వీరి వ్యాపారానికి.. సతీమణి సంపాదనే తొలి పెట్టుబడి..!
కష్టపడి పనిచేసి భర్త వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిన అందించిన మహిళలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో కొంత మంది గురించి తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో ఇప్పటికీ పితృస్వామ్య వ్యవస్థే ఆచారంలో ఉంది. అంటే కుటుంబ పెద్దగా పురుషులే కొనసాగుతున్నారు. మగవారు సంపాదిస్తే ఆడవాళ్లు ఇంటిని చక్కబెట్టాలన్న సంప్రదాయం ఇప్పటికీ చాలా ఇళ్లల్లో అమల్లో ఉంది. అయితే, కాలం గడుస్తున్న కొద్దీ ఈ విషయంలో మార్పొస్తోంది. ముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడుతున్న నేటి యువత ఇంట్లో ఇద్దరూ కష్టపడాలనే నియమాన్ని పాటిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలూ అందుకు ఓ కారణమని చెప్పాలి.
ఎన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నా.. కుటుంబం కోసం, అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం భర్తవైపు గట్టిగా నిలబడి సపోర్ట్ చేస్తున్న మహిళలు అనేక మంది ఉన్నారు. పురుషులు తమ వ్యాపకాల్లో, లక్ష్య సాధనలో నిమగ్నమై ఉంటే.. కుటుంబ బాధ్యతల్ని భుజాన వెసుకున్నవారి గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అంతేనా.. కష్టపడి సంపాదించి భర్త కలల్ని సాకారం చేసిన త్యాగమూర్తులూ ఉన్నారు. వ్యాపారానికి కావాల్సిన తొలిపెట్టుబడిని అందించి భర్త విజయానికి శ్రీకారం చుట్టిన స్త్రీలూ ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి తాజాగా రిచా సింగ్ అనే ట్విటర్ యూజర్ గుర్తుచేశారు.
ఆమె సంపాదిస్తే.. నేను ఖర్చు చేస్తా..
‘నా భార్య సంపాదిస్తుంది, నేను ఖర్చు చేస్తాను’.. ఓ కార్యక్రమంలో ఫ్లాట్హెడ్స్ సహ- వ్యవస్థాపకుడు గణేశ్ బాలకృష్ణన్ చెప్పిన మాటలివి. అయితే, ఆయన దీన్ని కాస్త సిగ్గుపడుతూ చెప్పారు. ‘‘భార్య వేతనంతో జీవిస్తున్నానని చెప్పడాన్ని భారతీయ సమాజం ఎలా చూస్తుందో నేను అర్థం చేసుకోగలను’’ అని రిచాసింగ్ కామెంట్ చేయడం గమనార్హం. గణేశ్తో పాటు భార్య నుంచి ఆర్థిక సాయం పొందిన మరో ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలను కూడా రిచా సింగ్ ప్రస్తావించారు.
సుధామూర్తి పెట్టుబడితోనే..
ఇన్ఫోసిస్ సహ- వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన సతీమణి సుధామూర్తి ఇచ్చిన తొలిపెట్టుబడితోనే కంపెనీని ప్రారంభించినట్లు రిచాసింగ్ గుర్తుచేశారు. అంతకుముందు నారాయణమూర్తి తాను సొంతంగా ప్రారంభించిన వ్యాపారంలో విఫలమైనట్లు తెలిపారు. అప్పట్లో రూ. 10,000 అప్పుగా ఇచ్చి సుధామూర్తి ఇన్ఫోసిస్లో తొలి ఇన్వెస్టర్గా మారారని పేర్కొన్నారు.
ఓలా క్యాబ్స్ సీఈఓ భవీష్ అగర్వాల్ సైతం మొదట్లో తన భార్య రాజలాక్షి అగర్వాల్ నుంచి ఆర్థిక సాయం పొందారని రిచాసింగ్ తెలిపారు. ఓలా ప్రారంభించిన తొలినాళ్లలో ఆర్డర్లు అధికంగా ఉన్నప్పుడు ఆమె కారు తీసుకుని క్యాబ్గా వాడుకునేవారని పేర్కొన్నారు.
జీవిత భాగస్వామితోనే జీవిత గమనం..
ఇలా తమ జీవితభాగస్వాముల నుంచి సాయం తీసుకున్నవారిలో చాలా మంది అంకుర సంస్థల వ్యవస్థాపకులు కూడా ఉన్నారని రిచాసింగ్ తెలిపారు. ‘‘మన జీవిత గమనం.. మనం వివాహం చేసుకున్న వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది’’ అనే మాట నిజమేనని ఆమె అభిప్రాయపడ్డారు. రిచాసింగ్ చేసిన ఈ పోస్ట్కు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. భారతీయ సమాజం అంతగా గుర్తించని ఓ ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నౌకరీ.కామ్ను స్థాపించడానికి సంజీవ్ భిఖ్చందానీ సైతం తన భార్య మద్దతు తీసుకున్నారని మరో ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు. అలాగే తనకూ తన జీవిత భాగస్వామి ఎంతో సహకారం అందిస్తోందని మరో యూజర్ స్పందించారు. మరో ఉద్యోగం వెతుక్కోకుండానే తాను ఇటీవల ఉన్న జాబ్కు రాజీనామా చేశానని తెలిపారు. అది తన భార్య ఇచ్చిన భరోసా వల్లే సాధ్యమైందని చెప్పారు.
వీళ్లే కాదు.. ఏమాత్రం గుర్తింపు ఆశించకుండా కుటుంబం కోసం కష్టపడి పనిచేసే ఎంతో మంది మహిళల్ని మనం మన నిత్యజీవితంలో చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్లందరికీ మనం కచ్చితంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.