగ్గా వ్యవహరిస్తారు. అంటే ప్రభుత్వం ఈ పరిమితికి మించి అప్పులు చేయడానికి కుదరదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, సామాజిక భద్రత, మెడికేర్, కేంద్ర రుణాలపై వడ్డీలు, పన్ను రిఫండ్లు.. ఇలా అన్ని ఖర్చులు చెల్లింపుల కిందకు వస్తాయి. మరిన్ని అప్పులు చేసి నిధులను సమకూర్చుకునేందుకు అమెరికా చట్టసభ కాంగ్రెస్ తరచూ ఆమోదం తెలుపుతూ ఉంటుంది.
ప్రస్తుతం డెట్ సీలింగ్ 31.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అంటే ప్రభుత్వ అప్పుల మొత్తం ఇంత మొత్తాన్ని మించడానికి వీలులేదు. ప్రభుత్వం జనవరిలోనే ఈ పరిమితిని దాటేసింది. కానీ, దేశ ఆర్థిక శాఖ ప్రత్యేక చర్యల ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి నిధులు సమకూరుస్తూ వచ్చింది. ఇప్పుడు డెట్ సీలింగ్ను పెంచడం అనివార్యమైంది. ప్రతిసారి ఇది చాలా సులువుగా జరిగిపోయేది. కానీ, ఈసారి కాంగ్రెస్ ఆమోదం రాజకీయంగా కొంత సంక్లిష్టంగా మారింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉంది. ఈ నేపథ్యంలో పరిమితిని పెంచాలన్న అధికార డెమోక్రాట్ల ప్రతిపాదనను రిపబ్లికన్లు అంగీకరించడం లేదు. ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతినిధుల సభలో ఆమోదం పొందని పక్షంలో బిల్లు నిలిచిపోతుంది.
పరిమితి పెంచకపోతే..
గతంలో ఎప్పుడూ పరిమితి పెంచకపోవడం అనే పరిస్థితి తలెత్తలేదు. ఫలితంగా పరిణామాలు ఎలా ఉంటాయనేది కచ్చితంగా చెప్పడం కష్టం. కానీ, ఆర్థికంగా పెద్ద సంక్షోభం తలెత్తడం మాత్రం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మిలిటరీ సిబ్బంది వేతనాలు, పింఛన్ల చెల్లింపులు నిలిచిపోతాయని హెచ్చరిస్తున్నారు. జాతీయ పార్కులు సహా ఇతర ఏజెన్సీలు మూతపడే ప్రమాదం ఉంది. చివరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వాతావరణ విభాగం సైతం అప్డేట్లు ఇవ్వడం ఆగిపోవచ్చని పేర్కొంటున్నారు.
సకాలంలో రుణ చెల్లింపులు చేయకపోతే..
జూన్ 1 నాటికి డెట్ సీలింగ్ పెంచకపోతే.. అమెరికా ప్రభుత్వం రుణాలు, వాటిపై వడ్డీని సకాలంలో చెల్లించడం కుదరదు. ఇది దివాలాకు దారితీస్తుంది. ఫలితంగా ఏజెన్సీలు అమెరికా క్రెడిట్ రేటింగ్ను తగ్గిస్తాయి. కొత్త రుణాలపై అధిక వడ్డీరేటు చెల్లించాల్సి వస్తుంది. సామాన్యులకు అందే లోన్లపై వడ్డీరేటు.. ప్రభుత్వం తీసుకునే రుణరేటుపైనే ఆధారపడి ఉంటుంది. ఫలితంగా రిటైల్ రుణాల రేట్లు కూడా పెరిగి సామాన్యులకు భారంగా మారతాయి. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే స్టాక్ మార్కెట్లలో పతనం ప్రారంభమవుతుంది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ నాలుగు శాతం క్షీణించే ప్రమాదం ఉందని అంచనా. దీని వల్ల 70 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఉన్న వనరులతో వడ్డీ చెల్లించి ప్రభుత్వం దివాలాను తప్పించుకునే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటి?
ఒకవేళ సీలింగ్ను పెంచడంపై రాజకీయంగా సయోధ్య కుదరకపోతే.. ఆర్థికశాఖ తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. తద్వారా దివాలా ముప్పును కొంతకాలం వాయిదా వేయగలుగుతుంది. అయితే, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను ఆపాల్సి ఉంటుంది. పెట్టుబడులను వాయిదా వేయాల్సి వస్తుంది. కొన్ని రకాల పొదుపు, మదుపు పథకాల చెల్లింపులను నిలిపివేయాల్సి ఉంటుంది. 2011, 2013లోనూ ఇదే తరహాలో సీలింగ్ పెంచడానికి అనుమతి లభించలేదు. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యల ద్వారా దివాలాను తప్పించుకోగలిగింది. అంతలోనే కాంగ్రెస్ ఆమోదం లభించడంతో సమస్య సద్దుమణిగింది.
ప్రత్యేక అధికారాల ద్వారా నెట్టుకొస్తున్నప్పటికీ.. డెట్ సీలింగ్ను పెంచడానికి కాంగ్రెస్ ఆమోదం లభించకపోతే ఆర్థికంగా గడ్డు పరిస్థితులు తప్పవు. కేంద్ర ప్రభుత్వ వ్యయం పూర్తిగా నిలిచిపోతుంది. లేదంటే పన్నులను భారీగా పెంచి ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయంగానూ తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM