Budget 2023: నిర్మలా సీతారామన్ జట్టులో కీలక సభ్యులు వీరే
Team behind Union Budget 2023: ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై మధ్య తరగతి భారీ ఆశలే పెట్టుకుంది. దీంతో బడ్జెట్ను రూపొందించడం నిర్మలమ్మకు సవాలే. మరి బడ్జె్ట్ రూపకల్పనలో ఆమెకు ఎవరెవరు సహాయ పడతారో ఇప్పుడు చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ (Budget 2023)ఇది. 2024 ఎన్నికలకు ముందు మరో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉన్నా అది కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకోవడమే. కాబట్టి ఓ విధంగా మోదీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ (Budget 2023) కానుంది. సాధారణంగా రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగినప్పుడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సహజం. దీనికితోడు గత బడ్జెట్లలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రకటనలేవీ లేవు. కాబట్టి ఈసారి మధ్యతరగతిని ఆకట్టుకుంటూనే ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలి. కాబట్టి ఓ విధంగా నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) ఇది ఓ విధంగా కత్తిమీద సామే. ప్రజాకర్షక బడ్జెట్ను రూపొందించడం ఆమె ముందున్న సవాల్. ఇందుకోసం నిర్మలా సీతారామన్, ఆమె టీమ్ గట్టి కసరత్తే చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆమె టీమ్లో ఎవరు ఉన్నారు? వారి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం..
నిర్మలా సీతారామన్
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను నిర్మలా సీతారామన్కు అప్పగించారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన నిర్మల.. కెరీర్ తొలినాళ్లలో లండన్లోని ఓ స్టోర్లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్లో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా, తర్వాత రక్షణశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. రెండేళ్ల పాటు కొవిడ్ మహమ్మారి పట్టి పట్టి పీడించగా.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సైతం దేశ ఆర్థికానికి సవాల్ విసురుతోంది. ఈ సవాళ్లన్నింటినీ దాటుకుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ను తీర్చిదిద్దడం నిర్మలమ్మదే కీలక బాధ్యత.
టీవీ సోమనాథన్ (ఆర్థిక శాఖ కార్యదర్శి)
తమిళనాడు కేడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్. గతంలో కార్పొరేట్ వ్యవహారాల జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2015-17 మధ్య ప్రధాని కార్యాలయంలోనూ పనిచేశారు. కలకత్తా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేసిన సోమనాథన్ ప్రపంచ బ్యాంక్లోనూ విధులు నిర్వర్తించారు. బడ్జెట్ బృందంలోని కీలక వ్యక్తుల్లో అత్యంత సీనియర్ ఈయనే. ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది ఈయనే. మరి ఈసారి బడ్జెట్ ఖర్చులను ఎలా రూపొందిస్తారో చూడాలి.
అజయ్ సేథ్ (ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి)
నిర్మలా సీతారామన్ బృందంలో కీలక వ్యక్తి ఈయన. 1987 కర్ణాటక కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అజయ్ సేథ్.. 2021 ఏప్రిల్ 15న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు బెంగళూరు మెట్రో మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరించారు. దేశ ఆర్థిక వనరులను సమర్థంగా వినియోగించడంలో కేంద్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయడంలో ఈయనే కీలకం. ఇక బడ్జెట్ తయారీ విషయంలో డేటా అంతటినీ ఈయనే తనిఖీ చేయనున్నారు.
తుహిన్ కాంత పాండే (పెట్టుబడుల ఉపసంహరణ కార్యదర్శి)
మోదీ ప్రభుత్వ హయాంలో తరచూ వినిపించే పేర్లలో తుహిన్ కాంత్ పాండే పేరు ఒకటి. పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఈయనే కీలకం. ఎయిరిండియా విక్రయంలో తుహిన్ కాంత పాండే కీలక పాత్ర పోషించారు. అయితే, గత కొన్నాళ్లుగా పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చిన మోదీ సర్కారు.. ఈసారి ఆ స్థాయి దూకుడును కనబరచకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. ప్రైవేటీకరణకు ఈసారి కాస్త బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన వాటిని పూర్తి చేయడం మినహా కొత్త ప్రకటనలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
సంజయ్ మల్హోత్రా (రెవెన్యూ సెక్రటరీ)
1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా ఫైనాన్షియల్ విభాగం నుంచి ఇటీవల రెవెన్యూ డిపార్ట్మెంట్కు మారరు. రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పన్ను అంచనాలు రూపొందించడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన ప్రకటనల్లో కీలక పాత్ర ఈయనదే.
వివేక్ జోషి (ఆర్థిక సేవల కార్యదర్శి)
1989 బ్యాచ్ హరియాణా కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి వివేక్ జోషి. ఇంటర్నేషనల్ ఎకనమిక్స్లో ఎంఏ, పీహెచ్డీ చేశారు. సంజయ్ మల్హోత్రా స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టారు. బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా సంస్థలు వంటివి ఈయన చూసే ఆర్థిక సేవల విభాగంలోకి వస్తాయి. జన్ధన్ యోజన, ప్రధాని మంత్రి బీమా యోజన, ప్రధాన మంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీమ్ వంటి పథకాలన్నీ ఈ విభాగం పరిధిలోకే వస్తాయి.
అనంత నాగేశ్వరన్ (ముఖ్య ఆర్థిక సలహాదారు)
బడ్జెట్ తయారీలో మరో కీలక వ్యక్తుల్లో అనంత నాగేశ్వరన్ ఒకరు. యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్ నుంచి ఫైనాన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 2022-23కు కొద్ది రోజుల ముందు ముఖ్య ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్న ఆర్థిక సర్వేను రూపొందించడంలో ఈయన పాత్రే కీలకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!