Explained: ఎక్స్షోరూం Vs ఆన్రోడ్.. రెండు ధరలకు మధ్య తేడా ఏంటి?
బైక్ గురించో, కారు గురించో ప్రకటన చూసి ధర తక్కువని మురిసిపోతాం. తీరా డీలరు దగ్గరికెళ్లాక రేటు విని నోరెళ్లబెడతాం. అప్పుడుగానీ తెలియదు మనకు ఎక్స్ షోరూంకి.....
బైక్ గురించో, కారు గురించో ప్రకటన చూసి ధర తక్కువని మురిసిపోతాం. తీరా డీలరు దగ్గరికెళ్లాక రేటు విని నోరెళ్లబెడతాం. అప్పుడుగానీ తెలియదు మనకు ఎక్స్ షోరూంకి.. ఆన్రోడ్కి ఉన్న తేడా. అది నమ్మాలా? వద్దా? అని చాలామందికి సంశయం. మోసపోతున్నామేమోనన్న సందేహం. ఇంతకీ ఏది వాస్తవం? ఎందుకీ తేడాలు? ఈ అంకెల వెనుక ఉన్న మర్మమేంటి? కొనేటప్పుడు బేరమాడడానికి ఉన్న అవకాశాలేంటి? కొనడానికి వెళ్లేముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలివీ..
ఎక్స్ షోరూం ధర, ఆన్రోడ్ ప్రైస్.. ఆటోమొబైల్ రంగంపై అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పదాలివి. కానీ కొత్తవాళ్లకైతే బొత్తిగా తెలియదు. రెండు ధరల మధ్య ఆ తేడా ఎందుకో అర్థం కాదు. తేలిగ్గా చెప్పాలంటే.. వాహన తయారీకి అయ్యే ఖర్చునే ఎక్స్ షోరూం ధర అనొచ్చు. ఆపై ప్రభుత్వానికి కట్టే పన్నులు, డీలరు తీసుకునే లాభం, ఇతరాలన్నీ కలిపి వాహనం రోడ్డుపైకి వచ్చేసరికి అయ్యే మొత్తం రేటుని ఆన్రోడ్డు ధర అంటారు. ఈ రెండింటి మధ్య తేడా కనీసం పదిశాతమైనా ఉంటుంది. డీలరుతో జాగ్రత్తగా బేరమాడితే కొన్ని ఛార్జీలపై డబ్బు ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీ
బైకు, కారు.. ఏ వాహనం కొన్నా అది పూర్తిగా మన సొంతమయ్యేది రిజిస్ట్రేషన్ తర్వాతే. స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం (ఆర్టీఓ)లో బండిని రిజిస్ట్రేషన్ చేయిస్తే అక్కడ వాహనానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. ఈ ఛార్జీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. దీనికోసం డీలరు నంబర్ ప్లేట్, స్మార్ట్కార్డుల ఛార్జీలూ తీసుకుంటాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీ పూర్తిగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను. కానీ సర్వీసు ఛార్జీలు, ఏజెంట్ ఫీజు అని డీలరు మన దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది. బేరమాడితే వీటిలో కొద్దిమొత్తం తగ్గించుకోవచ్చు. లేదా పూర్తిగా మాఫీ చేయించుకోవచ్చు.
నిర్వహణ ప్యాకేజీ
భవిష్యత్లో ఎదురయ్యే కొన్నిరకాల సమస్యలకు ఉచితంగా సర్వీసు చేస్తామంటూ డీలర్లు ప్రీపెయిడ్ సర్వీస్ ప్యాకేజీలు అందిస్తుంటారు. ఇందులో రోడ్సైడ్ అసిస్టెన్స్, పాలిషింగ్, టైర్ల రీప్లేస్మెంట్ వంటివి ఉంటాయి. అందుకోసం కొంతమొత్తం వసూలు చేస్తారు. అయితే, అత్యధికం మనకు అవసరం లేనివే. పైగా అన్ని అధీకృత సర్వీసింగ్ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండవు. అదీ గమనించాలి. ●
జీవితకాల రోడ్డు పన్ను
మన వాహనాన్ని రోడ్డు మీద నడపడానికి ప్రభుత్వానికి కట్టాల్సిన జీవితకాల పన్ను రోడ్ టాక్స్. ఇది 10-15 ఏళ్లకు వర్తిస్తుంది. ఎక్స్షోరూం ధరకి 3శాతం ఉంటుంది. మోడల్, ఇంధన రకాన్ని బట్టి ఇరవైశాతం వరకూ పన్ను వేస్తారు. కొన్నిసార్లు ప్రభుత్వం విధించే ట్యాక్స్ కన్నా డీలరు అధికంగా చూపిస్తారు. ఈ పన్ను కట్టేముందు మన రాష్ట్రంలో రోడ్ ట్యాక్స్ ఎంత ఉందో స్పష్టంగా తెలుసుకోవాలి. తప్పకుండా రసీదులు తీసుకోవాలి.●
బీమా
ప్రమాదాల్లో, వాహనం చోరీకి గురైనప్పుడు, ప్రకృతి విపత్తులవేళ ఆదుకునేది బీమానే. వాహనానికిది తప్పనిసరి. ఇందులో థర్డ్ పార్టీ, కాంప్రహెన్సివ్, జీరో డిప్రిషియేషన్.. అంటూ రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. స్వల్పకాలిక, దీర్ఘకాలిక బీమా పథకాలుంటాయి. అయితే, వాహనానికి థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి. మిగతావి మనకు నచ్చినవి ఎంచుకోవచ్చు. బండి కొంటున్నప్పుడు డీలర్లు దీర్ఘకాలిక బీమా ఇస్తామని చెప్పినా.. అందులో థర్డ్ పార్టీ ఒక్కటే ఐదేళ్ల కాలానికి ఇచ్చి, మిగతాది స్వల్పకాలానికి పరిమితం చేస్తారు. ఇది జాగ్రత్తగా గమనించాలి. డీలరు దగ్గర కాకుండా బయట తీసుకుంటే ప్రీమియం తగ్గే అవకాశం ఉంది. ఎక్కువ డిస్కౌంట్లు పొందవచ్చు.
అదనపు యాక్సెసరీలు
వాహనం కొనేటప్పుడు ఫ్లోర్మ్యాట్లు, మడ్ మ్యాట్లు, సీటు కవర్లు, కారు దిండ్లు, దేవతల ప్రతిమలు, ఇతర విడిభాగాలు తీసుకోవడానికి అదనంగా ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కోసారి కొనుగోలుదారుకిచ్చే ధర జాబితాలో మనకు తెలియకుండానే యాక్సెసరీల పేరిట కొంత రుసుము వసూలు చేస్తారు. వాస్తవానికి డీలర్లు చెప్పిన అన్ని విడిభాగాలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదీ కాకుండా షోరూంలో తీసుకునే వస్తువులతో పోలిస్తే బయట మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతాయి.●
హ్యాండ్లింగ్/లాజిస్టిక్ ఛార్జీలు
వాహనం తయారైన దగ్గర్నుంచి గోదాములకు, అక్కడి నుంచి షోరూంకి చేర్చడానికి, నిల్వకు తీసుకునే ఛార్జీలు ఇవి. దీనికి కొంత ఛార్జీ వసూలు చేస్తుంటారు. ఎక్స్షోరూం ధరలో డీలర్ల లాభాలు కలిసి ఉండడంతో హ్యాండ్లింగ్ ఛార్జీలు చట్టవిరుద్ధమని, మాఫీ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ రుసుములు వేశారేమో ఓసారి చెక్ చేసుకోండి.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి