JioSpaceFiber: జియో నుంచి ఇక శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు
JioSpaceFiber: ఇప్పటికే జియోఫైబర్, జియోఎయిర్ఫైబర్ పేరిట బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్న జియో తాజాగా శాటిలైట్ నెట్వర్క్ ఆధారిత సర్వీసులను కూడా ప్రారంభించింది.
దిల్లీ: భారత్లో తొలి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ను విజయవంతంగా అమలు చేసినట్లు ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) ప్రకటించింది. భారత్లో ఇప్పటి వరకు ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలకు దీని ద్వారా వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సేవల (broadband services)ను అందించనున్నట్లు తెలిపింది. జియోస్పేస్ఫైబర్ (JioSpaceFiber)గా పిలుస్తున్న ఈ సర్వీస్ను భారత మొబైల్ కాంగ్రెస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో శుక్రవారం రిలయన్స్ జియో (Reliance Jio) విజయవంతంగా ప్రదర్శించింది.
జియో (Reliance Jio) ఇప్పటికే భారత్లో 45 కోట్ల కస్టమర్లకు ఫిక్స్డ్ లైన్, వైర్లెస్ మార్గాల ద్వారా వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ సేవల (broadband services)ను అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్ (JioFiber), జియోఎయిర్ఫైబర్ (JioAirFiber) వంటి బ్రాడ్బ్యాండ్ సర్వీసుల సరసన జియోస్పేస్ఫైబర్ (JioSpaceFiber)ను కూడా చేర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఎలాంటి జాప్యం లేని, వేగవంతమైన ఇంటర్నెట్ను, ఎంటర్టైన్మెంట్ సేవలను ప్రాంతంతో సంబంధం లేకుండా అందిస్తున్నట్లు పేర్కొంది. తాజా శాటిలైట్ నెట్వర్క్తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని వివరించింది.
ప్రపంచంలో తాజా ‘మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO)’ శాటిలైట్ టెక్నాలజీ కోసం జియో ఎస్ఈఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్ (Gigabit), స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. తద్వారా జియో (Reliance Jio)కు ఎస్ఈఎస్కు చెందిన ఓ3బీ, ఓ3బీ ఎంపవర్ శాటిలైట్ల నెట్వర్క్కు యాక్సెస్ లభిస్తుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్బ్యాండ్ సేవల (broadband services)ను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది.
జియోస్పేస్ఫైబర్ (JioSpaceFiber) సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే నెట్వర్క్లో గుజరాత్ గిర్, ఛత్తీస్గఢ్ కోర్బా, ఒడిశా నవరంగాపూర్, అసోం ఓఎన్జీసీ జోర్హట్ వంటి మారుమూల ప్రాంతాలను చేర్చినట్లు జియో తెలిపింది. ‘‘భారత్లో లక్షలాది ఇళ్లు, వ్యాపారాలకు జియో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించాం. ఇప్పటి వరకు ఇంటర్నెట్ అనుసంధానతకు దూరంగా ఉన్న లక్షలాది మందికి కూడా జియోస్పేస్ఫైబర్ (JioSpaceFiber) ద్వారా సేవలను విస్తరిస్తున్నాం. జియోస్పేస్ఫైబర్తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా కొత్త డిజిటల్ సమాజంలో చేరి గిగాబిట్ యాక్సెస్తో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చు’’ అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
Realme C65: మొబైల్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ ధరలో ఎయిర్గెశ్చర్స్ సదుపాయంతో కొత్త ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. -
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
Jio Cinema: జియో సినిమా కొత్తగా రెండు సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చింది. వాటిలో ఒకటి ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని రూపొందించింది. -
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
Realme Narzo: రియల్మీ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసింది. వీటి ధర రూ.11,999 నుంచి ప్రారంభమైంది. ఫీచర్లు, వేరియంట్లు, వాటి ధరలు, ఆఫర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఎయిర్టెల్ కొత్త రోమింగ్ ప్యాక్స్.. 184 దేశాలకు ఒకే ప్యాక్
ఎయిర్టెల్ కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లు తీసుకొచ్చింది. రోజుకు రూ.133 నుంచి ఈ ప్లాన్లు ప్రారంభమవుతాయని ఎయిర్టెల్ తెలిపింది. -
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
సోషల్మీడియాలో లుక్ బిట్వీన్ పేరిట కొత్త ట్రెండ్ మొదలైంది. ఇంతకీ ఏమిటీ ట్రెండ్..? ఎక్కడ మొదలైంది? -
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
తన స్మార్ట్ఫోన్లను ఎవరో కొట్టేస్తే చిన్న ట్రిక్తో పట్టేశాడు ఓ టెక్ ఇన్ఫ్లూయెన్సర్. జరిగిందంతా ఓ పోస్ట్లో రాసుకొచ్చాడు. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
WhatsApp: ఫొటోలు, వీడియోలు పంపించడాన్ని సులభతరం చేయడం కోసం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) కొత్త ఫీచర్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. -
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
Xiaomi: షావోమి మంగళవారం మరికొన్ని స్మార్ట్ ఉత్పత్తులను భారత్లో విడుదల చేసింది. వీటిలో ప్యాడ్, బడ్స్, క్లీనర్, స్టీమర్ ఉన్నాయి. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
OnePlus Nord CE 3: నార్డ్ సీఈ3 ధరను వన్ప్లస్ తగ్గించింది. మరికొన్ని అదనపు ప్రయోజనాలనూ అందిస్తోంది. అవేంటి? ధర ఎంత వరకు తగ్గిందో చూద్దాం..! -
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ రానున్న రోజుల్లో అందరికీ రోలవుట్ అవుతుంది. -
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
మీ ప్రాంతంలో ఏయే సంస్థలు బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తున్నాయో తెలుసుకోవాలా? అయితే, ఈ వెబ్సైట్ను సందర్శించండి. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
Samsung: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.. -
6,000mAh బ్యాటరీతో వివోలో బడ్జెట్ 5G ఫోన్.. ధర, ఫీచర్లివే..
Vivo T3X: వివో టీ2ఎక్స్కు కొనసాగింపుగా వివో టీ3ఎక్స్ విడుదలైంది. కెమెరా, డిస్ప్లే సహా ఇతర ఫీచర్లను అప్గ్రేడ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. -
ఆసుస్ నుంచి రెండు స్క్రీన్ల ల్యాపీ.. ధర రూ.లక్షన్నర పైనే..!
Asus: ఆసుస్ సరికొత్త ల్యాప్టాప్ను మంగళవారం భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ల్యాపీ ప్రత్యేకలు ఏంటంటే..? -
వాట్సప్లో మరో కొత్త ఆప్షన్.. ఆన్లైన్లో ఉన్న వారి లిస్ట్ ఒకేచోట!
WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లతో ముందుకువచ్చే వాట్సప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది. -
₹15 వేలకే మోటో కొత్త 5జీ ఫోన్.. జీ64 ఫీచర్లు ఇవీ..
మోటో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. జీ 64 పేరిట కొత్త ఫోన్ను తీసుకొచ్చింది. ఏప్రిల్ 23 నుంచి అమ్మకాలను ప్రారంభించిది. -
‘ఎక్స్’లో లైక్ కొట్టాలన్నా.. పోస్టు పెట్టాలన్నా చెల్లించాల్సిందే!
Elon Musk: ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పలు మార్పులు తీసుకొచ్చిన ఎలాన్ మస్క్.. తాజాగా మరో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. బాట్ల నివారణ కోసమే దీన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్పై రూ.5,000 తగ్గింపు!
OnePlus 11 5G: వన్ప్లస్ 11 5జీ ధరను కంపెనీ మరింత తగ్గించింది. ఈ ఫోన్ ఫీచర్లు, అదనపు డిస్కౌంట్లు, కొత్త ధర వంటి వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం..! -
ఈ పాపులర్ జియో ప్లాన్పై 20GB అదనపు డేటా
Jio Plans: కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై జియో అదనపు డేటా అందిస్తోంది. అవేంటి? వాటిలోని ఇతర ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం!
తాజా వార్తలు (Latest News)
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్