Rupee: వీరికి ఇష్టం.. వారికి కష్టం
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 శాతం వరకు క్షీణించింది. సోమవారం డాలర్ విలువ రూ.80ను తాకినా, రూ.79.98 వద్ద స్థిరపడింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్ మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ
రూపాయి క్షీణత రంగాలపై ప్రభావం
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 7 శాతం వరకు క్షీణించింది. సోమవారం డాలర్ విలువ రూ.80ను తాకినా, రూ.79.98 వద్ద స్థిరపడింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో డాలర్ మారకపు విలువ రూ.82కు చేరొచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థలు, రూ.79కి పరిమితం కావచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. రూపాయి క్షీణత ప్రభావం ఏ రంగంపై ఎలా ఉంటుందో చూద్దామా..
ఐటీ
రూపాయి క్షీణత వల్ల అత్యధిక ప్రయోజనం పొందే రంగం ఐటీనే. ఈ కంపెనీల ఆదాయాల్లో 50-60 శాతం డాలర్లలో ఉండటమే ఇందుకు కారణం. రూపాయి విలువ 100 బేసిస్ పాయింట్లు క్షీణిస్తే, ఐటీ కంపెనీల నిర్వహణ మార్జిన్లు 30 బేసిస్ పాయింట్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిణామాలతో 115 బేసిస్ పాయింట్ల మేర ప్రయోజనం కలగొచ్చన్నది అంచనా.
ఔషధం
ముడి సరుకులు 4-5 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటున్నా, నికరంగా ఎగుమతులే అధికమైనందున ఔషధ రంగానికీ ప్రయోజనమే. 2021-22లో 24.62 బిలియన్ డాలర్ల దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం అమెరికాకే చేరాయి. ఈ విపణికి ఎగుమతి చేసే కంపెనీలు అత్యధికంగా లాభపడొచ్చు. దిగుమతులపై ఆధారపడే ఏపీఐ సంస్థల వ్యయాలు పెరగొచ్చు.
దుస్తులు
ముడి సరకులను స్థానికంగానే సమీకరిస్తుండటం, ఎగుమతులు ఎక్కువగా చేస్తుండటం వల్ల ఈ రంగానికి లాభమే. రూపాయి విలువ ఒక్క శాతం క్షీణిస్తే, ఈ రంగ కంపెనీల లాభం 0.25- 0.50% పెరిగే అవకాశం ఉంటుంది.
తేయాకు
దేశీయంగా ఉత్పత్తి అవుతున్న తేయాకులో 16 శాతం (సుమారు 230 మిలియన్ కిలోల) ఎగుమతి అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగ కంపెనీల లాభాలు 5-10 శాతం పెరగొచ్చన్నది అంచనా.
ఉక్కు
దేశీయ ఉక్కు ఉత్పత్తుల్లో 10-15 శాతం వరకు ఎగుమతి చేస్తుండటం కలిసొచ్చే అంశం. అంతర్జాతీయ విపణుల్లో దేశీయ ఉక్కు ఉత్పత్తుల పోటీ సామర్థ్యమూ మెరుగవుతుంది.
చమురు- గ్యాస్
దేశ చమురు, గ్యాస్ అవసరాల్లో 85 శాతం దిగుమతులే తీరుస్తున్నాయి. ఈ బిల్లు భారం అధికమవుతోంది. పెరిగిన భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోతే కంపెనీల మార్జిన్లు క్షీణించవచ్చు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీకి కొంత మేర కలిసిరావచ్చు.
సౌర విద్యుత్
సౌర పలకలు, మాడ్యూళ్ల దిగుమతులపై దేశీయ సోలార్ ప్లాంట్లు ఎక్కువగా ఆధారపడినందున, ప్రాజెక్టుల వ్యయాలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులకు మార్జిన్లూ తగ్గుతాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 1 శాతం తగ్గితే, యూనిట్కు 2 పైసలు మేర టారిఫ్లు పెరగొచ్చు.
సిమెంటు
సిమెంటు ఉత్పత్తి వ్యయంలో 50- 60% వరకు ఇంధనం, రవాణాదే. ఈ ఖర్చు మరింత పెరుగుతోంది కనుక కంపెనీల మార్జిన్లపైనా ప్రభావం పడొచ్చు.
ఎఫ్ఎమ్సీజీ
ముడి చమురు, పామోలిన్ సహా, సగం వరకు ముడి సరకులను దిగుమతి చేసుకుంటాయి కనుక, బిల్లు భారం అధికమవుతోంది. డాలర్ భారాన్ని, ఉత్పత్తుల ధరల పెంపు రూపేణ పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేయనందున.. ఈ రంగ కంపెనీలపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చు.
ఎలక్ట్రానిక్స్
గృహోపకరణాల తయారీ వ్యయంలో 40- 60%, సెల్ఫోన్లలో 70-80% వరకు దిగుమతి చేసుకునే విడిభాగాలే ఉంటాయి కనుక, ఈ రంగానికి ప్రతికూలాంశం.
విమానయానం
ఈ రంగ వ్యయాల్లో 60 శాతం వరకు (విడిభాగాలు, నిర్వహణ, విమాన డెలివరీ చెల్లింపులు, అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇంధనం) చెల్లింపులు డాలర్ల రూపేణ జరుగుతుండటం వల్ల భారం పెరుగుతోంది.
టెలికాం
నెట్వర్క్ గేర్ దిగుమతులపై వార్షికంగా టెలికాం పరిశ్రమ సుమారు 600 కోట్ల డాలర్లు (రూ.48,000 కోట్లు) వెచ్చిస్తోంది. ఈ వ్యయాలు మరింత పెరగొచ్చు.
వాహన
మొత్తం ముడిపదార్థాల్లో 10-20% వరకు దిగుమతి చేసుకుంటుండటం ప్రతికూలమైనప్పటికీ.. వాహనాలను ఎగుమతి చేస్తుండటం కలిసొచ్చే అంశం. దీంతో డాలర్ మారకపు విలువ ప్రభావం పెద్దగా ఉండదు.
మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.16.08 మేర పడిపోయింది. 2014 డిసెంబరు 31న డాలర్ విలువ రూ.63.33 కాగా, 2022 జులై 11 నాటికి అది రూ.79.41కి చేరినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
మోదీ హయాంలో రూపాయి ఎంత క్షీణించిందంటే..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడి
ఈనాడు, దిల్లీ: మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక, అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.16.08 మేర పడిపోయింది. 2014 డిసెంబరు 31న డాలర్ విలువ రూ.63.33 కాగా, 2022 జులై 11 నాటికి అది రూ.79.41కి చేరినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభకు లిఖితపూర్వకంగా తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరలు పెరిగిపోవడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం రూపాయి విలువ బలహీనం కావడానికి ప్రధాన కారణాలని ఆమె విశ్లేషించారు. బ్రిటిష్, జపాన్, యూరో కరెన్సీ విలువ పతనం కూడా రూపాయి కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మూడింటితో భారతీయ రూపాయి విలువ 2022లో బలపడినట్లు పేర్కొన్నారు. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడమూ రూపాయి విలువ తగ్గడానికి కారణంగా ఆమె తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడిదారులు భారత్ మార్కెట్ నుంచి 14 బిలియన్ డాలర్లను ఉపసంహరించినట్లు వెల్లడించారు.
పెద్దనోట్ల రద్దు తర్వాత
89% పెరిగిన నగదు చెలామణి
నోట్ల సంఖ్యలో 45% వృద్ధి
ఈనాడు, దిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు చెలామణి 89% పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు. 2016తో పోల్చుకుంటే 2022 నాటికి నోట్లు సంఖ్య పరంగా 45%, విలువ పరంగా 89% పెరిగినట్లు తేలింది. 2016 మార్చి నాటికి 90,266 మిలియన్ నోట్లు (విలువ రూ.16,41,571 కోట్లు) చెలామణిలో ఉండగా, 2022 నాటికి నోట్ల సంఖ్య 1,30,533 మిలియన్లకు, వాటి విలువ రూ.31,05,721 కోట్లకు చేరినట్లు చెప్పారు. ప్రభుత్వం నల్లధన చెలామణిని తగ్గించడానికి డిజిటల్ - తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ వైపు పయనించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,276
-
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM