ట్రేడింగ్ చేస్తున్నారా ఇవన్నీ తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న యువత సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని గణాంకాలు విశ్లేషిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేస్తున్నప్పుడు ఎలాంటి నష్టభయాలూ ఉండవు. కానీ, స్వల్పకాలంలోనే రెట్టింపు లాభాలు రావాలనే ఆశతో.. ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరగడం
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న యువత సంఖ్య ఇటీవల బాగా పెరిగిందని గణాంకాలు విశ్లేషిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేస్తున్నప్పుడు ఎలాంటి నష్టభయాలూ ఉండవు. కానీ, స్వల్పకాలంలోనే రెట్టింపు లాభాలు రావాలనే ఆశతో.. ట్రేడింగ్ చేస్తున్న వారి సంఖ్య పెరగడం, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం ఆందోళన కలిగించే అంశమే. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎప్పుడూ సత్ఫలితాలు ఇవ్వదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం మదుపు చేసిన వారే లాభాలను చేజిక్కించుకుంటారు. ఇక ట్రేడింగ్ చేసే వారు పాటించాల్సిన కొన్ని సూత్రాలు ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇటీవల కాలంలో మీరు ట్రేడింగ్ చేశారా? అయితే, ఒకసారి ఆ లావాదేవీలను నాలుగైదు సార్లు పరిశీలించండి. ఎందుకంటే.. ప్రపంచంలో మీకు ట్రేడింగ్ గురించి నేర్పే గొప్ప పుస్తకం మీరు చేసిన ట్రేడింగ్ ఖాతా వివరాలే. వంద ట్రేడింగ్ లావాదేవీలు పూర్తి చేసిన ట్రేడర్.. సాధ్యమైనన్ని పొరపాట్లు చేసే ఉంటారని నిపుణుల అంచనా. కాబట్టి, ఒకసారి మీ ట్రేడింగ్ సరళిని గమనిస్తే.. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ను మించిన ‘ఇన్వెస్ట్మెంట్ గురు’ లేరు. చాలామంది ట్రేడింగ్ చేసి, నష్టపోయాం అని భావిస్తుంటారు. కానీ, ఆ నష్టం నేర్పిన పాఠాలేమిటి? వాటిని లాభాలుగా మలచుకునేందుకు ఉన్న అవకాశాలేమిటి అనేది గుర్తించరు.
ఆటలాంటిదే..
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే చాలామంది కొన్ని భావోద్వేగాలతో ఉంటారు. తాము ఎంచుకున్న షేరు ట్రేడ్ మంచి లాభాలను ఇస్తే.. తమ నిర్ణయాన్ని అభినందించుకుంటారు. పొరపాటున నష్టం వస్తే దురదృష్టం వల్ల ఇలా జరిగిందని అనుకుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ట్రేడింగ్ ఒక ఆట. ఇక్కడ గెలుపు ఓటములు సహజం. మీరు చేయబోతున్న వేల కొద్దీ ట్రేడింగ్ లావాదేవీల్లో ఇదీ ఒకటి. మీ వ్యూహం సరైనది అయితే.. దీర్ఘకాలంలో లాభాలు సంపాదించేందుకు వీలవుతుంది.
ఏం చేస్తున్నారో తెలుసుకోండి:
మార్కెట్ గురువుగా పాఠాలు నేర్పిస్తుంది. కాస్త కటువుగానూ ఉంటుంది. చిన్న పొరపాటు చేసినా.. మీ మొత్తం పెట్టుబడిని ఒక్కసారిగా హరించి వేస్తుంది. మార్కెట్లో ఎప్పుడూ మీరు ఎంత మేరకు సురక్షితంగా ఉంటారో అంత వరకే పెట్టుబడులు పెట్టాలి. నిర్ణయాలు వేగంగా తీసుకోలేని వ్యక్తికి ట్రేడింగ్ ఏ మాత్రం సరిపోదు. ముఖ్యంగా మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పుడు ఇలాంటి ధోరణితో నష్టాలే మూటగట్టుకుంటారు. ఇలాంటి వారు సాధ్యమైనంత వరకూ ట్రేడింగ్కు దూరంగా ఉండటమే మేలు. ఏం చేయాలి.. ఎప్పుడు చేయాలి.. ఈ రెండే ట్రేడింగ్లో సగం విజయానికి కారణం అవుతాయి.
నష్టం ఎంత మేరకు?
పెట్టుబడిని రక్షించుకుంటూ.. లాభాలను సంపాదించాలి. ట్రేడింగ్లో పాటించాల్సిన ప్రధాన వ్యూహం ఇదే. చిన్న మొత్తంతో ట్రేడింగ్ చేస్తూ.. పెట్టుబడిలో 1 శాతానికి మించి నష్టపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంపాటు ట్రేడింగ్ చేస్తూ లాభాలను ఒడిసిపట్టుకోగలరు. నష్టాలను మించి లాభాలు వస్తున్నంత కాలం, మీ వ్యూహాలు సరైన ఫలితాలు ఇస్తున్నట్లే. చిన్న మొత్తాలతో లావాదేవీలు చేయడం వల్ల ఒకేసారి నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.
అర్థం చేసుకోకుండా..:
ట్రేడింగ్లో విజయం సాధించిన వారి గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ, వారి వ్యూహాలను గుడ్డిగా అనుసరించాలని అనుకుంటేనే పొరపాటు. చాలామంది సామాజిక వేదికల్లో తమ విజయాల గురించి పేర్కొంటూ కనిపిస్తారు. ఆ వ్యూహాలు వారు ఎంతో కష్టపడి నేర్చుకొని ఉంటారు. వాటిని అర్థం చేసుకోకుండా అనుకరించరాదు.
ఆ మాటలు వినొద్దు:
ఒక ట్రేడర్.. తన డబ్బుతోపాటు, విలువైన కాలాన్నీ ఖర్చు చేసి ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తుంటారు. స్నేహితులు చెప్పారనో.. సామాజిక వేదికల్లో వచ్చిన సందేశాల ఆధారంగా ఒక షేరును ఎంచుకోవడం ఎప్పుడూ సరికాదు. మార్కెట్ బాగున్నప్పుడే ఇలాంటివి ఒకటి రెండు ‘టిప్స్’ లాభాలను అందించవచ్చు. అనిశ్చితి కొనసాగుతున్నప్పుడు ఇలాంటివి ప్రతికూలంగా
మారతాయి.
వ్యాపారమే:
ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పెట్టుబడి, ఆదాయం ఎలా వస్తుంది, ఖర్చులేముంటాయి, నష్టాలు వచ్చే ఆస్కారం.. తదితర అంశాలను పరిశీలించాలి. షేర్లలో ట్రేడింగ్ లేదా పెట్టుబడులు పెట్టేటప్పుడూ ఇదే సూత్రం వర్తిస్తుంది. మార్కెట్లో రూపాయి మదుపు చేసే ముందు దాన్ని కాపాడుకునేందుకు మీ దగ్గర అవసరమైన శక్తియుక్తులున్నాయా చూసుకోవాలి. ట్రేడింగ్ ఖాతా ప్రారంభించామా.. డబ్బు పెట్టామా.. ఏదో ఒక షేరు కాల్ ఆప్షన్ కొని, అమ్మామా.. ట్రేడింగ్ అంటే ఇంతే అనుకుంటారు చాలామంది. ట్రేడింగ్ అనేది ఎంతో కష్టమైన పని. సమాచారాన్ని విశ్లేషిస్తూ.. అంతర్గత భావోద్వేగాలను అదుపు చేసుకుంటూ సాగే ఒక ప్రక్రియ అని గుర్తించాలి.
అపజయాలే ఎక్కువ:
మార్కెట్ను నిశితంగా గమనిస్తూ ఉండే వారికి.. డబ్బు సంపాదించేందుకు మార్కెట్ కొన్ని పరిమిత అవకాశాలనే ఇస్తుందనే సూత్రం తెలుసు. అందుకే, వారు ఆ అవకాశాల కోసం ఓపిగ్గా ఎదురు చూస్తూ ఉంటారు. 10లో మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే వారు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. చాలా సందర్భాల్లో వారు నష్టభయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉండే ట్రేడింగ్ చేస్తారు. అంత ధైర్యం మనకు ఉన్నప్పుడే ట్రేడింగ్ గురించి ఆలోచించాలి.
ట్రేడింగ్ అనేది ఒక యంత్రం లాంటిది. అన్ని విడి భాగాలూ సరిగ్గా ఉంటేనే దాని పనితీరు బాగుంటుంది. మార్కెట్లో ట్రేడింగ్ చేసే వారూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ట్రేడింగ్ను నేర్చుకునేందుకు ప్రయత్నించే దశలో చిన్న మొత్తాలతోనే ప్రారంభించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పులు చేసి, ఈ లావాదేవీలు చేయొద్దు. లాభాలు వస్తే పొంగిపోవద్దు. నష్టాలు వస్తే ఆందోళన చెందకూడదు. ముందే చెప్పినట్లు.. భావోద్వేగాల నియంత్రణ, నష్టాన్ని భరించగలిగే శక్తి, మీ దగ్గర మిగులు మొత్తం ఉన్నప్పుడే ట్రేడింగ్ జోలికి వెళ్లండి.
- వికాస్ సింఘానియా, సీఈఓ, ట్రేడ్స్మార్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం