Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? స్వచ్ఛత, మోసాల గురించి తెలుసుకోండి..
ఆషాఢం ఆఫర్లంటారు కొందరు.. శ్రావణం డిస్కౌంట్లంటారు ఇంకొందరు. అక్షయ తృతీయకు (Akshaya Tritiya) తక్కువ ధరకే బంగారం అని
Akshaya Tritiya 2022: ఆషాఢం ఆఫర్లంటారు కొందరు.. శ్రావణం డిస్కౌంట్లంటారు ఇంకొందరు. అక్షయ తృతీయకు (Akshaya Tritiya) తక్కువ ధరకే బంగారం అని ఊరిస్తారు మరికొందరు. మా దగ్గర అతి తక్కువ మేకింగ్ ఛార్జీలని ఒకరు చెబితే.. మేం అసలు తరుగే తీయం.. అని చెబుతారు ఇంకొకరు. గ్రాము బంగారం ఉచితమని ఒకరు ఊరిస్తే... మా స్కీములో చేరండి, చవగ్గా బంగారం కొనండి అని ఆశపెడతారు ఇంకొకరు. ఇలా పండగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే ప్రచారం ఓ రేంజ్లో ఉంటుంది. ఆఫర్ల మాట అటుంచితే స్వచ్ఛత మాటేంటి? ఒకవేళ అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా మీరు బంగారం కొనడానికి వెళుతుంటే.. ముందు స్వచ్ఛత, హాల్ మార్కింగ్ వంటి విషయాలతో పాటు బంగారం విక్రయాల్లో జరిగే మోసాల గురించి తెలుసుకోండి..
ఏమిటీ హాల్మార్కింగ్?
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అనే సంస్థ పలు విషయాల్లో ప్రమాణాలను నిర్దేశిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తోంది. స్వర్ణకారులకూ, బంగారం వ్యాపారస్తులకూ లైసెన్సులు ఇచ్చే సంస్థ ఇదే. అలాగే ఆయా లోహాల స్వచ్ఛతా ప్రమాణాలను నిర్దేశించడానికి తెచ్చిందే హాల్మార్క్ విధానం. హాల్మార్క్ అనేది ఒక అధికారిక చిహ్నం. ఫలానా బంగారు లేదా వెండి వస్తువు స్వచ్ఛత బీఐఎస్ ప్రమాణాలకు లోబడి ఉందని ఇచ్చే గుర్తింపు చిహ్నం. ఇప్పుడు దేశం మొత్తమ్మీద ఎక్కడ వెండి ,బంగారు ఆభరణాలు కొన్నా ఆయా వస్తువుల మీద హాల్మార్క్ ముద్ర తప్పనిసరిగా ఉండాలి.
ఇంతకు ముందూ ఉండేదిగా?
హాల్మార్కింగ్ విధానాన్ని 2000 సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు. అయితే కొందరు వ్యాపారులు మాత్రమే స్వచ్ఛందంగా ఈ విధానాన్ని అనుసరించేవారు. దేశంలో స్వర్ణాభరణాల వ్యాపారులు లక్షల్లో ఉన్నప్పటికీ.. బీఐఎస్లో రిజిస్టర్ చేసుకున్నది కొందరే. ఇరవై ఏళ్లయినా అందరూ దాన్ని అందిపుచ్చుకునే పరిస్థితి కన్పించకపోవడంతో ఇప్పుడు తప్పనిసరి చేయాల్సివచ్చింది. తొలి విడతలో 2021 జూన్ 23 నుంచి 256 జిల్లాల్లో హాల్మార్కింగ్ తప్పనిసరి విధానం అమలవుతోంది. 2022 జూన్ 1 నుంచి రెండో దశ అమలు కానుంది. దీంతో మరో 32 జిల్లాల్లో ఈ ప్రక్రియ విస్తరించనుంది. దీని ప్రకారం నగల వ్యాపారులంతా ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థలో తాము హాల్మార్క్ చేసిన వస్తువుల్నే అమ్ముతామని చెప్పి రిజిస్టర్ చేసుకోవాలి.
దీనివల్ల ఏమిటి లాభం?
చాలామంది 916 కేడీఎం అనీ, హాల్మార్క్ గోల్డ్ అనీ చెప్పి అమ్ముతారే కానీ నిజానికి వాటన్నిటిమీదా స్వచ్ఛతకు గ్యారంటీ ఇచ్చే హాల్మార్కింగ్ ముద్ర ఉండదు. అసలా పేర్లకి అర్థమేమిటో చాలామందికి తెలియదు. దాంతో వినియోగదారులు మోసపోయే అవకాశాలు ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో వినియోగదారులకు నమ్మకం కలిగించే థర్డ్ పార్టీ ఈ హాల్మార్క్ సర్టిఫికెట్. దీనివల్ల ఇప్పుడు ప్రతి నగా కచ్చితంగా ఎన్ని క్యారట్ల బంగారంతో తయారైందో తెలిసిపోతుంది. దానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. 22 క్యారట్ల పేరు చెప్పి 20 లేదా 18 క్యారట్ల నగను వినియోగదారులకు అమ్మి మోసం చేయడానికి వీలుండదు.
916 కేడీఎం అంటే ఏమిటి?
బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారనీ.. నూరుశాతం శుద్ధమైన బంగారాన్ని 24 క్యారట్ల బంగారం అంటారనీ తెలిసిందే. అది చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి దాంతో నగలు తయారుచేయడం సాధ్యం కాదు. ఎంతో కొంత ఇతర లోహాలు కలపాలి. పాత రోజుల్లో రాగి, వెండి లాంటివి కలిపేవారు. వాటిని కలిపే శాతాన్ని బట్టి బంగారం క్యారటేజ్ (స్వచ్ఛత) మారుతుంటుంది. సాధారణంగా నగల తయారీకి 10 క్యారట్ల నుంచి 22 క్యారట్ల వరకూ వేర్వేరు స్వచ్ఛతలు ఉన్న బంగారాన్ని వాడతారు. దీన్ని శాతంలో తెలుసుకోవాలంటే క్యారట్ నంబర్ని 24తో విభజించి 100తో గుణించాలి.
ఉదాహరణకు- 22 క్యారట్ల గొలుసు ఉందనుకోండి... 22ని 24తో విభజిస్తే 0.9166 వస్తుంది. దాన్ని వందతో గుణిస్తే 91.66 శాతం అన్నమాట. అంటే కొన్న నగలో 91.66 శాతం బంగారం ఉండగా మిగిలిన 8.34 శాతం ఇతర లోహాలు ఉన్నట్లు. అదే 20 క్యారట్ల బంగారమైతే దాని స్వచ్ఛత 83.3, 18 క్యారట్లయితే 75, 14 క్యారట్లయితే 58.3శాతం చొప్పున ఉంటుంది. ఇదంతా బంగారం స్వచ్ఛత సంగతి. ఇక కేడీఎం విషయానికి వస్తే... వెండి, రాగి లాంటివి కలపడం వల్ల బంగారం మెరుపు కొంచెం తగ్గేది. రాగి కలిపితే ఎరుపు ఛాయతోనూ, వెండి కలిపితే తెల్లగానూ ఉండేది. దాంతో కాడ్మియం అనే లోహాన్ని కలపడం మొదలెట్టారు. దీన్ని కలపడం వల్ల బంగారం మెరుపూ తగ్గేది కాదు, స్వచ్ఛతకూ ఢోకా ఉండేది కాదు. పైగా సరిగ్గా 8 శాతం కాడ్మియం కలిపితే చాలు బంగారం 92 శాతం స్వచ్ఛతతో తగిన పటుత్వంతో ఆభరణాలకు అనువుగా ఉండేది. సాధారణంగా ఆభరణాలకు ఎక్కువగా వాడేది 22 క్యారట్ల బంగారం కాబట్టి దానికి కాడ్మియంతో లెక్క సరిగ్గా సరిపోయేసరికి 916 కేడీయం అన్నమాట వాడుకలోకి వచ్చింది. అయితే కొన్నేళ్లపాటు కాడ్మియం వాడాక అటు నగలు తయారుచేసేవారూ అనారోగ్యం పాలవుతున్నారు. ఆ నగలు ధరించినవారూ చర్మవ్యాధుల నుంచి క్యాన్సర్ల వరకూ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసింది. దాంతో కాడ్మియం వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు దాని స్థానంలో జింక్, రాగి, వెండి లాంటి లోహాలనే వాడుతున్నారు. అయినా అలవాటైపోయిన కేడీఎం అన్న పేరు మాత్రం అలాగే ఉండిపోయింది.
Also Read: అక్షయ తృతీయకు ‘బంగారం’లాంటి ఆఫర్లు..ఉచితంగా గోల్డ్ కాయిన్!
బంగారం కొనుగోళ్లలో ఎలాంటి మోసాలు జరుగుతాయి?
- క్యారట్ల తేడాలేమీ తెలియని వారికి కేడీఎం, హాల్మార్క్ అన్న పేర్లు చెప్పి 22 క్యారట్ల ధర వసూలు చేస్తూ 18, 20 క్యారట్ల బంగారంతో చేసిన నగలను విక్రయిస్తున్న సంఘటనలూ ఉన్నాయి. ఒక్క బంగారం ప్యూరిటీ విషయంలోనే కాదు, ఇంకా చాలా రకాలుగానూ మోసాలు జరుగుతుంటాయి. తక్కువ క్యారట్లతో చేసిన నగలను 22 క్యారట్ల మేలిమి బంగారం అని నమ్మబలికి అమ్మితే కొన్నవారికి వాటిని మళ్లీ మార్చుకున్నప్పుడు గానీ జరిగిన మోసం తెలియదు. ఇక్కడే హాల్మార్కింగ్ ఆదుకుంటుంది.
- నగల దుకాణంలో బిల్లులకు సంబంధించి కూడా వినియోగదారులు కొన్ని విషయాలను స్పష్టంగా తెలుసు కోవాలి. తరుగు (వేస్టేజ్), తయారీ (మేకింగ్), పన్నుల పేరుతోనూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడం, బిల్లు కావాలంటే ఒక ధర, అక్కర్లేదంటే కాస్త తగ్గించి తీసుకోవడం.. జరుగుతుంటాయి. కాస్తయినా ధర తగ్గుతుందనగానే బిల్లు ఏం చేసుకుంటాంలే నమ్మకమైన షాపే కదా అని అనుకునే వాళ్లే ఎక్కువ. ఆ ధోరణి ఇప్పుడు చెల్లదు.
- తరుగు విషయానికి వస్తే- ముద్దగా ఉన్న లోహం ముక్క తీసుకుని నాజూగ్గా డిజైన్లను చేస్తున్న సమయంలో కంటికి కన్పించని చిన్న చిన్న ముక్కలు ఎగిరిపోతుంటాయి. ఎంతో కొంత తప్పనిసరిగా వృథా అవుతుంది. ఆరు శాతమో, ఏడు శాతమో దాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. అలాగని మరీ 18 శాతమో 20 శాతమో వేస్తే, అది అన్యాయమే. మేకింగ్ ఛార్జీ కూడా నగ పనితనాన్ని బట్టి ఉంటుంది. మరీ అన్యాయంగా వేస్తున్నారనిపిస్తే తగ్గించమని అడగడంలో తప్పులేదు. వారికి గిట్టుబాటు అయితేనే ఇస్తారు. రెడీమేడ్ నగల దుకాణాల్లో తరుగు, తయారీల్లో ఏదో ఒకటి మాత్రమే వసూలు చేస్తారు. ఇక పన్నులనేవి ప్రభుత్వం నిర్దేశించినవి కాబట్టి మార్చడానికి ఉండదు.
- రాళ్ల నగ కొంటే రాళ్లతో కలిపి బంగారం బరువును లెక్కేస్తారు కొందరు. దానివల్ల వినియోగదారు రాళ్లకి బంగారం ధర చెల్లించాల్సివస్తుంది. పైగా రాళ్లు, వజ్రాలు లాంటివి పొదిగినప్పుడు పటుత్వం కోసం తక్కువ క్యారట్ల బంగారాన్ని వాడతారు. అది చెప్పకుండా 22 క్యారట్ల బంగారం ధర తీసుకోవచ్చు. బీఐఎస్ నిబంధనల ప్రకారం రాళ్ల బరువు, బంగారం బరువు విడివిడిగా వేయాలి. ఇవన్నీ మన దగ్గర రికార్డుగా ఉండాలంటే కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకీ బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో బంగారం బరువు, స్వచ్ఛత, ధర, రాళ్ల బరువు, వాటి ధర, తయారీ ఛార్జీలు, పన్నులు... అన్నీ స్పష్టంగా రాసి ఉండాలి. ఆ బిల్లును పదిలంగా భద్రపరచుకోవాలి.
అసలు హాల్మార్కింగ్ ఎవరు చేస్తారు?
హాల్మార్కింగ్ చేయడానికి ప్రత్యేక యంత్రాలూ, నిపుణులూ ఉన్న కేంద్రాలు ఉంటాయి. తగిన శిక్షణ పొందినవారు బీఐఎస్ నుంచి లైసెన్సు పొంది ఈ కేంద్రాలను నెలకొల్పవచ్చు. ‘అసేయింగ్ అండ్ హాల్మార్కింగ్ సెంటర్లు’గా పేర్కొనే ఇవి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నిటిలోనూ ఉన్నాయి. నగల తయారీ దారులు, లేదా వాటిని అమ్మే వ్యాపారులు ప్రతి నగనీ ఈ కేంద్రానికి పంపించాలి. అక్కడ వాళ్లు మెషీన్ల సాయంతో ఆయా నగల స్వచ్ఛతను పరీక్షించి కచ్చితంగా అంచనావేస్తారు. స్వచ్ఛతలో ఏ కొంచెం తేడా ఉన్నా హాల్మార్క్ వేయరు. బంగారమైతే ఒక్కో వస్తువుకీ రూ.35, వెండి అయితే రూ.25 చొప్పున ఛార్జి తీసుకుంటారు. వస్తువు బరువుతో కానీ, ధరతో కానీ దీనికి సంబంధం లేదు. ఆ ఛార్జీలను వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదు. అది పూర్తిగా దుకాణదారు బాధ్యత. వినియోగదారులు నేరుగా హాల్మార్కింగ్ చేయించుకునే అవకాశం లేదు. కానీ.. అనుమానం వచ్చినప్పుడు ఆ కేంద్రానికి వెళ్లి రూ.200 చెల్లించి నగను పరీక్షించుకోవచ్చు. దుకాణంలో వర్తకుడు ఇచ్చిన ప్యూరిటీ సర్టిఫికెట్కీ ఇక్కడ చేసిన పరీక్షకీ మధ్య తేడా ఉంటే దుకాణదారును నిలదీసి ఛార్జీలు వాపస్ తీసుకోవచ్చు. ఇక హాల్మార్కింగ్ లేని పాత బంగారాన్ని నగల వర్తకులకు అమ్మవచ్చు. వాళ్లు నాణ్యత పరీక్షించి తగిన సొమ్ము చెల్లిస్తారు. లేదా కరిగించి కొత్త నగ చేయించుకుని దానికి హాల్మార్క్ వేయించవచ్చు.
షాప్కు వెళ్లేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి..
బంగారం కొనడానికి షాప్కు వెళుతుంటే.. ఆ షాప్కు బీఐఎస్ లైసెన్స్ ఉందా? హాల్మార్కింగ్ నగలు మాత్రమే అమ్ముతామని బోర్డు రాసి పెట్టారా? అన్నది గమనించాలి. దుకాణదారు లైసెన్సును షాపులో ప్రదర్శించాలి. బీఐఎస్ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన దుకాణాల లిస్టు ఉంటుంది. అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. లైసెన్సులో చూపిన అడ్రసు, షాపు అడ్రసు ఒకటే అయివుండాలి. హాల్మార్కింగ్ సెంటర్ల చిరునామాలూ బీఐఎస్ వెబ్సైట్లో ఉంటాయి. కాబట్టి గుర్తింపు ఉన్న హాల్మార్కింగ్ కేంద్రంలోనే చేయించారా అన్నదీ నిర్ధారించుకోవచ్చు.
- బీఐఎస్ హాల్మార్క్, బంగారం స్వచ్ఛత, హాల్మార్కింగ్ సెంటర్ కోడ్.. ఇవన్నీ నగ లోపలి వైపున ముద్రించి ఉంటాయి. వాటిని పది రెట్లు పెద్దగా చూపించే భూతద్దం దుకాణంలో ఉంటుంది. అడిగి తీసుకుని చూసుకోవాలి. చెవి దుద్దులు, గాజులు లాంటి జతగా ఉండే వస్తువులకు రెండింటికీ విడివిడిగా హాల్మార్క్ ఉండాలి. దేనిమీదైనా అనుమానం వస్తే బీఐఎస్కి ఆన్లైన్లోనూ, ఆఫ్లైన్లోనూ, ‘బీఐఎస్ కేర్’ మొబైల్ ఆప్ ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
IRCTC tour package: వేసవిలో పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీని ఓ సారి పరిశీలించండి. -
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
e-pan: కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు రోజులతరబడి ఎదురుచూడాల్సిన పని లేకుండా తక్షణమే ఈ-పాన్ పొందే సదుపాయం ఉంది. అదెలాగంటే..? -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
మొబైల్లో వచ్చిన మెసేజ్ను హెడ్డర్ సాయంతో ఎవరు పంపారో ఇట్టే కనిపెట్టేయొచ్చు. అదెలాగంటే..? -
కౌంటర్కు వెళ్లకుండానే ట్రైన్ టికెట్.. UTS యాప్తో బుకింగ్ ఎలా..?
UTS app: టికెట్ కొనుగోలును సులభతరం చేసేందుకు రైల్వే శాఖ యూటీఎస్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. అందులో టికెట్ బుకింగ్ ఎలానో ఇప్పుడు చూద్దాం.. -
ఆధార్ కార్డ్లో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఏమేం కావాలి?
Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీలో తప్పుందా? మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఎలా అప్డేట్ చేసుకోవాలో చూడండి.. -
పెట్టుబడి ప్రభుత్వ బాండ్లలో
చిన్న మదుపరులు ప్రభుత్వ బాండ్లలో మదుపు చేసేందుకు 2021లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ను తీసుకొచ్చింది. దీన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం. -
టెక్నాలజీ కంపెనీల్లో
బంధన్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బంధన్ ఇన్నోవేషన్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ, ఫార్మా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సత్వర వృద్ధి సాధించటానికి ప్రయత్నించే కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. -
ఆధార్ ఏటీఎం.. ఇంటి నుంచే క్యాష్ విత్డ్రా ఎలా చేసుకోవాలి?
Aadhaar ATM: ఇంటి నుంచే డబ్బు విత్డ్రా చేసుకొనే సదుపాయాన్ని పోస్టల్ శాఖ అందిస్తోంది. దీన్ని ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.. -
వేసవిలో ఊటీ అందాలు చూసొస్తారా? ₹13 వేల నుంచే ప్యాకేజీ ధరలు
IRCTC tour package: వేసవిలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే. ప్రయాణ టికెట్లు, వసతి ఏర్పాట్లతో ఐఆర్సీటీసీ అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ వివరాలను ఓసారి పరిశీలించండి. -
టర్మ్ ఇన్సూరెన్స్ కుటుంబానికి భరోసానిచ్చేలా
బీమా పాలసీలు ఎన్నో రకాలుగా ఉంటాయి. కొన్ని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. మరికొన్ని పెట్టుబడులకు తోడ్పడతాయి. వీటికి భిన్నంగా పూర్తి రక్షణకే పరిమితమయ్యేవి టర్మ్ పాలసీలు. వీటిని ఆన్లైన్లోనూ తీసుకోవచ్చు. లేదా బీమా సలహాదారును సంప్రదించీ కొనుగోలు చేయొచ్చు. -
కేరళ ప్రకృతి అందాలు చూస్తారా? ₹14 వేల నుంచే IRCTC ప్యాకేజీ
IRCTC tour package: వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సీటీసీ అందిస్తున్న కేరళ టూర్ ప్యాకేజీ వివరాల్ని పరిశీలించండి.. -
తిరుమల ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దర్శనం, ప్రయాణ టికెట్లతో ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఇవే..
Irctc Tirupati: తిరుమల దర్శనం కోసం ప్లాన్ చేస్తున్నారా? రెండు రాష్ట్రాల ప్రజలు గోవిందుడిని దర్శించుకొనేందుకు ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలు అందిస్తోంది. వాటిని ఓసారి పరిశీలించండి.. -
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
E- insurance: కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి బీమా పాలసీల డిజిటలైజేషన్ను తప్పనిసరి చేస్తున్నట్లు ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
పసిడిలో మదుపు 10 శాతమే..
నాకు నెలకు రూ.60వేల వేతనం వస్తోంది. నా వయసు 39. ఇప్పటి వరకూ ఎలాంటి జీవిత బీమా పాలసీలనూ తీసుకోలేదు. ఇప్పుడు ఎలాంటి పాలసీలను తీసుకోవాలి. -
ఆరోగ్య బీమా: సమాచారం ఇస్తేనే మేలు
ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటి వరకూ ఉన్న ముందస్తు వ్యాధుల గురించి బీమా సంస్థకు తప్పనిసరిగా తెలియజేయాలి. -
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
March 31 deadline: మ్యూచువల్ ఫండ్లలో మదుపు ప్రారంభించినప్పుడు విద్యుత్, గ్యాస్ బిల్లులు, బ్యాంకు ఖాతాలు సమర్పించి కేవైసీ నిబంధనలు పూర్తి చేసిన వారు.. మరోసారి తమ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. -
డిజీ లాకర్తో ఆధార్, పాన్ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?
DigiLocker: ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా అన్నీ ఒకేచోట డిజిటల్గా అందుబాటులో ఉంచేందుకు డిజీలాకర్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంతకీ ఇదెలా ఉపయోగపడుతుందో తెలుసా? -
కేవైసీ అప్డేట్ చేశారా?
బ్యాంకులో ఖాతా ఉందా? మ్యూచువల్ ఫండ్లో మదుపు చేస్తున్నారా? జీవిత, ఆరోగ్య బీమా పాలసీలున్నాయా? మరి, మీ కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి) వివరాలు తెలియజేయడం తప్పనిసరి. -
IRCTC refund: ఐఆర్సీటీసీ రిఫండ్స్ ఇక వేగవంతం.. గంటలోనే నగదు వెనక్కి?
IRCTC refund process: రైలు టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు డెబిట్ అయ్యాయా? ఇకపై ఆ సొమ్ము కోసం రోజులతరబడి ఎదురు చూడాల్సిన పనిలేదు. ఈ ప్రక్రియ వేగవంతం కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM