ChatGPT CEO: లాభాపేక్షనా? ఆధిపత్య పోరా? ఆల్టమన్ తొలగింపు కారణమేంటి?
Sam altman: చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓగా ఆల్టమన్ తొలగింపు టెక్ వర్గాల్లో సంచలనానికి కారణమైంది. బోర్డు చెప్తున్న కారణం ఒకటైతే.. ఆల్టమన్ వైఖరి పట్ల కొందరికి భిన్నాభిప్రాయాలే దీనికి ముఖ్య కారణమని టెక్ వర్గాలు కోడైకూస్తున్నాయి.
ChatGPT CEO | ఇంటర్నెట్ డెస్క్: చాట్జీపీటీ పేరుతో ఏఐ ఆధారిత చాట్బాట్ సేవలను ప్రారంభించి టెక్ వర్గాల్లో సంచలనానికి వేదికగా నిలిచిన ఓపెన్ ఏఐ.. మరోసారి వార్తల్లోకెక్కింది. ఇన్నాళ్లు సీఈఓగా వ్యవహరించిన శామ్ ఆల్టమన్ను (Sam altman) బోర్డు ఉన్నపళంగా తొలగించడంపై చర్చనీయాంశమైంది. కాసేపటికే ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్మన్ (Greg Brockman) కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆల్టమన్ను తొలగించిన కారణంగానే గ్రెగ్ తన పదవి నుంచి వైదొలిగారు. బోర్డుతో విషయాలేవీ పంచుకోవడం లేదని, తాము తీసుకునే నిర్ణయాలను ఆల్టమన్ అడ్డుకుంటున్నాడన్నది బోర్డు ఆరోపణ. కానీ, ఆల్టమన్ తొలగింపునకు వేరే కారణాలున్నాయంటున్నాయి టెక్ వర్గాలు.
నాన్ ప్రాఫిట్ టు ప్రాఫిట్
2015లో ఓపెన్ ఏఐని నెలకొల్పినప్పుడు దీన్నొక లాభాపేక్షలేని సంస్థగా తీర్చిదిద్దాలని వ్యవస్థాపకులు అనుకున్నారు. ఆల్టమన్తో పాటు సుత్స్కేవర్, ఎలాన్ మస్క్, పలువురు వ్యవస్థాపకులుగా ఉన్నారు. మానవాళికి సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐని అందించాలని అనుకున్నారు. అయితే, 2019లో ఆల్టమన్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాక పరిస్థితి మారింది. దీన్నో పెద్ద కంపెనీలా మార్చాలన్నది అతడి కల. ఇందుకోసం మైక్రోసాఫ్ట్వంటి పెద్ద కంపెనీ నుంచి భారీగా నిధులు సేకరించాడు. అంతేకాదు.. కంపెనీ ఆశయాలకు గండికొడుతూ ఓపెన్ ఏఐని లాభాదాయకమైన ఓ వ్యాపారంగా మార్చాలని అనుకున్నాడు. దీనిపట్ల బోర్డులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
చాట్జీపీటీ సృష్టికర్త తొలగింపు.. ఆ వెంటనే ఓపెన్ఏఐ సహ-వ్యవస్థాపకుడి రాజీనామా
దూకుడు..
మరోవైపు ఏఐ వల్ల కలిగే దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆల్టమన్ దూకుడుగా ముందుకెళ్లడమూ మరో కారణమని సిలికాన్ వ్యాలీ వర్గాలు పేర్కొంటున్నాయి. చాట్జీపీటీ, ఇతర సర్వీసులకు సంబంధించిన భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా అతడు ముందుకెళ్లేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల సొంత జీపీటీలను డెవలప్ చేసుకునేలా కొన్ని ప్లగ్ ఇన్లను చాట్జీపీటీలో ఓఎన్ఏఐ తీసుకొచ్చింది.దీంతో వెబ్సైట్కు యూజర్లు పోటెత్తడంతో కొన్ని గంటల పాటు చాట్జీపీటీ నిలిచిపోయింది. దీంతో ప్లగ్ ఇన్స్కు సైనప్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆల్టమన్ ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఇలా ఆల్టమన్ దూకుడూ ఉద్వాసనకు మరో కారణమైంది.
సహ వ్యవస్థాపకుడితో పేచీ
ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన కంపెనీ చీఫ్ సైంటిస్ట్ సుత్స్కేవర్కు, ఆల్టమన్ మధ్య విభేదాలు సైతం మరో కారణమని చెప్పుకొంటున్నారు. భద్రత, కమర్షిలైజ్ చేయడం వంటి విషయాల్లో వీరికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, సూపర్ ఇంటిలిజెంట్ పేరిట ఓ కొత్త టీమ్ను సుత్స్కేవర్ ఈ ఏడాది జులైలో ప్రారంభించారు. అయితే, ఓ నెల క్రితం ఆయన బాధ్యతలకు కంపెనీ కోత వేసింది. దీంతో ఆల్టమన్, ఆయనకు మద్దతుగా నిలిచిన గ్రెగ్ బ్రాక్మన్కూ, సుత్స్కేవర్కూ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయని, అవే ఆల్టమన్ను ఉద్వాసనకు దారితీశాయని సంబంధిత వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఇదంతా బోర్డు నిర్ణయమంటూ సుత్స్కేవర్ కొట్టి పారేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం
-
యువ రోహిత్ను చూశారా.. బర్త్డే గిఫ్ట్గా టీనేజ్ ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM