Maruti Suzuki: మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. ఎంతంటే?

Maruti Suzuki India: మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచింది. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.

Published : 16 Jan 2024 13:37 IST

Maruti Suzuki | దిల్లీ: తమ కంపెనీ నుంచి వస్తున్న అన్ని మోడల్‌ కార్ల ధరలను పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) మంగళవారం ప్రకటించింది. దిల్లీలోని ఎక్స్‌షోరూం ధరలపై 0.45 శాతం పెంపును తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కంపెనీ ఆల్టో నుంచి ఇన్విక్టో వరకు అనేక మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి రూ.3.54 లక్షల నుంచి ప్రారంభమై రూ.28.42 లక్షల వరకు ఉంది.

నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆ భారాన్ని కొంతవరకు వినియోగదారులకు బదిలీ చేయక తప్పడం లేదని గత ఏడాది నవంబరులోనే కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో 2024 జనవరి నుంచి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. తాజాగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని