Union Budget 2024: కొత్తవి లేవు.. పాత వాటికే అరకొర నిధులు
కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖకు చేసిన కేటాయింపుల్లో రాష్ట్రానికి ఊరట కలిగించే అంశాలేమీ లేవు. నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్, రైల్వే టెర్మినల్, భారీ ప్రాజెక్టులేవీ మంజూరు కాలేదు.
నూతన లైన్లు, డబ్లింగ్ మంజూరు లేదు
బీబీనగర్-గుంటూరు రెండో లైనుకు మోక్షం
రాష్ట్రానికి మొత్తం రూ.5,071 కోట్ల కేటాయింపు
కేంద్ర బడ్జెట్లో రైల్వే కేటాయింపుల తీరిది
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రైల్వేశాఖకు చేసిన కేటాయింపుల్లో రాష్ట్రానికి ఊరట కలిగించే అంశాలేమీ లేవు. నూతన రైల్వే లైన్లు, డబ్లింగ్, రైల్వే టెర్మినల్, భారీ ప్రాజెక్టులేవీ మంజూరు కాలేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి, పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించారు. గతేడాది రాష్ట్రానికి ఇచ్చిన రూ.4,418 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 12.8% పెంచి రూ.5,071 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు వయా నల్గొండ, మిర్యాలగూడ రెండోలైనుకు అయిదేళ్ల తర్వాత నిధులు కేటాయించడం కాస్త ఉపశమనం.
ఏ పథకంలో ఇస్తారో?
కీలకమైన సికింద్రాబాద్, ‘అమృత్ భారత్’ స్టేషన్ల పునరాభివృద్ధి పనులను ప్రస్తావించలేదు. వీటికి నిధులు ఏ పద్దు కింద ఇస్తారో స్పష్టం కావాల్సి ఉంది. ముంబయి మార్గంలో కీలకమైన లింగంపల్లి-వికారాబాద్ సెక్షన్కు రెండో లైను మంజూరు కాలేదు. సర్వే పూర్తయిన కాజీపేట-హుజూరాబాద్-కరీంనగర్ ప్రతిపాదిత రైల్వేలైనూ మంజూరు కాలేదు. ఘట్కేసర్-కాజీపేట వరకు మూడో లైను నిర్మిస్తే దిల్లీ, విజయవాడ వైపు రాకపోకలు సులభమవుతాయి. ఈ ప్రాజెక్టునూ పట్టించుకోలేదు. నిర్మాణంలో ఉన్న మూడో లైను ప్రాజెక్టులకు ఈసారి నిధులు తగ్గాయి. హైదరాబాద్లో ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా నగరం చుట్టూ నాగులపల్లి, శంషాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లో కొత్త టెర్మినళ్ల డిమాండ్ను పరిశీలించనే లేదు.
కొత్త రైల్వే లైన్లకు నిధులు
- మనోహరాబాద్-కొత్తపల్లి: గతేడాది రూ.185 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.350 కోట్లు కేటాయించారు.
- మణుగూరు-రామగుండం: 2013-14లో మంజూరైన ఈ ప్రాజెక్టు నిడివి 200 కి.మీ. జాప్యం వల్ల అంచనా వ్యయం రూ.1,112 కోట్ల నుంచి రూ.2,911 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.10 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5 కోట్లకే పరిమితం చేశారు.
- భద్రాచలం రోడ్-సత్తుపల్లి: నిర్మాణం పూర్తయ్యింది. చిన్నపాటి పనులకు రూ.6.12 కోట్ల కేటాయింపు.
- భద్రాచలం రోడ్-కొవ్వూరు: 2012-13లో మంజూరైంది. ఆలస్యంతో అంచనా వ్యయం రూ.1,445 కోట్ల నుంచి రూ.2,154.83 కోట్లకు పెరిగింది. ఈసారి కేటాయించింది రూ.10 లక్షలే.
డబ్లింగ్, థర్డ్ లైన్లు
- బీబీనగర్-గుంటూరు: 248 కి.మీ. పొడవైన లైన్ ఇది. తెలుగు రాష్ట్రాల మధ్య రద్దీ దృష్ట్యా రెండోలైను నిర్మిస్తే ఎంతో వెసులుబాటు. 2019-20 లోనే ఇది మంజూరైనా నిధులు రాలేదు. అంచనా వ్యయం రూ.2,480 కోట్ల నుంచి రూ.2,853 కోట్లకు పెరిగింది. గతేడాది రూ.60 కోట్లు, ఇప్పుడు రూ.200 కోట్లు ఇవ్వడంతో పనులు మొదలవ్వచ్చు.
- కాజీపేట-విజయవాడ మూడో లైను: గతేడాది రూ.337.52 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.310 కోట్లే.
- కాజీపేట-బల్లార్ష మూడో లైను: కేటాయింపు రూ.300 కోట్లే. గతేడాది రూ.450.86 కోట్లు.
ఇతర ప్రాజెక్టులకు..
- కాజీపేట పీఓహెచ్ వర్క్షాప్: తొలుత వ్యాగన్ ఓవర్హాలింగ్ వర్క్షాప్ మంజూరు చేశారు. తర్వాత వ్యాగన్ల ఉత్పత్తి, ఆపై వ్యాగన్లు, ఇంజిన్ల ఉత్పత్తితో ‘రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ (ఆర్ఎంయూ)గా మార్చారు. ఈ ఏడాది రూ.150 కోట్లు కేటాయించారు. గత ఏడాది రూ.160 కోట్లు ఇచ్చారు. నిర్మాణపనులు ప్రారంభం కావాల్సి ఉంది.
- చర్లపల్లి టెర్మినల్: ఈసారి రూ.46 కోట్లు కేటాయించారు. నిర్మాణపనులు తుది దశలో ఉన్నాయి.
ద.మ.రైల్వే జోన్కు నిధులు ఇలా..
ద.మ.రైల్వే జోన్ పరిధిలో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలో కొంతభాగం ఉంది. మొత్తంగా ద.మ.రైల్వేకి ఈసారి కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. గతేడాది రూ.13,786.19 కోట్లు కేటాయించగా, ఈసారి అది రూ.14,232.83 కోట్లకు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.