అదానీ ఇంతటితో ఆగుతారా..
5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్లు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ స్పష్టం చేయడం టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నూతన విధానానికి అనుగుణంగా, సొంత అవసరాల నిమిత్తమే స్పెక్ట్రమ్ కొనుగోలు చేస్తామని, టెలికాం వినియోగదారు
సొంత అవసరాలకే స్పెక్ట్రమ్ వినియోగిస్తామన్న అదానీ గ్రూప్
టెలికాం సేవల్లోకీ ప్రవేశిస్తారనే ఊహాగానాలు
5% పడిన ఎయిర్టెల్ షేరు
5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్లు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ స్పష్టం చేయడం టెలికాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రప్రభుత్వం నిర్ణయించిన నూతన విధానానికి అనుగుణంగా, సొంత అవసరాల నిమిత్తమే స్పెక్ట్రమ్ కొనుగోలు చేస్తామని, టెలికాం వినియోగదారు సేవల్లోకి ప్రవేశించడం లేదుని అదానీ గ్రూప్ ప్రకటించింది. ఇప్పటికే నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, గనులు, డేటా సెంటర్ వంటి మౌలిక వసతుల విభాగాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ విస్తరించారు. స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో ప్రపంచంలోనే అగ్రస్థానం లక్ష్యంగా పావులు కదుపుతున్న అదానీ గ్రూప్.. సిమెంటు తయారీలో ఒక్కసారిగా దేశంలోనే రెండోస్థానానికి చేరేలా అగ్రగామి సంస్థలను స్వాధీనం చేసుకోవడాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. భవిష్యత్తు వ్యాపార అవకాశాలు అపారంగా ఉన్న టెలికాం సేవల్లోకీ అదానీ ప్రవేశిస్తారనే అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంస్థను నెలకొల్పుతారా లేక ప్రస్తుతం అందుబాటులో ఉన్న కంపెనీల్లో దేనినైనా స్వాధీనం చేసుకుంటారా అనే విశ్లేషణలూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లన్నీ సోమవారం లాభాల్లో ముగిశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 15.04%, అదానీ టోటల్ గ్యాస్ 6.80%, అదానీ ట్రాన్స్మిషన్ 5.94%, అదానీ పవర్ 4.99%, అదానీ ఎంటర్ప్రైజెస్ 3.42%, అదానీ పోర్ట్స్ 1.82% చొప్పున లాభాలు నమోదుచేశాయి.
టెలికాం షేర్లు ఇలా
అగ్రగామి టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ షేరు సోమవారం అమ్మకాల ఒత్తిడికి గురికాగా, వొడాఫోన్ ఐడియా షేరు రాణించింది. ఎయిర్టెల్ షేరు ఇంట్రాడేలో రూ.659.05 వద్ద కనిష్ఠాన్ని తాకి, చివరకు 5.03 శాతం నష్టంతో రూ.660.30 వద్ద ముగిసింది. సోమవారం నిఫ్టీ-50 షేర్లలో ఎక్కువ నష్టపోయిన షేరుగా మిగిలింది. వొడాఫోన్ ఐడియా షేరు 3.44 శాతం పెరిగి రూ.8.72 దగ్గర స్థిరపడింది. జియో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.33 శాతం పెరిగి రూ.2423.20 వద్ద ముగిసింది. ఎంటీఎన్ఎల్ షేరు 19.85 శాతం లాభపడి రూ.23.25కు చేరింది.
రూ.2.5 లక్షల కోట్లు అవసరం: ప్రైవేట్ నెట్వర్క్ సేవల కోసం మాత్రమే 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నామని, తమ విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుదుత్పత్తి, డేటా కేంద్రాల అవసరాల కోసమే స్పెక్ట్రమ్ను వినియోగించుకుంటామని అదానీ గ్రూప్ చెబుతోంది. ‘గత రెండు దశాబ్దాల్లో టెలికాం రంగంలో తీవ్ర పోటీ నడిచింది. ఈ రంగంలోకి కొత్త సంస్థ ప్రవేశిస్తే, ప్రస్తుత కంపెనీల మార్కెట్ వాటాలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని మదుపర్లు భావిస్తున్నారు’ అని దేశీయ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియాతో ఇంటర్కంపెనీ రోమింగ్ (ఐసీఆర్) ఒప్పందం కుదుర్చుకుంటే.. పూర్తి స్థాయిలో టెలికాం రంగంలోకీ అదానీలు అడుగుపెట్టే అవకాశం ఉంటుందని తెలిపింది. వొడాఫోన్ ఐడియాను స్వాధీనం చేసుకోవాలంటే రూ.2.5 లక్షల కోట్ల మూలధన పెట్టుబడులు అవసరమన్నది ఆ సంస్థ అంచనా.
గోల్డ్మన్ శాక్స్దీ అదే మాట: స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొననున్న అదానీ గ్రూప్, భవిష్యత్తులో వినియోగదారు సేవల్లోకి అడుగుపెట్టవచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన గోల్డ్మన్ శాక్స్ అంచనా వేస్తోంది. అదానీ పోటీని తట్టుకునేందుకు ఎయిర్టెల్, జియోలకు బలమైన బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయని, వొడాఫోన్ ఐడియాకు మాత్రం ఇబ్బందికరమేనని చెబుతోంది. ‘వేలంలో పాల్గొనకుండానే క్యాప్టివ్ నెట్వర్క్లకు స్పెక్ట్రమ్ పొందే సౌలభ్యం ఉంది. అదానీగ్రూప్ తమ సంస్థల అవసరాలకు కావాల్సిన స్పెక్ట్రమ్ కోసం, వేలంలో పాల్గొనడం, ఆర్థికంగా ఆ సంస్థకు లాభం చేకూర్చదని భావిస్తున్నాం. అందువల్ల వినియోగదారు నెట్వర్క్ల్లోకి వచ్చేందుకే అదానీ గ్రూప్ ముందడుగు వేస్తుందని విశ్వసిస్తున్నాం’ అని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది.
* ‘వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చడం వల్ల వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 33 శాతం వాటా లభిస్తుంది. ఈ వాటాను సరైన సమయంలో విక్రయించడం ద్వారా, బకాయిలు వసూలు చేసుకుంటామ’ని ప్రభుత్వం ప్రకటించడాన్నీ గోల్డ్మన్ శాక్స్ ప్రస్తావిస్తోంది.
* అదానీ ప్రవేశిస్తే, టెలికాం సేవల్లో మళ్లీ పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా అభిప్రాయపడింది. నేరుగా స్పెక్ట్రమ్ పొందకుండా అదానీలు వేలంలో ఎందుకు పాల్గొంటున్నారో తెలియడం లేదని సీఎల్ఎస్ఏ తెలిపింది.
ఎయిర్టెల్ షేరు సానుకూలమే: ఇవి ఎలా ఉన్నా, రూ.835 లక్షిత ధరతో భారతీ ఎయిర్టెల్ షేరు కొనుగోలు చేయొచ్చని దేశీయ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ పేర్కొంటోంది. టారిఫ్లు పెంచిన నేపథ్యంలో, జూన్ త్రైమాసిక ఫలితాలు ఆకర్షణీయంగా నమోదుకావొచ్చని అంచనా వేసింది. అదానీ టెలికాం సేవల రంగంలోకి అడుగుపెట్టడానికి చాలా సమయం పడుతుందని, ఇప్పటికే జియో పోటీని తట్టుకున్న ఎయిర్టెల్కు ఈ పరిణామం పెద్ద ఇబ్బంది కలిగించకపోవచ్చని విశ్లేషిస్తోంది.
స్పష్టత అప్పుడే: అదానీ గ్రూప్ దేశంలో ఎన్ని సర్కిళ్లలో, ఏఏ బ్యాండ్ల స్పెక్ట్రమ్ కోసం బిడ్లు దాఖలు చేయనుందనే అంశంపై స్పష్టత వచ్చే వరకు టెలికాం షేర్ల విషయంలో అప్రమత్తత పాటించమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
రిలయన్స్ కూడా అప్పట్లో ఇంతే
2016లో టెలికాం వాణిజ్య సేవలను ప్రారంభించేందుకు, చాలా ముందుగా 2010లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2300 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసిందని పరిశోధనా సంస్థ జెఫ్రీస్ ప్రస్తావిస్తోంది. అప్పట్లో ఈ స్పెక్ట్రమ్ వాయిస్ సేవలకు పనికిరాదు. ఈ నిబంధనను 2013లో ప్రభుత్వం సవరించి, వాయిస్ సేవలకు ఈ స్పెక్ట్రమ్ను అనుమతించడం జియో ఆవిర్భావానికి కారణమైందని గుర్తు చేస్తోంది. తదుపరి యూనిఫైడ్ సేవల లైసెన్సు పొంది, టెలికాం సేవల్లోకి ప్రవేశించడం ద్వారా, అగ్రస్థానానికి జియో చేరిందని వివరించింది. అందువల్ల భవిష్యత్తులో అదానీ గ్రూప్ కూడా టెలికాం సేవల్లోకి ప్రవేశించవచ్చనే అంచనాను వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!