Coffee Badging: కాఫీ బ్యాడ్జింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్!
Coffee Badging: క్వైట్ క్విట్టింగ్, రేజ్ అప్లయింగ్, గ్రేట్ రెసిగ్నేషన్ తరహాలో తాజాగా మరో కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అదే కాఫీ బ్యాడ్జింగ్. అదేంటో చూద్దాం..!
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. పని ప్రదేశం, సమావేశాలు, నియామక విధానం.. ఇలా అన్నీ మారాయి. ఉద్యోగుల పనితీరులోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా మంది ఇంటి నుంచి పనిచేయడానికి (Work from Home) అలవాటు పడ్డారు. ఈ క్రమంలో క్వైట్ క్విట్టింగ్, రేజ్ అప్లయింగ్, గ్రేట్ రెసిగ్నేషన్.. ఇలా అనేక కొత్త ధోరణలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఉద్యోగులందరినీ కంపెనీలు ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. దీంతో తాజాగా మరో కొత్త పోకడ తెరపైకి వచ్చింది. అదే కాఫీ బ్యాడ్జింగ్ (Coffee Badging).
ఆఫీసుకు కచ్చితంగా రావాలని (Return to office) కంపెనీలు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కొంత మంది ఉద్యోగులు ఈ కాఫీ బ్యాడ్జింగ్ (Coffee Badging) అనే విధానాన్ని అవలంబిస్తున్నారు. దీని ప్రకారం.. ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి తొలుత తమ ఐడీని స్వైప్ చేస్తారు. తర్వాత సహచరులతో కలిసి కాఫీ ఉండే ప్రదేశానికి వెళతారు. అక్కడే వారితో మాట్లాడుతూ.. కాఫీ తాగుతూ కొంత సమయం గడుపుతారు. ఇతరుల దృష్టిలో పడేలా అలా అటూఇటూ తిరుగుతారు. ముఖ్యంగా తమ మేనేజర్లు లేదా హెచ్ఆర్లు తమని గమనించేలా చూస్తారు. తర్వాత నేరుగా డెస్క్కు వచ్చి ఇంటికి బయలుదేరతారు. ఆఫీసులకు రావడాన్ని తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ కొంత మంది ఉద్యోగులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఆఫీసుకు రావడానికి అయ్యే సమయం, డబ్బును వెచ్చించడానికి WFHకు అలవాటుపడ్డ ఉద్యోగులు ఇష్టపడడం లేదని తాము నిర్వహించిన సర్వేలో తేలిందని ‘ఓల్ ల్యాబ్స్’ అనే సంస్థ తెలిపింది. పైగా ఇంకా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఒత్తిడిలేని, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించడం లేదని పేర్కొంది. ఇది కూడా ఒక కారణమని వివరించింది. సమావేశాలు, చర్చలు, నివేదికలు.. ఇలా అన్ని పనులు ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో సమర్థంగా చేయగలుగుతున్నామని ఉద్యోగులు సర్వేలో పేర్కొన్నారు. ఆఫీసుకు వెళ్లడం వల్ల వీటి విషయంలో ఉత్పాదకత తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ కాఫీ బ్యాడ్జింగ్ (Coffee Badging) వల్ల ప్రతికూల ప్రభావమూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్తవారు, కచ్చితంగా ఆఫీసు నుంచి పనిచేయాల్సిన వారిలో ఒకరకమైన నైరాశ్యం ఆవహిస్తుందని తెలిపారు. ఇతరులతో పోల్చినప్పుడు తమకు సౌకర్యవంతమైన అవకాశాలు లేవని వారు భావించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఇది ఒక ప్రతికూల పని సంస్కృతికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పైగా ఆఫీసుకు వెళ్లడం ఒక పెద్ద పనిభారం అనే భావన ఉద్యోగుల్లో పాతుకుపోతుందని పేర్కొన్నారు. మరోవైపు కాఫీ బ్యాడ్జింగ్ దీర్ఘకాలం కొనసాగితే.. కంపెనీలు దీన్ని తీవ్రంగా పరిగణించే ప్రమాదం ఉందని తెలిపారు. వారిపై క్రమశిక్షణ చర్యలకూ దారి తీయొచ్చని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?