స్టార్ల స్టార్టప్స్.. పట్టేశాయి యూనికార్న్ స్టేటస్!
దేశంలో స్టార్టప్ల్లో సెలబ్రిటీలు పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. సినీ ప్రముఖులు అమితాబ్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, క్రికెటర్లు సచిన్, ధోనీ, విరాట్ వివిధ స్టార్టప్ల్లో పెట్టుబడి పెట్టిన వారే. 110కి పైగా స్టార్టప్ల్లో భారత ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
క్రికెట్, సినిమా రంగాల్లో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అందులో విజయవంతం అయ్యేది కొందరే. ఆయా రంగాల్లో రాణించిన కొందరు వ్యాపారాలు చేయడం కొత్తేమీ కాదు. అలాంటిది కేవలం ఆలోచనే వ్యాపారంగా మొదలయ్యే స్టార్టప్ల్లో పెట్టుబడి అంటే కాస్త రిస్క్తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి వాటిలోనూ పెట్టుబడి పెట్టిన కొందరు క్రికెట్, సినీ ప్రముఖులు సక్సెస్ అయ్యారు. అంతేకాదు వారు పెట్టుబడి పెట్టిన కంపెనీలు యూనికార్న్ స్టేటస్ను సాధించాయి.
దేశంలో స్టార్టప్ల్లో సెలబ్రిటీలు పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. సినీ ప్రముఖులు అమితాబ్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, క్రికెటర్లు సచిన్, ధోనీ, విరాట్ వివిధ స్టార్టప్ల్లో పెట్టుబడి పెట్టిన వారే. 110కి పైగా స్టార్టప్ల్లో భారత ప్రముఖుల పెట్టుబడులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారి స్టార్డమ్ ఓ విధంగా ఆయా కంపెనీల వృద్ధికి దోహదం చేస్తుంటాయి. ఈక్విటీకి బదులుగా చిన్న వ్యాపార సంస్థల్లో ఇన్వెస్ట్ చేసే వారిని ఏంజెల్ ఇన్వెస్టర్లు అంటారు. అలా సినీ, క్రికెట్ ప్రముఖులు ఏంజెల్ ఇన్వెస్టర్లుగా ఉన్న ఆరు స్టార్టప్లు 1 బిలియన్ డాలర్లు కంపెనీలుగా మారాయి. ఆ కంపెనీలు, సెలబ్రిటీల వివరాలు ఇవీ..
- 2018లో ప్రారంభమైన మొబైల్ ప్రీమియర్ లీగ్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లో క్రికెటర్ విరాట్కు పెట్టుబడులు ఉన్నాయి. 2019లో విరాట్ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. 2021లో 150 మిలియన్ డాలర్లు నిధులను ఈ కంపెనీ సమీకరించింది. దీంతో 2.3 బిలియన్ డాలర్ల వాల్యూషన్తో యూనికార్న్ క్లబ్లో చేరింది.
- డిజిటల్ ఇన్సురెన్స్ కంపెనీ అయిన ‘డిజిట్ ఇన్సురెన్స్’ 2016లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో విరుష్క జోడీకి పెట్టుబడులు ఉన్నాయి. 2020లో ఈ జంట పెట్టుబడి పెట్టింది. 2021లో 1.9 బిలియన్ డాలర్ల వాల్యూషన్తో ఈ కంపెనీ యూనికార్న్గా అవతరించింది.
- ప్రీ ఓన్డ్ కార్స్ విక్రయాలు, ఫైనాన్సింగ్ చేపట్టే కార్స్24 సంస్థ 2015లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో మహేంద్ర సింగ్ ధోనీ 2019లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా మారారు. అంతేకాదు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గానూ మహీ వ్యవహరిస్తున్నారు. 2020లో 200 మిలియన్ డాలర్లను కంపెనీ సమీకరించింది. 1 బిలియన్ డాలర్ల వాల్యూషన్తో యూనికార్న్ స్టేటస్ సంపాదించింది.
- ఆన్లైన్ మేకప్ బ్రాండ్ మైగ్లామ్ 2017లో ప్రారంభమైంది. 2021 నవంబర్లో ఈ కంపెనీ యూనికార్న్ స్టార్టప్గా హోదా సాధించింది. ఈ స్టేటస్ సాధించిన తొలి బ్యూటీ కామర్స్ స్టార్టప్ కూడా ఇదే. ఈ స్టేటస్ సాధించడానికి కొన్ని నెలల ముందు 2021 జూన్లో శ్రద్ధా కపూర్ పెట్టుబడి పెట్టారు.
- పాత కార్లను విక్రయించే సంస్థ స్పిన్నీలో మాజీ సచిన్ తెందూల్కర్గా పెట్టుబడి పెట్టారు. 2015లో ప్రారంభమైన ఈ కంపెనీలో 2021 డిసెంబర్లో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాదు బ్రాండ్ అంబాసిడర్గానూ అవతారమెత్తారు. సచిన్ పెట్టుబడి పెట్టడానికి కొన్ని రోజుల ముందే 2021 నవంబర్లో ఈ కంపెనీ 285 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా యూనికార్న్ క్లబ్లో చేరింది.
- స్టాక్బ్రోకర్ అయిన అప్స్టాక్స్లో క్రికెటర్ శిఖర్ ధావన్ 2022లో ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఏడాది ముందే అంటే 2021 నవంబర్లోనే ఈ సంస్థ యూనికార్న్ క్లబ్లో చేరింది.
వీరే కాదు.. బాలీవుడ్ ప్రముఖులైన శిల్పా శెట్టి ఏడు స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టారు. ఐశ్వర్యారాయ్ బచ్చన్, అమితాబ్, శ్రద్ధా కపూర్ ఆరేసి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అనుష్కశర్మకు మొత్తం ఐదు అంకురాల్లో పెట్టుబడులు ఉన్నాయి. నటుడు, క్రికెటర్ వ్యాఖ్యాత గౌరవ్ కపూర్ అయితే ఏకంగా 19 స్టార్టప్ల్లో పెట్టుబడి పెట్టారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?