బ్రేకింగ్

breaking
02 Dec 2022 | 15:43 IST

Stock Market: 8 రోజుల వరుస లాభాలకు బ్రేక్..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల లాభాల జోరుకు కళ్లెం పడింది. వరుసగా 8రోజులు దూసుకెళ్లిన సూచీలు శుక్రవారం డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 415.69 పాయింట్లు నష్టపోయి 62,868.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 116.40 పాయింట్ల నష్టంతో 18,696.10 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.31గా నిలిచింది. విప్రో, ఐటీసీ, టీసీఎస్‌, నెస్లే ఇండియా, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోగా.. హెచ్‌సీఎల్‌, టాటాస్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని

తాజా వార్తలు