బోయింగ్ మ్యాక్స్ విమానాలకేమైంది?
విమానం ఎక్కాలని ఎవరికుండదు. అయితే అలా ప్రయాణిస్తున్నపుడు విమానం తలుపు ఊడి పడిపోతే... ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. మరి అలస్కా ఎయిర్లైన్స్లో ఇటీవల ప్రయాణించిన వారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందంటారు.
తలుపు ఊడిపోయిన సంఘటనతో సర్వత్రా ఆందోళన
చాలా దేశాల్లో ఆ సిరీస్ కార్యకలాపాలు బంద్
విమానం ఎక్కాలని ఎవరికుండదు. అయితే అలా ప్రయాణిస్తున్నపుడు విమానం తలుపు ఊడి పడిపోతే... ఊహించడానికే భయంకరంగా ఉంది కదా. మరి అలస్కా ఎయిర్లైన్స్లో ఇటీవల ప్రయాణించిన వారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందంటారు. ఈ ఘటన తర్వాత పలు దేశాలకు చెందిన విమానయాన కంపెనీలు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను.. ముఖ్యంగా మ్యాక్స్ 9 విమానాల కార్యకలాపాలను పక్కన పెట్టేశాయి. ఇంతకీ బోయింగ్కే ఎందుకీ సమస్యలు వస్తున్నాయి?
ఇదొక్క ఘటనే కాదు.. 2018, 2019లలో రెండు బోయింగ్ మ్యాక్స్ సిరీస్ విమానాల దుర్ఘటనలు ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. ఇండోనేషియాలో ఒకటి, ఇథియోపియాలో ఒకటి కూలి వందల మంది ప్రాణాలను తీశాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే..
అలస్కా ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం అమెరికాలోని పోర్ట్లాండ్ నుంచి జనవరి 5న కాలిఫోర్నియాకు బయలుదేరింది. 171 మంది ఆ సమయంలో ప్రయాణిస్తున్నారు. విమానం 16,000 అడుగుల ఎత్తుకు చేరగానే.. ఎడమవైపున్న తలుపు ఊడిపోయింది. వెంటనే వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదనపు అత్యవసర మార్గం స్థానంలో ఒక ప్లగ్ లేదా ప్యానెల్ను ఆ విమానంలో ఉపయోగించారు. 220 మంది ప్రయాణించగల ఆ విమానానికి నిబంధనల ప్రకారం.. అత్యవసర మార్గాలనూ ఏర్పాటు చేశారు. లేఅవుట్కు సులువుగా ఉండేలా ప్యానెల్/ప్లగ్ను అత్యవసర మార్గంలా ఏర్పాటు చేశారు. అదే ఇక్కడ ఊడిపోయింది.
అంతక్రితమూ ఇలా జరిగిందా?
మ్యాక్స్ 9 విమానాల్లో ఇలా తొలిసారి జరిగిందా అన్న ప్రశ్నలూ వచ్చాయి. ఒక వేళ ఇదొక్కటే ఈ తరహా సంఘటన అయి ఉంటే మాత్రం డోర్ను బిగించడంలో వైఫల్యమనే చెప్పాలని అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్(ఎన్టీఎస్బీ) మాజీ సభ్యుడిని ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, ఎన్టీఎస్బీ 737 మ్యాక్స్ 9 తయారీ ప్రక్రియను పరిశీలిస్తుందని.. డోర్/ప్లగ్కు చెందిన హింజ్లు, స్టాప్ ఫిటింగ్లతో పాటు కేబిన్ ప్రెజరైజేషన్ను సైతం పరిశీలిస్తుందని అందులో తెలిపింది. కనీసం ఒక బోల్ట్ అయినా ఊడిపోయి ఈ సంఘటన జరిగి ఉండాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా..
అలస్కా ఘటన తర్వాత 171 వరకు ‘మ్యాక్స్ 9’ విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసింది. అమెరికానే కాదు.. పనామా, తుర్కియే, మెక్సికో దేశాలూ ఈ సంఘటన తర్వాత ‘737 మ్యాక్స్ 9’ విమానాలను నిలిపివేశాయి. చైనాలో ఎటువంటి మ్యాక్స్ 9 సిరీస్ విమానాలు లేనప్పటికీ.. 2018, 2019 దుర్ఘటనల తర్వాత ఇతర మ్యాక్స్ సిరీస్ విమానాలన్నిటినీ పక్కన పెట్టింది.
ఆ డోర్ల సరఫరాదారుకూ సమస్యలే..
బోయింగ్ 737 ఫ్యూజ్లేజెస్ను బోయింగ్ మాజీ అనుబంధ కంపెనీ అయిన స్పిరిట్ ఏరోసిస్టమ్స్ తయారు చేస్తోంది. తాజాగా అలస్కా సంఘటనలోని విమానానికి డోర్ ప్లగ్లను ఈ కంపెనీయే ఇన్స్టాల్ చేసింది. 737 ఫ్రేమ్సెట్లో 70 శాతం వరకు స్పిరిట్ నిర్మిస్తుందని ఆ కంపెనీ వెబ్సైట్ చెబుతోంది. వీటిని బోయింగ్ ఫ్యాక్టరీకి ఈ కంపెనీ పంపుతుంది. అక్కడ రెక్కలు, తోక, ఇంటీరియర్స్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ఈ స్పెషల్ డోర్ అసెంబ్లీని ఇంటీరియర్స్ కోసం తీసివేసి ఆ తర్వాత బిగిస్తారు. ఆ సమయంలో సరైన తనిఖీలు జరగాల్సి ఉంటుంది. మరో పక్క, స్పిరిట్ కూడా కరోనా నుంచీ ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మ్యాక్స్ సిరీస్, డ్రీమ్లైనర్ విమానాల సమస్యల వల్ల ఈ కంపెనీ ఒత్తిడికి గురైంది.
బోల్టులే కాదు.. నియంత్రణలూ లూజే
ఇప్పటిదాకా జరిగిన సంఘటనల్లో బోయింగ్పై గట్టి చర్యలే తీసుకుని ఉండాలి. అయితే నియంత్రణలో లేని లోపాల కారణంగా ఆ దిశగా అడుగులు పడలేదు. 2018, 2019 దుర్ఘటనల తర్వాత అప్పటి సీఈఓను తొలగించారు. అదీ ఏడాదిన్నర తర్వాత. ట్రంప్ ప్రభుత్వం ఆ కంపెనీపై 2.5 బి.డాలర్ల అపరాధ రుసుమును విధించింది. సాఫ్ట్వేర్ మార్పులను ఎఫ్ఏఏకు తెలియజేయడంలో విఫలమైనందుకు ఎటువంటి క్రిమినల్ చర్యలూ చేపట్టలేదు. కాబట్టి విమాన డోర్ బోల్ట్లనే కాదు.. నియంత్రణలనూ పట్టించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
భారత్పై ప్రభావం ఏమిటి?
అలస్కా ఘటనను మన దేశమూ తీవ్రంగానే పరిగణించింది. దేశంలోని అన్ని విమానయాన కంపెనీలు తక్షణం మ్యాక్స్ 9 విమానాలన్నిటినీ తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈ తనిఖీలు సంతృప్తికరంగా జరిగాయని ప్రకటించింది. ప్రస్తుతానికైతే ఏ ఇబ్బందీ లేదని తెలుస్తోంది. ఇక ఎయిరిండియా, ఇండిగోలు బోయింగ్ వద్ద పెట్టిన భారీ విమానాల ఆర్డర్లు ఈ సంఘటన వల్ల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఆకాశ ఎయిర్ 2024లో తొలి భారీ ఆర్డరును పెట్టనుందన్న వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో దీనిపై ఎటువంటి ప్రభావం ఉంటుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?