Stock Mrket: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
అమెరికాలో ద్రవ్యోల్బణం మందగించిందనే కబురు దేశీయ మార్కెట్లలో ఉత్సాహం నింపింది. సూచీలు లాభాల జోష్లో ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఉదయం 9.17 సమయంలో నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 19,488 వద్ద, సెన్సెక్స్ 360 పాయింట్లు పెరిగి 65,754 వద్ద ఉన్నాయి. ప్రైమో కెమికల్స్, జెన్ టెక్నాలజీస్, సౌత్ ఇండియన్ బ్యాంక్, పాలిమెడిక్యూర్, లాయిడ్ మెటల్స్ లాభాల్లో ఉండగా.. కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఎజిస్ లాజిస్టిక్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మ్యాక్స్ ఫినాన్స్ షేర్ల విలువ కుంగింది. నేడు డాలర్తో పోలిస్తే రూపాయి మరింత బలపడి 81.99 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది.
అమెరికా వినిమయ ద్రవ్యోల్బణం నెమ్మదించినట్లు గణాంకాలు వెల్లడించడం ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపింది. అమెరికా మార్కెట్లు నిన్న సానుకూలంగా ట్రేడింగ్ను ముగించాయి. డోజోన్స్ 0.2 5శాతం, నాస్డాక్ 1.15 శాతం, ఎస్అండ్పీ 500 సూచీ 0.74శాతం విలువ పెరిగాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడింగ్ను మొదలుపెట్టాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్ఎక్స్ 1.42శాతం, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 0.87 శాతం, హాంకాంగ్కు చెందిన హాంగ్సెంగ్ 2.58 శాతం, జపాన్ నిక్కీ 1.29 శాతం, తైవాన్కు చెందిన టీసీఎస్సీ 1.62 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.
సాఫ్ట్వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఏకీకృత లాభం 16.83% వృద్ధి సాధించడం ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెంచింది. వాస్తవానికి విశ్లేషకులు అంచనా వేసిన రూ.10,886 కోట్ల లాభంతో పోలిస్తే ఇది ఎక్కువ. ప్రస్తుతం తమ వద్ద 10.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,700 కోట్ల) ఆర్డర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. మరో టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.3,534 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది. గతేడాదితో పోలిస్తే ఇది 7.6% అధికం. ఈ ఏడాది జూన్లో ప్రయాణికుల వాహనాల (కార్లు, స్పోర్ట్స్ వినియోగ వాహనాలు, వ్యాన్లు-పీవీ) టోకు అమ్మకాలు 2% పెరిగి 3,27,487కు చేరినట్లు వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్) వెల్లడించింది. ఆటో షేర్లపై దీని సానుకూల ప్రభావం పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది
సబ్బుల నుంచి స్థిరాస్తి దాకా వ్యాపారాలను నిర్వహిస్తున్న, 127 ఏళ్ల చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ విడిపోయింది. వారసులు దీనిని పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. -
పసిడి ధరహాసంలోనూ గిరాకీ
పసిడి ధర జీవనకాల గరిష్ఠాలకు చేరినా.. దేశీయంగా గిరాకీ తగ్గలేదు. ఈ ఏడాది జనవరి-మార్చిలో 136.6 టన్నుల బంగారానికి గిరాకీ ఏర్పడింది. -
‘న్యుబెవాక్స్ 14’ టీకాపై క్లినికల్ పరీక్షల్లో సానుకూల ఫలితాలు
చిన్న పిల్లల్లో న్యుమోకాకల్ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ.లిమిటెడ్ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. -
ఆఖర్లో అమ్మకాలు
ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో, మంగళవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. -
రిటైల్ మదుపర్ల కోసం కార్పొరేట్ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!
కార్పొరేట్ బాండ్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. -
అర్బన్వర్క్ నుంచి కొత్త ఫ్లెక్సీ కేంద్రం
కంపెనీలకు ఫ్లెక్సీ కార్యాలయ స్థలాన్ని అందించే అర్బన్వర్క్, హైదరాబాద్ రహేజా మైండ్స్పేస్లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. -
ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్ టికెట్ బుకింగ్ అగ్రిగేటర్, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్ వెల్లడించింది. -
గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. -
2024-25లోనే ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకుంటాం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే (2024-25) యూకో బ్యాంక్లో ప్రభుత్వ వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు.. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) అశ్వని కుమార్ తెలిపారు. -
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లాభంలో 37% వృద్ధి
బ్యాటరీల సంస్థ ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మార్చి త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.208 కోట్లతో పోలిస్తే ఇది 37% అధికం. -
సగానికి తగ్గిన ఐఓసీ లాభం
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జనవరి- మార్చి త్రైమాసిక నికర లాభం సగానికి పైగా తగ్గి రూ.4,837.69 కోట్లకు పరిమితమైంది. -
సంక్షిప్తవార్తలు (8)
సనోఫి ఇండియా మనదేశంలో మధుమేహ వ్యాధికి సొలిక్వా అనే మందును విడుదల చేసింది. ఈ మందుకు ఈ ఏడాది ప్రారంభంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నుంచి అనుమతి తీసుకుంది. -
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్లో ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్ ఉండనుంది. -
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ రిస్క్ తీసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. జెఫ్ బెజోస్ నుంచి నేర్చుకున్న విలువైన పాఠం గురించి తాజాగా ఓ పాడ్కాస్ట్లో పంచుకున్నారు.